TS News: కేసీఆర్, మంత్రులు దిల్లీలో విందు చేసుకొని వచ్చారు: రేవంత్రెడ్డి
తెలంగాణలో రైతులు పండించిన మొత్తం ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఇందిరాపార్క్ వద్ద కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేపట్టిన వరి దీక్ష..
హైదరాబాద్: తెలంగాణలో రైతులు పండించిన మొత్తం ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఇందిరాపార్క్ వద్ద కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేపట్టిన వరి దీక్ష ముగిసింది. మాజీ మంత్రి జానారెడ్డి... పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డికి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ... ధాన్యం కొనుగోలుపై కేంద్రంతో చర్చలు జరిపేందుకు అవగాహన లేని మంత్రులను దిల్లీకి పంపారని విమర్శించారు. వరి పంట గురించి మంత్రులు కేటీఆర్, మహమూద్ అలీకి ఏం తెలుసని ప్రశ్నించారు. ధాన్యం సేకరణపై కేంద్రానికి, రాష్ట్రానికి చిత్తశుద్ధి లేదని ఆరోపించారు. ధాన్యం దిగుబడి వచ్చి 45 రోజులు గడిచినా సేకరణ ఏర్పాట్లు చేయలేదని మండిపడ్డారు. కేసీఆర్ నిర్లక్ష్యం వల్లే వేల టన్నుల ధాన్యం నీటిపాలు అయిందన్నారు. వద్దంటే వరి వేశారనే కక్షతోనే కేసీఆర్ ధాన్యం కొనుగోలు చేయటం లేదన్నారు. సీఎం మూర్ఖత్వం వల్లే ధాన్యం మొలకలు వచ్చి నిరుపయోగంగా మారిందన్నారు. తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకే కేసీఆర్ ధర్నాలు చేశారని పేర్కొన్నారు. దిల్లీ వెళ్లిన కేసీఆర్.. ప్రధాని అపాయింట్మెంట్ కూడా కోరలేదన్నారు. కేసీఆర్, మంత్రులు రెండ్రోజులు దిల్లీలో విందు చేసుకుని వచ్చారని రేవంత్ ఆరోపించారు.
మోదీ, కేసీఆర్ విఫలం: జానారెడ్డి
రైతు సమస్యల పరిష్కారంలో ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ విఫలమయ్యారని మాజీ మంత్రి జానారెడ్డి విమర్శించారు. మోదీ, కేసీఆర్ కలిసి ధాన్యం సమస్యను పక్కదారి పట్టిస్తున్నారన్నారు. కాంగ్రెస్ నేతలంతా ఐకమత్యంతో ముదుకు సాగాలని పిలుపునిచ్చారు. వరి దీక్షతో ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని అన్నారు. వరి దీక్షకు సంఘీభావం తెలిపిన పార్టీలు, ప్రజా సంఘాలకు ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్పార్టీ అనేక సమస్యలను పరిష్కరించి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టిందన్నారు. ఆహార భద్రత చట్టం, అటవీ హక్కుల చట్టం తెచ్చింది కాంగ్రస్ పార్టీనే అని గుర్తు చేశారు.
కలహాలు మాని కలిసి పనిచేస్తాం: కోమటిరెడ్డి వెంకటరెడ్డి
కాంగ్రెస్లో అందరం పీసీసీ అధ్యక్షులమే... చిన్న చిన్న మనస్పర్థలు వచ్చినా అందరం కలిసి పనిచేస్తామని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. తమకు పదవులు ముఖ్యం కాదని పేర్కొన్నారు. గతంలో టికెట్ల విషయంలో కొన్ని పొరపాట్లు జరిగాయని, వచ్చే ఎన్నికల్లో పొరపాట్లు జరగవని చెప్పారు. ‘‘వరి వేస్తే ఉరే అన్న ఈ ప్రభుత్వానికి ఉరి వేయాలి. కేసీఆర్ సంపాదన నిజాం కంటే ఎక్కువైంది. దోపిడీ దారును ఎక్కువకాలం భరించొద్దు. వెయ్యిమందితో దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దీక్ష చేస్తాం. రాహుల్గాంధీ, ప్రియాంకగాంధీని దీక్షకు ఆహ్వానిస్తాం’’ కోమటిరెడ్డి తెలిపారు.
వరి దీక్షలో కాంగ్రస్ తీర్మానాలు..
ఇందిరా పార్కు వద్ద నిర్వహించిన వరి దీక్షలో 9 తీర్మానాలను కాంగ్రెస్ నేతలు ఏకగ్రీవంగా ఆమోదించారు.
1. ప్రస్తుత ఖరీఫ్ వరి ధాన్యాన్ని తక్షణమే కొనుగొలు చేయాలి. కొనుగోలు కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి.
2. తడిసిన ధాన్యాన్ని ఎలాంటి ఆంక్షలు లేకుండా కొనుగోలు చేయాలి.
3. ధాన్యం కొనుగోలు వ్యవస్థలో రైస్ మిల్లర్ల ప్రమేయం ఉండకూడదు.
4. గత రబీలో ధాన్యం సేకరణలో జరిగిన అవకతవకల వల్ల రైతుకు భారీగా జరిగిన ఆర్థిక నష్టాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి.
5. యాసంగి పంటల సాగు విషయంలో ఎలాంటి ఆంక్షలు పెట్టకూడదు. భూమి స్వభావం, వనరుల అనుకూలతను బట్టి రైతుకు సాగుపై స్వేచ్ఛ ఉండాలి.
6. మద్దతు ధరల పరిధిలో ఉన్న ప్రధానమైన పంటలను మద్దతు ధరకు తక్కువ కాకుండా కొనుగోలు చేయాలి.
7. వ్యవసాయ పంటలకు సమగ్ర మద్దతు ధర, కొనుగోలు విషయంలో చట్టబద్ధత కల్పించాలి.
8. సమగ్రమైన విత్తన చట్టాన్ని తీసుకొచ్చి కల్తీ విత్తనాల బారిన పడకుండా రైతులను కాపాడాలి.
9. ఏక కాలంలో లక్ష రూపాయల రైతు రుణమాఫీ అమలు చేయాలి. ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగిన పంట నష్టం 2020-21 సంవత్సరానికి కోర్టు ఆదేశాల ప్రకారం పరిహారం వెంటనే రైతులకు చెల్లించాలి. అని తీర్మానించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రైతులెవరూ అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం: మంత్రి తుమ్మల
ఇటీవల కురిసిన వర్షాలకు రైతులెవరూ అధైర్యపడొద్దని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఖమ్మంలో నిర్వహించిన కాంగ్రెస్ కిసాన్ మోర్చా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. -
భారాస నేత క్రిశాంక్ అరెస్టు అప్రజాస్వామికం: కేటీఆర్
భారాస నేత క్రిశాంక్ అరెస్టు అప్రజాస్వామికమని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. -
మాయావతి కీలక ప్రకటన.. వారసుడిగా మేనల్లుడు ఆకాశ్ ఆనంద్ తొలగింపు
Mayawati: డిసెంబర్లో తన రాజకీయ వారసుడిగా మాయావతి తన మేనల్లుడైన ఆకాశ్ ఆనంద్ను ప్రకటించారు. తాజాగా కీలక బాధ్యతల నుంచి ఆయన్ని తొలగిస్తున్నట్లు ఆమె వెల్లడించారు. -
ల్యాండ్ టైటిలింగ్ చట్టం.. రైతుల భూముల్ని కొల్లగొట్టేందుకే
ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని దొడ్డిదారిన అమలు చేసేందుకు సీఎం జగన్ కంకణం కట్టుకున్నారని ఎన్డీయే నేతలు విమర్శించారు. -
ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారు?
ఎన్నికల ప్రచారానికి వెళ్లిన అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం వైకాపా అభ్యర్థి, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్కుమార్కు చేదు అనుభవం ఎదురైంది. -
నూర్బాషాల సంక్షేమానికి కూటమి మ్యానిఫెస్టోలో రూ.100 కోట్లు కేటాయిస్తామనడం హర్షనీయం
నూర్బాషాల సంక్షేమానికి రూ.వంద కోట్లు కేటాయిస్తామని తెదేపా, జనసేన మ్యానిఫెస్టోలో చెప్పడం హర్షనీయమని తెదేపా నూర్ బాషా నాయకులు నాగుల్మీరా, పీర్ మహ్మద్బుజ్జి, షేక్ సుభాని, నాగుల్ అన్నారు. -
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రైతులకు ఉరితాడే
రాష్ట్రంలోని ఇసుక, గనులతో పాటు అన్ని సహజవనరులను దోచుకున్న సీఎం జగన్ ఇప్పుడు ప్రజల ఆస్తులపై కన్నేశారని తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాస రెడ్డి ధ్వజమెత్తారు. -
హరియాణా రాజకీయాల్లో కలకలం
హరియాణాలో అధికార భాజపా ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నాయబ్ సింగ్ సైనీ నేతృత్వంలోని ప్రభుత్వానికి తాము మద్దతు ఉపసంహరిస్తున్నట్లు ముగ్గురు స్వతంత్ర శాసనసభ్యులు మంగళవారం ప్రకటించారు. -
అయిదో రోజు మరో ఏడుగురు
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నామినేషన్ల పర్వంలో ఐదో రోజు మంగళవారం మరో ఏడుగురు అభ్యర్థులు కొత్తగా నామినేషన్ వేశారు.
తాజా వార్తలు (Latest News)
-
‘కేజీఎఫ్ 3’, ‘సలార్ 2’పై అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్
-
మమ్మల్ని సంజూ కంగారు పెట్టేశాడు.. అందుకే ఆ రియాక్షన్: దిల్లీ ఓనర్
-
బ్యాంక్ ఆఫ్ బరోడాకు ఊరట.. యాప్పై ఆంక్షలు ఎత్తివేసిన ఆర్బీఐ
-
‘నన్ను క్షమించండి’.. క్షత్రియ వర్గాన్ని మరోసారి వేడుకున్న కేంద్ర మంత్రి
-
‘పుష్ప2’ తర్వాత అత్యధిక పారితోషికం తీసుకునే విలన్ మీరేనా? ఫహద్ సమాధానం ఇదే!
-
పూంఛ్ దాడిలో పాక్ మాజీ కమాండో.. గుర్తించిన ఏజెన్సీలు..!