Crime: ‘పోర్న్ చూస్తాడు.. పాచి అన్నం పెడతాడు..వద్దంటే కొడతాడు’
అశ్లీల చిత్రాలు చూడటానికి అలవాటుపడ్డ భర్త తనను చిత్రహింసలకు గురిచేస్తున్నాడని, తనను కాపాడాలని ఓ మహిళ కోర్టును ఆశ్రయించిన ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. జయనగర్కు చెందిన 36 ఏళ్ల మహిళకు రెండేళ్ల కిందట వివాహమైంది. భారీగా కట్నకానుకలను ఇచ్చి ఆమె తల్లిదండ్రులు అంగరంగవైభవంగా
బెంగళూరు: అశ్లీల చిత్రాలు చూడటానికి అలవాటుపడ్డ భర్త తనను చిత్రహింసలకు గురిచేస్తున్నాడని, తనను కాపాడాలని ఓ మహిళ కోర్టును ఆశ్రయించిన ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. జయనగర్కు చెందిన 36 ఏళ్ల మహిళకు రెండేళ్ల కిందట వివాహమైంది. భారీగా కట్నకానుకలను ఇచ్చి ఆమె తల్లిదండ్రులు అంగరంగవైభవంగా పెళ్లి జరిపించారు. అయితే, అత్తారింట్లోకి అడుగుపెట్టిన తర్వాత తన భర్తకు అశ్లీల చిత్రాలు చూసే అలవాటు ఉందని తెలిసింది. అంతేకాదు.. రాత్రుళ్లు వేరే మహిళలతో చాటింగ్ చేస్తుండటాన్ని గమనించింది. ఈ పనులు మానుకోమని బాధితురాలు ఎంత చెప్పినా వినకపోగా.. తిరిగి చిత్రహింసలకు గురి చేయడం మొదలుపెట్టారు. కొట్టడంతోపాటు.. పాచిపోయిన ఆహారం తినాలని బలవంతం చేసేవారని బాధితురాలు తెలిపింది. విషయం భర్త తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లినా అతడికే మద్దతుగా నిలిచారని, కుటుంబ శుభకార్యాలకు తనను తీసుకెళ్లడం మానేశారని ఫిర్యాదులో వాపోయింది. దీనిపై స్పందించిన కోర్టు.. బాధితురాలి ఫిర్యాదుపై దర్యాప్తు చేసి, తగిన చర్యలు తీసుకోవాలని మహిళా పోలీసులను ఆదేశించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘జే బ్రాండ్’ మద్యం తాగి వృద్ధుడి మృతి
జే బ్రాండ్ మద్యం తాగి వృద్ధుడు మృతిచెందిన ఘటన వైఎస్సాఆర్ జిల్లాలోని మూలవంకలో మంగళవారం చోటుచేసుకుంది. -
హైదరాబాద్లో విషాదం.. బాచుపల్లిలో గోడకూలి ఏడుగురి మృతి
హైదరాబాద్లో విషాదం చోటుచేసుకుంది. గోడకూలి ఏడుగురు మృతిచెందారు. మంగళవారం సాయంత్రం రేణుక ఎల్లమ్మ కాలనీలో వర్షానికి గోడ కూలింది. -
ప్రైవేటు బస్సు బోల్తా.. పది మందికి గాయాలు
మహబూబ్నగర్ జిల్లాలో బుధవారం ఉదయం ప్రైవేటు బస్సు ప్రమాదానికి గురైంది. -
అప్పుల బాధతో ఇద్దరు రైతుల ఆత్మహత్య
రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాల్లో.. అప్పుల బాధతో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్న ఘటనలు చోటుచేసుకున్నాయి. -
వడదెబ్బతో ఆరుగురి మృతి
రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఆయా జిల్లాల్లో ఆరుగురు మృత్యువాతపడ్డారు. -
చేతులూకాళ్లూ కట్టేసి.. సిగరెట్లతో భర్తకు వాతలు
‘‘నా భార్య మత్తుపదార్థాలు తీసుకొని రోజూ అర్ధరాత్రి వేళల్లో నన్ను హింసిస్తోంది. సిగరెట్లతో వాతలు పెడుతోంది. -
సల్మాన్ ఇంటి వద్ద కాల్పుల కేసులో మరో నిందితుడి అరెస్టు
బాలీవుడ్ నటుడు సల్మాన్ఖాన్ ఇంటి వద్ద జరిగిన కాల్పుల ఘటనకు సంబంధించి ముంబయి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు మరొకరిని అరెస్టు చేశారు.