షాడో సబ్ రిజిస్ట్రార్లుగా లేఖర్ల దందా
రాజేంద్రనగర్ సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో డాక్యుమెంట్ రద్దుకోసం ఓ వ్యక్తి నుంచి రూ.5లక్షలు లంచం తీసుకుంటూ సబ్రిజిస్ట్రార్ అర్షద్ అలీ, లేఖరి వాసు అనిశాకు పట్టుబడ్డారు. ఇదే కేంద్రంలో రోజూ డాక్యుమెంట్లలో దాదాపు 60శాతం ఒకే లేఖరి చేతి నుంచి సబ్రిజిస్ట్రార్కు వెళ్తాయి.
ఈనాడు డిజిటల్, హైదరాబాద్, మూసాపేట, రాజేంద్రనగర్, శంషాబాద్, న్యూస్టుడే: రాజేంద్రనగర్ సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో డాక్యుమెంట్ రద్దుకోసం ఓ వ్యక్తి నుంచి రూ.5లక్షలు లంచం తీసుకుంటూ సబ్రిజిస్ట్రార్ అర్షద్ అలీ, లేఖరి వాసు అనిశాకు పట్టుబడ్డారు. ఇదే కేంద్రంలో రోజూ డాక్యుమెంట్లలో దాదాపు 60శాతం ఒకే లేఖరి చేతి నుంచి సబ్రిజిస్ట్రార్కు వెళ్తాయి. 15ఏళ్లుగా ఆయనదే దందా. ఐదేళ్ల క్రితం లంచం తీసుకుంటూ జైలుకెళ్లి వచ్చి మళ్లీ చక్రం తిప్పుతుండటం గమనార్హం.
నిషేధిత భూములు.. అక్రమ నిర్మాణాలు.. అంతా అవకతవకలే.. అయినా, రిజిస్ట్రేషన్ అవుతుంది. నంబర్లు మార్చేస్తారు, నిబంధనలు చెరిపేస్తారు.. ఎన్ని అడ్డొచ్చినా పని చేసి పెడతారు..కార్యాలయం ముగియగానే ముడుపులు పంచుకోవడం.. అధికారికి ముట్టాల్సింది అప్పజెప్పడం. ఇది ఒకటీ రెండూ కాదు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల పరిధిలోని దాదాపు అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాయాల్లోనూ ఇదే దందా. ఎన్నిసార్లు అవినీతి నిరోధక శాఖ దాడుల్లో పట్టుబడినా.. జైలుకు అలా వెళ్లి ఇలా వచ్చి యథావిధిగా అవినీతి సామ్రాజ్యాలేలుతున్నారు. కొన్ని కేంద్రాల్లో అయితే డాక్యుమెంట్ రైటర్లే షాడో సబ్రిజిస్ట్రార్లుగా చక్రం తిప్పుతుండటం గమనార్హం.
అక్రమాలకు దారులు!.. అక్రమ రిజిస్ట్రేషన్లను సక్రమం చేసేందుకూ లేఖర్లే దారులు చెబుతున్నారు. కూకట్పల్లి ఎస్ఆర్ఓ పరిధిలో ఆస్బెస్టాస్ కాలనీ లేఅవుట్లలో 1-1074 ప్లాట్ల దాకానే అధికారిక లేఅవుట్ కాగా ఇక్కడ 1080, 90దాకా లంచం తీసుకొని అక్రమ రిజిస్ట్రేషన్లు చేశారు. హైదర్నగర్లో 100, 114, 115, 81 సర్వే నంబర్లు వివాదంలో ఉండగా.. ఇక్కడ మూడు, ఐదు అంతస్తుల అక్రమ నిర్మాణాలకూ అనుమతిలిచ్చేశారు. రాజేంద్రనగర్ ఎస్ఆర్ఓ పరిధిలో టీఎన్జీఓస్ కాలనీలో ఓపెన్ ప్లాట్లకు రిజిస్ట్రేషన్ చేయకూడదని లోకాయుక్త ఆదేశాలిచ్చింది. వీటికి ఇంటి నంబర్లు సృష్టించి మరీ రిజిస్ట్రేషన్లు చేస్తుండగా.. కొన్ని నిషేధిత భూములకు బైనంబర్లు, పక్క సర్వే నంబర్లు వేసి రిజిస్ట్రేషన్లు చేయిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రిజర్వేషన్ల రద్దే భాజపా అజెండా: సీఎం రేవంత్రెడ్డి
70 ఏళ్లుగా అమలులో ఉన్న రిజర్వేషన్లను రద్దు చేయాలని భాజపా తలపెట్టిందని సీఎం రేవంత్రెడ్డి ఆరోపించారు. -
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై ప్రజల నుంచి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఫిర్యాదులు, నివేదనలు కోరింది. -
తెలంగాణలో కనీసం 12 సీట్లలో గెలిపించండి: అమిత్ షా
మరోసారి నరేంద్ర మోదీని ప్రధానిని చేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు -
భాజపా మాట నమ్మితే నీళ్లు లేని బావిలో దూకినట్లే: హరీశ్రావు
భారాస హయాంలో మెదక్కు రైలు తీసుకువచ్చినట్లు మాజీ మంత్రి, భారాస నేత హరీశ్రావు అన్నారు. -
ఆ ఊట నీళ్లే వారికి అమృతం.. 30 ఏళ్లుగా తాగుతున్న ఆదివాసీలు
చర్ల మండలంలోని మారుమూల పల్లె వెంకటచెరువులో ఆదివాసీలు ఇప్పటికీ ఊటనీటినే తాగుతున్నారు. -
రిజర్వేషన్ల రద్దుకు భాజపా కుట్ర: సీఎం రేవంత్రెడ్డి
అన్నింటా జీఎస్టీ విధించి ఎన్డీయే ప్రభుత్వం దోపిడీకి పాల్పడుతోందని సీఎం రేవంత్రెడ్డి (Revanth Reddy) విమర్శించారు. -
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దర్యాప్తు బృందం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు నమోదు చేసింది. -
హైదరాబాద్ - బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా ఉప్పల్ వేదికగా గురువారం రాత్రి 7.30 గంటలకు సన్రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. -
పతి దేవుడికి గుడి కట్టింది!
కరోనా మహమ్మారి ఆమె జీవితంలో అంతులేని విషాదాన్ని నింపింది. కళ్లల్లో పెట్టుకుని చూసుకునే భర్తను తన నుంచి దూరం చేసింది. మూడేళ్ల క్రితం భర్త కొవిడ్తో మృతి చెందడంతో ఆమె ఒంటరిగా మారారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
జేఈఈ మెయిన్స్లో తెలుగోళ్ల సత్తా
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా 56 మందికి 100 పర్సంటైల్ రాగా.. ఇందులో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందినవారే 22 మంది ఉన్నారు. జేఈఈ మెయిన్స్ తుది ఫలితాలను జాతీయ పరీక్షల విభాగం (ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసింది. -
కాళేశ్వరంపై కమిషన్ విచారణ షురూ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై న్యాయ విచారణకు ఏర్పాటు చేసిన కమిషన్ కార్యాచరణ మొదలుపెట్టింది. బుధవారం కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ఆయన సతీమణి దేబ్జానీ ఘోష్తో కలిసి హైదరాబాద్కు చేరుకున్నారు. -
ఫస్టియర్లో 60.01%.. సెకండియర్లో 64.19%
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 60.01 శాతం, రెండో సంవత్సరంలో 64.19 శాతం మంది విద్యార్థులు (ఒకేషనల్ కోర్సులతో కలిపి) ఉత్తీర్ణత సాధించారు. -
కవిత బెయిల్పై మే 6న తీర్పు
ఈడీ కేసులో బెయిల్ కోసం భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై తీర్పును ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 6కి వాయిదా వేసింది. -
చదువుల ‘సిరి’.. రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని పట్టుదల
వారానికి రెండుసార్లు డయాలసిస్.. ఒంట్లో సత్తువ లేక కళాశాలకూ వెళ్లలేని పరిస్థితి.. అయినా మొక్కవోని పట్టుదలతో చదివిన పేదింటి బిడ్డ ప్రతిభ చాటింది. -
విజన్-2026కు డోర్నకల్ ఉపాధ్యాయుల శ్రీకారం
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు విజన్-2026 పేరిట ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. -
ఇంటర్ ఫలితాల్లో కవలల ప్రతిభ
సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రానికి చెందిన డేగల వీరభద్రయ్య, మంజుల దంపతుల కవల పిల్లలు డేగల రామ్, లక్ష్మణ్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ప్రతిభ చూపారు. -
రాష్ట్రంలో వంతెనల పరిశీలన..!
రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న చిన్నా, పెద్ద వంతెనలను పరిశీలించేందుకు అధికారులు ఆయత్తం అవుతున్నారు. జిల్లాల వారీగా నిర్మాణ స్థితిగతులపై జాబితాలను రూపొందించే పనిలో ఉన్నారు. -
యాదాద్రి విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి
యాదాద్రి థర్మల్ విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి (ఈసీ) ఇవ్వడానికి కేంద్ర పర్యావరణ శాఖ ఆమోదం తెలిపింది. -
మెట్రో రైలు శబ్దకాలుష్యంపై వివరణివ్వండి
మెట్రో రైల్వే లైను వంపుల్లో రైలు వెళ్లినపుడు పరిమితికి మించి వస్తున్న శబ్దకాలుష్యంపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి, మెట్రో రైల్వే ఎండీకి బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ఆర్జేసీ, మోడల్, కేజీబీవీ విద్యార్థుల ప్రతిభ
టీఎస్ఆర్జేసీ నేరెళ్ల గురుకుల విద్యార్థిని ఎంపీసీలో 991 మార్కులు, బైపీసీలో తాటిపల్లి విద్యార్థిని 990 మార్కులు సాధించినట్లు యాజమాన్యం తెలిపింది.
తాజా వార్తలు (Latest News)
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?