Crime news: భార్యపై కిరాతకం.. ఫ్రెండ్స్‌తో కలిసి రేప్‌ చేసి.. సిగరెట్లతో కాల్చి!

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఓ వివాహితపై జరిగిన ఘోరం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కట్టుకున్న భర్తే మృగంలా మారి తన స్నేహితులతో......

Published : 17 Jan 2022 01:42 IST

ఇండోర్‌లో మహిళపై ఘోరం.. ఐదుగురి అరెస్టు

ఇండోర్‌: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఓ వివాహితపై జరిగిన ఘోరం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కట్టుకున్న భర్తే మృగంలా మారి తన స్నేహితులతో కలిసి ఆమెపై అత్యంత కిరాతకానికి ఒడిగట్టాడు. 32 ఏళ్ల మహిళపై సామూహిక అత్యాచారం చేసి చిత్రహింసలకు గురిచేసిన ఘటనలో ఆమె భర్తతో పాటు మరో నలుగురు నిందితులను అరెస్టు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. తన భర్త, అతడి స్నేహితులు అసహజరీతిలో తనపై అత్యాచారం చేసి సిగరెట్లతో రహస్య భాగాల్లో కాల్చి టార్చర్‌ చేశారని ఆరోపిస్తూ ఆమె ఫిర్యాదు చేసినట్టు పోలీసులు తెలిపారు. లైంగిక దాడిని ప్రతిఘటిస్తే చంపేస్తామని బెదిరించారని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. ఇండోర్‌లోని షిప్రా పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఓ ఫాం హౌస్‌లో 2019 నవంబర్‌, 2021 అక్టోబర్‌లలో ఆమెపై లైంగిక దాడి జరిగినట్టు పోలీసులు తెలిపారు.

ఛత్తీస్‌గఢ్‌కు చెందిన మహిళ ఇండోర్‌కు చెందిన వ్యక్తిని మ్యాట్రీమోనీ సైట్‌ ద్వారా కలిసి వివాహం చేసుకుందని పోలీసులు వెల్లడించారు. అతడికి అప్పటికే వివాహం అయిందని తెలిపారు. అయితే, ఎలాగో ఆ ఫాం హౌస్‌ నుంచి తప్పించుకొని ఛత్తీస్‌గఢ్‌లోని తన తల్లిదండ్రుల ఇంటికి చేరుకున్నప్పటికీ.. నిందితుల్లో ఒకడు తనకు హాని కలిగించే ఉద్దేశంతో అనుసరిస్తుండేవాడని ఫిర్యాదులో పేర్కొన్నట్టు పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఆమె భర్తతో పాటు మొత్తం ఐదుగురు నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు.. మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌లలో పలు ప్రాంతాల్లో వారందరినీ అరెస్టు చేసినట్టు వెల్లడించారు. ఈ కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగుతోందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని