భర్తను కడతేర్చిన భార్య
ప్రతి రోజూ వేధిస్తున్న భర్త పీడ వదిలించుకోవాలని భావించిన భార్య కుమార్తె, మరో వ్యక్తితో కలిసి అతని ప్రాణాలు గాలిలో కలిపింది. ఆత్మహత్యగా చిత్రీకరించాలని ప్రయత్నించినా
కుమార్తె, మరొకరితో కలిసి హత్య
అనుమానాస్పద మృతి కేసును ఛేదించిన పోలీసులు
నిందితులను చూపుతున్న అల్లాదుర్గం సీఐ జారి, పేట ఎస్ఐ నరేందర్
పెద్దశంకరంపేట, న్యూస్టుడే: ప్రతి రోజూ వేధిస్తున్న భర్త పీడ వదిలించుకోవాలని భావించిన భార్య కుమార్తె, మరో వ్యక్తితో కలిసి అతని ప్రాణాలు గాలిలో కలిపింది. ఆత్మహత్యగా చిత్రీకరించాలని ప్రయత్నించినా పోలీసుల దర్యాప్తులో అసలు విషయం వెలుగులోకి రావడంతో కటకటాల పాలైంది. అల్లాదుర్గం సీఐ జార్జి, పెద్దశంకరంపేట ఎస్ఐ నరేందర్ తెలిపిన వివరాలు.. మండలంలోని మల్కాపురం గ్రామానికి చెందిన ఎరుకల వెంకయ్య (44) భార్య శ్యామలతో కలిసి పందులు మేపుకోవడంతో పాటు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. భార్యను అనుమానించిన వెంకయ్య ఆమెతో పాటు 11 ఏళ్లున్న కూతురిని సైతం వేధించసాగాడు. దీంతో భర్త పీడ వదిలించుకోవాలని భావించిన భార్య శ్యామల నవంబరు 29న తనకు ఆరోగ్యం బాగా లేదని ఆస్పత్రికి వెళ్లాలని చెప్పి భర్త, కూతురును సైతం వెంటబెట్టుకుని పెద్దశంకరంపేటకు వచ్చారు. ప్రణాళిక ప్రకారం పొరుగింట్లో ఉంటున్న వడ్డె మల్లయ్యను పిలిపించుకున్నారు. ఆస్పత్రిలో వైద్యం అనంతరం కుమార్తె వెంట రాగా ముగ్గురు కలిసి కల్లు తాగారు. తర్వాత మద్యం సీసాలు తీసుకుని అదే రోజు కాలినడకన మల్కాపురానికి బయలుదేరారు. మార్గమధ్యలో గురుపాద గుట్ట వద్ద ఆగారు. అక్కడ వెంకయ్యకు అతిగా మద్యం తాగించారు. స్పృహ తప్పి పడిపోగానే శ్యామల వెంట తెచ్చుకున్న తాడుతో కుమార్తె, మల్లయ్యల సాయంతో గొంతుకు బిగించి హత్య చేశారు. తర్వాత వెంకయ్య ఆత్మహత్యకు పాల్పడ్డాడని చెప్పేందుకు అతను కట్టుకున్న పంచెతో సమీపంలోని విద్యుత్తు టవర్కు ఉరేసుకున్నట్లు చిత్రీకరించి ఏమి తెలియనట్లు రాత్రికి ఇల్లు చేరారు. తెల్లవారిన తరువాత భర్త కనిపించడం లేదని మామకు చెప్పడంతో ఇరుగు పొరుగు కలిసి వెతకగా విగతజీవిగా కనిపించాడు. తండ్రి నాగయ్య ఇచ్చిన ఫిర్యాదుతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. శవపరీక్షలో గొంతుపిసికి హత్య చేసినట్లుగా గుర్తించడంతో ఆ దిశగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆయన భార్య శ్యామలను తమదైన శైలిలో విచారించడంతో విషయం వెలుగులోకి వచ్చినట్లు సీఐ వివరించారు. ఈ మేరకు వెంకయ్యను హత్య చేసిన భార్యతో పాటు కుమార్తె, వడ్డె మల్లయ్యలను అరెస్టు చేసి రిమాండ్కు పంపించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆపరేషన్ మల్కాజిగిరి
[ 18-04-2024]
లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా కార్యాచరణ రూపొందించిన కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు మల్కాజిగిరి లోక్సభ స్థానంపై ప్రత్యేకంగా దృష్టిసారించారు. -
పరాజయానికి వెరవక.. లక్ష్యం వీడక
[ 18-04-2024]
వారిది పేద కుటుంబం. నాన్న పడిన కష్టాలు దగ్గరుండి చూసిన ఆ యువకుడు ఉన్నతాశయమే లక్ష్యంగా ముందుకు సాగాడు. ప్రతికూల పరిస్థితుల మధ్య చదువుతూ ఐఏఎస్ సాధించాలన్న పట్టుదలతో సాధన చేశాడు. -
సత్వరం జనన, మరణ ధ్రువ పత్రాల మంజూరు
[ 18-04-2024]
పురపాలికల్లో జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు అర్జీదారులకు సత్వరమే అందేలా పురపాలక శాఖ చర్యలు తీసుకుంటోంది. పట్టణ ప్రజలు ఇక నుంచి కార్యాలయాల చుట్టు తిరగకుండా వెంటనే జారీ చేసే విధంగా ప్రణాళిక రూపొందించింది. -
కుటుంబ కలహాలతో పోలీసు డ్రైవర్ ఆత్మహత్య
[ 18-04-2024]
కుటుంబ కలహాలతో పోలీసు డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నారు. జీడిమెట్ల ఎస్సై నాయుడు తెలిపిన వివరాల ప్రకారం.. కుత్బుల్లాపూర్ వెంకటేశ్వర కాలనీలో నివాసముండే గుంటి శ్రీనివాస్(38) గతంలో ఆర్మీలో విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ పొందారు -
డ్రగ్స్కు బానిసై.. విక్రయాల బాట
[ 18-04-2024]
ఇంజినీరింగ్ చదువుతున్న సమయంలోనే మాదకద్రవ్యాలకు బానిసైన ఆ యువకుడు విలాస జీవితానికి అలవాటుపడ్డాడు. డబ్బుల కోసం డ్రగ్స్ విక్రయించేందుకు యత్నిస్తూ పోలీసులకు చిక్కాడు -
వోగ్ స్టార్ మిసెస్ ఇండియా రన్నరప్గా స్నేహాపాటిల్
[ 18-04-2024]
హైదరాబాద్కు చెందిన స్నేహా పాటిల్ వోగ్ స్టార్ మిసెస్ ఇండియా - 2024 రన్నరప్గా నిలిచారు. ఏప్రిల్ 14న జైపూర్లో నిర్వహించిన పోటీల్లో దేశవ్యాప్తంగా 70 మంది పాల్గొన్నారు -
జూబ్లీహిల్స్ కేసులో నా కుమారుడిని ఇరికించే కుట్ర
[ 18-04-2024]
జూబ్లీహిల్స్ రోడ్డు ప్రమాదం కేసులో తన కుమారుడిని ఇరికించేందుకు పోలీసులు కుట్ర చేస్తున్నారని బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ఆరోపించారు. -
ఎన్నికల తనిఖీల్లో రూ.14.31 కోట్లు స్వాధీనం
[ 18-04-2024]
ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నాటి నుంచి ఇప్పటి వరకు ఎన్ఫోర్స్మెంట్ బృందాల తనిఖీల్లో ఇప్పటి వరకు రూ.14,31,65,540 నగదు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్రాస్ తెలిపారు -
నగరానికి శోభ.. రామమయం యాత్ర
[ 18-04-2024]
వీధులన్నీ రామనామంతో మార్మోగాయి.. కాషాయ జెండాలు రెపరెపలాడాయి.. భాగ్యనగర శ్రీరామ నవమి ఉత్సవ సమితి, శ్రీరామ్ యువసేన ఆధ్వర్యంలో శ్రీరామనవమి సందర్భంగా బుధవారం శోభాయాత్రలు నిర్వహించారు -
అదే జోరు.. సాగాలి కారు
[ 18-04-2024]
శాసనసభ ఎన్నికల్లో ఘన విజయం సాధించినట్లే రాజధాని పరిధిలో నాలుగు లోక్సభ స్థానాల్లో కనీసం మూడింటిలోనైనా గులాబీ జెండా ఎగరేయాలని భారాస గట్టి ప్రయత్నాలు చేస్తోంది -
నేటి నుంచే నామినేషన్ల పర్వం
[ 18-04-2024]
నాలుగు లోక్సభ, కంటోన్మెంట్ శాసనసభ స్థానాల ఎన్నికలకు సంబంధించి గురువారం నుంచే నామినేషన్లు స్వీకరణ ప్రక్రియ మొదలు కాబోతోంది. -
గ్రేటర్ పరిధిలో 5 లక్షల ఓట్ల తొలగింపు
[ 18-04-2024]
గ్రేటర్ పరిధిలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2023 జనవరి నుంచి ఇప్పటివరకు ఓటర్ల జాబితాలను సవరించి ఐదు లక్షలకు పైగా ఓట్లను తొలగించినట్లు బల్దియా కమిషనర్ రోనాల్డ్రాస్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
సంరక్షణపై నీలినీడలు
[ 18-04-2024]
బాల నేరస్థులకు ఆశ్రయం కల్పించే రాష్ట్రంలోని ఏకైక జువైనల్ హోమ్ నిర్వహణ గాలిలో దీపంలా మారింది. మౌలిక సదుపాయాల కొరత ఒకెత్తయితే.. సరిపడా సిబ్బంది లేక చిన్నారుల్ని సంరక్షించలేకపోవడం పెద్ద వైఫల్యం. తాజాగా గాజులరామారంలోని జువైనల్ హోమ్ నుంచి 8 మంది బాలురు తప్పించుకొని పారిపోవడం కలకలం రేపింది. -
బైకును 100 మీటర్లు ఈడ్చుకెళ్లిన లారీ
[ 18-04-2024]
లారీ ద్విచక్ర వాహనదారుడిని ఢీ కొట్టి మరింత వేగంగా నడిపి కారును ఢీ కొట్టాడు. ఐఎస్ సదన్ ఠాణా పరిధిలో జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. -
రూ.70 లక్షల విలువైన బంగారు వజ్రాభరణాల చోరీ
[ 18-04-2024]
ఓ వ్యాపారి ఇంట్లో రూ.70లక్షల విలువైన బంగారు వజ్రాభరణాలు చోరీకి గురయ్యాయి. -
మహిళా ఎస్సై సస్పెన్షన్
[ 18-04-2024]
కేపీహెచ్బీ ఎస్సై మౌనికను క్రమశిక్షణారాహిత్య చర్యల కింద సైబరాబాద్ కమిషనర్ సీపీ అవినాశ్ మహంతి సస్పెండ్ చేశారు -
ఎన్నికల సమగ్రసమాచారం.. ఓటరుకు ఉపయుక్తం
[ 18-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో శతశాతం ఓటింగ్ లక్ష్యంగా ఎన్నికల అధికారులు నగరంలో విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు