crime news: అమానవీయం! వివస్త్రను చేసి.. ఊరేగించి!

జార్ఖండ్‌లోని డుంకా జిల్లాలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. అక్రమ సంబంధం నెరుపుతున్నారనే కారణంగా ఓ మహిళ, పురుషుడిని నగ్నంగా ఊరేగించారు.....

Published : 30 Sep 2021 01:23 IST

రాంచీ: జార్ఖండ్‌లోని డుంకా జిల్లాలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. అక్రమ సంబంధం నెరుపుతున్నారనే కారణంగా ఓ మహిళ, పురుషుడిని నగ్నంగా ఊరేగించారు. విషయం తెలుసుకున్న పోలీసులు దాదాపు 60 మందిపై కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. డుంకా జిల్లా బడ్తల్లి పంచాయతీ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన ఓ వివాహిత కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఓ నేరం కేసులో ఆమె భర్త ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. ఈ నేపథ్యంలో అదే గ్రామానికి చెందిన యువకుడితో పరిచయం ఏర్పడింది. అది కాస్తా అక్రమ సంబంధానికి దారితీసింది.

సదరు యువకుడు మంగళవారం ఆ మహిళ ఇంటికి వెళ్లడాన్ని గమనించిన స్థానికులు అతడిని పట్టుకొని బంధించారు. అనంతరం వారిద్దరినీ నగ్నంగా ఊరేగించారు. దాదాపు కిలోమీటరు మేర గ్రామం మొత్తం తిప్పారు. విషయం పోలీసుల దృష్టికి చేరడంతో వారు రంగంలోకి దిగారు. ఈ దుశ్చర్యలో భాగమైన 60 మంది గ్రామస్థులపై కేసు నమోదు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని