సిద్దిపేట జలాశయంలో హైదరాబాద్‌ యువకుల గల్లంతు

సిద్దిపేట కొండపోచమ్మ జలాశయంలో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు.

Published : 22 May 2022 14:07 IST

సిద్దిపేట: సిద్దిపేట కొండపోచమ్మ జలాశయంలో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. ఈత కోసం జలాశయంలో దిగిన యువకులు లోతు ఎక్కువగా ఉండటంతో మునిగిపోయారు. గల్లంతైన యువకులను హైదరాబాద్‌కు చెందిన అక్షయ్‌ వెంకట్‌(28), రాజన్‌ శర్మ(28)గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. స్థానికుల సాయంతో పోలీసులు యువకుల కోసం గాలిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని