Hyderabad News: హుస్సేన్‌ సాగర్‌లోకి దూసుకెళ్లిన కారు

నగరంలోని ఎన్టీఆర్ మార్గ్‌లో ఓ కారు బీభత్సం సృష్టించింది. ఖైరతాబాద్ నుంచి అతివేగంగా వచ్చి హుస్సేన్‌ సాగర్‌లోకి దూసుకెళ్లింది.

Updated : 28 Nov 2021 10:18 IST

హైదరాబాద్‌: నగరంలోని ఎన్టీఆర్ మార్గ్‌లో ఈ ఉదయం ఓ కారు బీభత్సం సృష్టించింది. ఖైరతాబాద్ నుంచి అతివేగంగా వచ్చి హుస్సేన్‌ సాగర్‌లోకి దూసుకెళ్లింది. దీంతో కారు ముందు భాగం నుజ్జు నుజ్జు అయ్యింది. వాహనంలో ఉన్న ముగ్గురు యువకులలో ఒకరికి చేయి విరిగింది. ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. ఘటనపై కేసు నమోదు చేసిన సైఫాబాద్ పోలీసులు.. గాయపడిన వారిని సోమాజిగూడ యశోద ఆసుపత్రికి తరలించారు. యువకులను ఖైరతాబాద్‌కు చెందిన నితిన్, స్పత్రిక్ , కార్తీక్‌గా పోలీసులు గుర్తించారు. నాలుగు రోజుల క్రితమే కొత్త కారు తీసుకున్నట్లు.. ఖైరతాబాద్ నుంచి అఫ్జల్ గంజ్‌లో టిఫిన్ చేయడానికి వెళుతుండగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని