AP News: అలిపిరి వద్ద తమిళనాడు భక్తుల ఆందోళన
తిరుపతిలోని అలిపిరి గరుడ కూడలి వద్ద తమిళనాడుకు చెందిన పలువురు భక్తులు ఆందోళనకు దిగారు. శ్రీవారి దర్శన టికెట్లు ఉన్న భక్తులను..
తిరుపతి (తితిదే): తిరుపతిలోని అలిపిరి గరుడ కూడలి వద్ద తమిళనాడుకు చెందిన పలువురు భక్తులు ఆందోళనకు దిగారు. శ్రీవారి దర్శన టికెట్లు ఉన్న భక్తులను మాత్రమే తిరుమలకు అనుమతించడంపై నిరసన వ్యక్తం చేశారు. వందల కిలో మీటర్లు పాదయాత్రగా వచ్చిన తమకు స్వామి వారి దర్శనం కల్పించాలని డిమాండ్ చేశారు. గత 26 సంవత్సరాలుగా వేలూరు జిల్లా గుడియాత్తం నుంచి పాదయాత్రగా వచ్చి స్వామి వారిని దర్శించుకుని వెళ్తున్నామని తెలిపారు.
ఈ ఏడాది కూడా తిరుమలకు పాదయాత్రగా వచ్చామని.. ఆన్లైన్లో టిక్కెట్లు విడుదల చేయడంతో కేవలం 150 మందికి మాత్రమే దర్శన టికెట్లు లభించాయన్నారు. సుమారు 350 మందికి టికెట్లు లేకపోవడంతో తమకు దర్శన భాగ్యం కలిగించాలని కోరారు. ఈ విషయాన్ని తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దృష్టికి తీసుకెళ్లినా ఆయన స్పందించలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. 26 ఏళ్లుగా ఏటా పాదయాత్రగా తిరుమలకు వస్తున్నామని.. ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ ఎదురు కాలేదన్నారు. తమకు స్వామివారి దర్శనం కల్పించే వరకు నిరసన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఆందోళన చేస్తున్న భక్తులను తితిదే విజిలెన్స్ పోలీసులు భూదేవి కాంప్లెక్స్కు తరలించారు. ప్రస్తుతం వారంతా అక్కడే నిరసన కొనసాగిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా