Nidhivan Raj: వద్దంటే వీడియో తీసి జైలుపాలయ్యాడు!
తమ ఫాలోవర్స్కి కొత్తగా ఏదైనా చూపించాలన్న కాంక్షతో యూట్యూబర్లు కొన్నిసార్లు అత్యుత్సాహం ప్రదర్శించి సమస్యలు కొనితెచ్చుకుంటున్నారు. తాజాగా ఓ యూట్యూబర్ ఇలాగే ఓ పవిత్రమైన ప్రదేశంలో అనుమతి లేకుండా వీడియోలు తీసి.. పండితుల ఆందోళనకు కారణమయ్యాడు. వారి
ఇంటర్నెట్ డెస్క్: తమ ఫాలోవర్స్కి కొత్తగా ఏదైనా చూపించాలన్న కాంక్షతో యూట్యూబర్లు కొన్నిసార్లు అత్యుత్సాహం ప్రదర్శించి సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు. తాజాగా ఓ యూట్యూబర్ ఇలాగే ఓ పవిత్రమైన ప్రదేశంలో అనుమతి లేకుండా వీడియోలు తీసి.. పండితుల ఆందోళనకు కారణమయ్యాడు. వారి ఫిర్యాదుతో జైలుపాలయ్యాడు. వివరాల్లోకి వెళితే..
దిల్లీకి చెందిన గౌవర్ శర్మకు ‘గౌరవ్ జోన్’ పేరుతో యూట్యూబ్ ఛానెల్ ఉంది. వినూత్న వీడియోలు తీసి అందులో అప్లోడ్ చేస్తుంటాడు. ఈ క్రమంలోనే అతడికి ‘నిధివన్ రాజ్’ గురించి తెలిసింది. ఉత్తరప్రదేశ్లో ఉన్న బృందావన్ ప్రాంతంలోని చిన్న అటవీ ప్రాంతమే ‘నిధివన్ రాజ్’. ఇక్కడ రాత్రుళ్లు శ్రీకృష్ణుడు, ఆయన ప్రేయసి రాధ ఏకాంతంగా గడుపుతుంటారని, నృత్యాలు చేస్తారని అక్కడి ప్రజల విశ్వాసం. అందుకే రాత్రుళ్లు ‘నిధివన్ రాజ్’లోకి ఎవరినీ అనుమతించరు. దీంతో రాత్రి అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలని భావించిన గౌరవ్ నవంబర్ 6వ తేదీ రాత్రి తన స్నేహితులతో కలిసి ‘నిధివన్ రాజ్’లోకి చొరబడి వీడియోలు తీశాడు. నవంబర్ 9న ఈ వీడియోని తన ఛానెల్లో ప్రసారం చేశాడు. ఈ విషయం తెలుసుకున్న పండితులు గౌరవ్ శర్మపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పవిత్రమైన ప్రాంతంలో అపచారానికి ఒడిగట్టాడని, అతడిపై చర్యలు తీసుకోవాలని ఆందోళనకు దిగారు. ఈ విషయం వివాదంగా మారుతోందని తెలుసుకున్న గౌరవ్ ఆ వీడియోను యూట్యూబ్ నుంచి తొలగించాడు. అయినా.. పండితులు అతడిపై ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా దిల్లీలో గౌరవ్ను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపించారు.
గౌరవ్పై కేసు ఇది తొలిసారేం కాదు.. గతంలోనూ శునకం మెడకు హీలియం గ్యాస్ బెలూన్లను కట్టి గాల్లోకి వదిలేశాడు. ఆ వీడియో వైరల్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. మరుసటి రోజు గౌరవ్ ఆ వీడియోను తొలగించి.. నెటిజన్లకు క్షమాపణ చెబుతూ మరో వీడియోను అప్లోడ్ చేశాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దర్యాప్తు బృందం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు నమోదు చేసింది. -
మంత్రి కాకాణి అనుచరుడి రైస్ మిల్లులో మద్యం స్వాధీనం
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో నాలుగు రోజుల క్రితం మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి అనుచరుడి వద్ద భారీగా మద్యం స్వాధీనం చేసుకున్న ఘటన మరువక ముందే తాజాగా పొదలకూరు మండలం విరువూరులో మరో అనుచరుడు చిర్రా రాజగోపాల్రెడ్డి రైస్మిల్లులో మద్యం నిల్వలను బుధవారం సెబ్, పోలీసు అధికారులు సీజ్ చేశారు. -
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ శివారు ఆకేరు వాగు వంతెన వద్ద వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ఇంటర్ విద్యార్థులు మృతి చెందారు. -
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
సూర్యాపేట జిల్లా కోదాడలో జాతీయరహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. -
కాలం చెల్లిన ఆర్టీసీ బస్సు బోల్తా
లక్షలాది కి.మీ. తిరిగిన బస్సులను స్క్రాబ్కు పంపకుండా రోడ్లపైకి పంపడం అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడినట్లే. శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం మామిళ్లపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం.. ప్రయాణికుల భద్రతను ప్రశ్నార్థకం చేసింది. -
పల్నాడులో తెదేపా కార్యకర్తలపై.. వైకాపా వర్గీయుల దాడి
`పల్నాడు జిల్లా ఈపూరు మండలం ఇనుమెళ్లలో వైకాపా వర్గీయుల దాడిలో తెదేపాకు చెందిన నలుగురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. -
గుంతలో పడి.. ఏకే 47 పేలి.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసుగుప్పలోని 81 బెటాలియన్ బేస్ క్యాంపు పరిధిలో బుధవారం ఏకే-47 తుపాకి ప్రమాదవశాత్తు పేలడంతో విధుల్లో ఉన్న అసిస్టెంట్ కమాండెంట్ ఎంవీ శేషగిరి(47) మృతి చెందారు. -
ఇంటర్లో ఫెయిలైన ఏడుగురు విద్యార్థుల బలవన్మరణం
ఇంటర్ పరీక్షల్లో ఫెయిలయ్యామని మనస్తాపంతో రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు బుధవారం బలవన్మరణానికి పాల్పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
లండన్లో ఖలిస్థానీ అనుకూలవాదుల దుశ్చర్య కేసు.. కీలక నిందితుడి అరెస్టు
-
హైదరాబాద్ను ఓడించిన బెంగళూరు.. ఎట్టకేలకు రెండో విజయం
-
30 వైడ్ బాడీ విమానాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట