నాలుగో అంతస్తు నుంచి మరో భవనంపైకి దూకారు!
గుజరాత్లోని సూరత్లో ఓ టెక్స్టైల్ మిల్లులో అగ్నిప్రమాదం జరిగి 24గంటలు గడవక ముందే మరో ఘటన చోటుచేసుకుంది. సోమవారం ఐదంతస్తుల .....
సూరత్లో 24గంటల్లో రెండు అగ్నిప్రమాదాలు
సూరత్: గుజరాత్లోని సూరత్లో ఓ టెక్స్టైల్ మిల్లులో అగ్నిప్రమాదం జరిగి 24గంటలు గడవక ముందే మరో ఘటన చోటుచేసుకుంది. సోమవారం ఐదంతస్తుల భవనంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదం నుంచి తమ ప్రాణాల్ని కాపాడుకొనేందుకు ఇద్దరు వ్యక్తులు ఒక భవనం నుంచి మరో భవనంపైకి దూకినట్టు అధికారులు వెల్లడించారు. ఐదంతస్తుల భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్లో విద్యుత్ మీటర్ వద్ద షార్ట్ సర్క్యూట్ జరగడంతో పొగలు పైఅంతస్తులకు వ్యాపించాయి. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వగా వారు ఘటనా స్థలానికి చేరుకొనే లోపే ఓ మహిళ, పురుషుడు భయంతో తమ ఇంటి కిటికీలోంచి పక్కనే ఉన్న అపార్ట్మెంట్ పైకి దూకినట్టు అగ్నిమాపక శాఖ అధికారి నీలీస్ దవే తెలిపారు. ఈ ప్రమాదంలో వారికి ఎలాంటి గాయాలు కాలేదన్నారు. ఇరుకైన ప్రాంతంలో ఈ భవనం ఉండటంతో కింది ఫ్లోర్లో చెలరేగిన పొగలు పై అంతస్తులకు వ్యాపించాయని వివరించారు. దాదాపు తొమ్మిది మందిని టెర్రాస్పైకి చేర్చి ఆ తర్వాత కిందికి సురక్షితంగా తీసుకొచ్చామన్నారు. ఆరు అగ్నిమాపకశకటాలు ఘటనా స్థలానికి చేరుకొని పది నిమిషాల్లోనే మంటలను అదుపులోకి తీసుకొచ్చారని అధికారి తెలిపారు.
ఆదివారం రాత్రి 10గంటల సమయంలో పెండేసర పారిశ్రామిక ప్రాంతంలోని టెక్స్టైల్ మిల్లులోని మూడో అంతస్తులో మంటలు చెలరేగినట్టు ప్రాంతీయ అగ్నిమాపక శాఖ అధికారి రాజు గైక్వాడ్ తెలిపారు. తమకు అందిన సమాచారం మేరకు ఘటనా స్థలానికి 15 ఫైరింజన్లు చేరుకొని మంటలను అదుపుచేసినట్టు చెప్పారు. ఘటన సమయంలో మిల్లులోపల 12మంది కార్మికులు చిక్కుకోగా.. వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చినట్టు తెలిపారు. ఈ ఘటనలో ఇద్దరు అగ్నిమాపక సిబ్బందికి గాయాలైనట్టు ఆయన వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దర్యాప్తు బృందం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు నమోదు చేసింది. -
మంత్రి కాకాణి అనుచరుడి రైస్ మిల్లులో మద్యం స్వాధీనం
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో నాలుగు రోజుల క్రితం మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి అనుచరుడి వద్ద భారీగా మద్యం స్వాధీనం చేసుకున్న ఘటన మరువక ముందే తాజాగా పొదలకూరు మండలం విరువూరులో మరో అనుచరుడు చిర్రా రాజగోపాల్రెడ్డి రైస్మిల్లులో మద్యం నిల్వలను బుధవారం సెబ్, పోలీసు అధికారులు సీజ్ చేశారు. -
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ శివారు ఆకేరు వాగు వంతెన వద్ద వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ఇంటర్ విద్యార్థులు మృతి చెందారు. -
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
సూర్యాపేట జిల్లా కోదాడలో జాతీయరహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. -
కాలం చెల్లిన ఆర్టీసీ బస్సు బోల్తా
లక్షలాది కి.మీ. తిరిగిన బస్సులను స్క్రాబ్కు పంపకుండా రోడ్లపైకి పంపడం అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడినట్లే. శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం మామిళ్లపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం.. ప్రయాణికుల భద్రతను ప్రశ్నార్థకం చేసింది. -
పల్నాడులో తెదేపా కార్యకర్తలపై.. వైకాపా వర్గీయుల దాడి
`పల్నాడు జిల్లా ఈపూరు మండలం ఇనుమెళ్లలో వైకాపా వర్గీయుల దాడిలో తెదేపాకు చెందిన నలుగురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. -
గుంతలో పడి.. ఏకే 47 పేలి.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసుగుప్పలోని 81 బెటాలియన్ బేస్ క్యాంపు పరిధిలో బుధవారం ఏకే-47 తుపాకి ప్రమాదవశాత్తు పేలడంతో విధుల్లో ఉన్న అసిస్టెంట్ కమాండెంట్ ఎంవీ శేషగిరి(47) మృతి చెందారు. -
ఇంటర్లో ఫెయిలైన ఏడుగురు విద్యార్థుల బలవన్మరణం
ఇంటర్ పరీక్షల్లో ఫెయిలయ్యామని మనస్తాపంతో రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు బుధవారం బలవన్మరణానికి పాల్పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం