Crime News: కూకట్పల్లిలో 44 మంది యువకుల అరెస్టు
కూకట్పల్లిలో 44 మంది యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్ : కూకట్పల్లిలో 44 మంది యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్థానిక వివేక్ నగర్లో గత రాత్రి వీరంతా పార్టీ చేసుకున్నారు. మద్యం, హుక్కా సేవించి నృత్యాలు చేశారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించి వారిని అరెస్టు చేశారు. పార్టీ నిర్వాహకులైన ఇమ్రాన్, దయాల్పై నిషేధిత హుక్కా వినియోగంపై కేసు నమోదు చేశారు.
ఓ ఇంటిని అద్దెకు తీసుకొని నెలకు రూ.30 వేలు వీరు చెల్లిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. నిర్వాహకులు వారాంతంలో ఇలాంటి పార్టీలు నిర్వహిస్తూ.. చట్టుపక్కల వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారని స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
-
ఓటరు జాబితాలో.. ‘డీ’ ఓటరు అంటే ఎవరు?
-
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్