మెరిసిన పల్లె కుసుమాలు
అభిరుచికి ప్రతిభ తోడైతే గెలుపు ఇట్టే సాధ్యం.. ఇష్టమైన రంగంలో రాణించాలంటే ఎంతో శ్రమ అవసరం.. ఈ దిశగా అడుగేసి విజేతలుగా నిలవడం విశేషం. ఇటీవల కళాఉత్సవ్ పోటీలను వివిధ స్థాయిలో
జాతీయ స్థాయి కళాఉత్సవ్ పోటీలకు పలువురు ఎంపిక
న్యూస్టుడే, మెదక్, చేగుంట, శివ్వంపేట, హత్నూర, వికారాబాద్ టౌన్
అభిరుచికి ప్రతిభ తోడైతే గెలుపు ఇట్టే సాధ్యం.. ఇష్టమైన రంగంలో రాణించాలంటే ఎంతో శ్రమ అవసరం.. ఈ దిశగా అడుగేసి విజేతలుగా నిలవడం విశేషం. ఇటీవల కళాఉత్సవ్ పోటీలను వివిధ స్థాయిలో ఆన్లైన్ ద్వారా నిర్వహించారు. ముందుగా మండల స్థాయి, ఆ తర్వాత జిల్లా స్థాయి పోటీలు జరిగాయి. ఇక్కడ ప్రతిభ చూపిన వారిని రాష్ట్రస్థాయికి ఎంపిక చేశారు. గత నెలలో సదరు పోటీలు జరగ్గా ప్రతిభ చూపి జాతీయ స్థాయికి ఎంపికయ్యారు. ఈ నేపథ్యంలో వారిపై ‘న్యూస్టుడే’ ప్రత్యేక కథనం.
దరువు వేశారంటే..
ఆ విద్యార్థిని దరువు వేయడంలో మంచి నేర్పరి. అందులో తనకు తానే సాటి. ఎలాంటి దరువునైనా అవలీలంగా మోగించడం ఆమెకు సులువే. ఎడమ చేతివాటంతో వాయిస్తూ అందరినీ అబ్బురపరుస్తున్నారు. చిన్నతనంలో ఏర్పడిన ఇష్టంతో ముందడుగు వేసి రాణిస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు. ఆ విద్యార్థినే నర్సాపూర్ మండలం జాన్ఖాన్పేటకు చెందిన మన్నె జగన్, శశికళ దంపతుల కుమార్తె అక్షయ. ప్రస్తుతం ఈ కుటుంబం హత్నూర మండలం దౌల్తాబాద్లో నివాసముంటోంది. అక్షయ హత్నూర కస్తూర్బా విద్యాలయంలో పదో తరగతి చదువుతున్నారు. ఆమెలోని తృష్ణను గుర్తించిన ఉపాధ్యాయులు అన్ని విధాలుగా ప్రోత్సహించారు. ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి వెన్నుతట్టి ప్రోత్సహించారు. దీంతో కళా రంగంలో తన ప్రతిభను చాటుతూ ఎదుగుతున్నారు. దరువుకు అనుగుణంగా అడుగులేస్తూ వేదికలపై ప్రదర్శనలు ఇస్తూ ఆకట్టుకుంటున్నారు. గత నెలలో సంగారెడ్డిలో జరిగిన రాష్ట్ర స్థాయి పొటీల్లో జడ్జిల ప్రశంసలు అందుకొని జాతీయ స్థాయిలో పాల్గొనేందుకు అర్హత సాధించారు. ఉపాధ్యాయుల కృషి, ప్రోత్సాహం, తల్లిదండ్రుల సహకారంతో ఈ స్థానానికి చేరానని, జాతీయ స్థాయిలో ఇదే స్ఫూర్తిగా విజయం సాధిస్తానన్న నమ్మకం ఉందని చెబుతున్నారు అక్షయ.
ఆసక్తితో అడుగేసి..
శివ్వంపేట మండలం చిన్నగొట్టిముక్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న కర్రె సందీప్ జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఇతడి తల్లిదండ్రులు రేణుక, బాబు. వీరికి ముగ్గురు సంతానం కాగా, కూతురు మీన, కుమారులు సందీప్, నిఖిల్. అమ్మానాన్నలు కూరగాయలు విక్రయిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. జానపద వాయిద్యం డప్పు కొట్టడమంటే సందీప్కు చిన్నప్పటి నుంచి ఎంతో ఇష్టం. ఆ ఆసక్తితో ముందుగా సొంతంగా నేర్చుకున్నాడు. ఇతడి అభిరుచిని గమనించిన పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వెంకటరాజయ్య, ఉపాధ్యాయురాలు ఇందుమతి మరింత ప్రోత్సహించారు. ఇదే క్రమంలో గజ్వేల్కు చెందిన డోలక్ యాదయ్య వద్ద శిక్షణ ఇప్పించారు. అందుకు వారే ఆర్థిక సాయం చేయడం గమనార్హం. ఇలా వారి సహకారంతో మెలకువలు నేర్చుకున్న సందీప్.. చిన్నశంకరంపేట ఆదర్శ పాఠశాలలో జరిగిన పోటీల్లో పాల్గొని ప్రథమ స్థానంలో నిలిచారు. తద్వారా జాతీయ స్థాయికి ఎంపికై తన ప్రతిభ చాటడం విశేషం.
సుమధుర గాయని ‘శర్వాణి’
శర్వాణి.. పాట పాడిందంటే అక్కడి నుంచి కదలకుండా వినాల్సిందే. నిరంతర సాధన, ఆసక్తితో ఈ దిశగా అడుగేసిన ఈ అమ్మాయి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఈమె స్వగ్రామం మెదక్ జిల్లా నార్సింగి. తల్లిదండ్రులు సరస్వతి, లక్ష్మణాచారి. తల్లి గృహణి కాగా, తండ్రి టీవీ మెకానిక్. శర్వాణికి ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు. ప్రస్తుతం రామాయంపేటలోని ఓ ప్రైవేటు జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. మూడో తరగతి నుంచి పాటలు పాడటం నేర్చుకున్న ఈ గాయని వెనుదిరిగి చూడకుండా ముందుకు సాగుతున్నారు. గత నెలలో చిన్నశంకరంపేట తెలంగాణ ఆదర్శ పాఠశాలలో జరిగిన రాష్ట్ర స్థాయి కళా ఉత్సవ్ పోటీలో పాల్గొని మంత్రముగ్ధుల్ని చేసి ఏకంగా జాతీయ స్థాయికి ఎంపికయ్యారు. బాలగాయనిగా రాణిస్తున్న సమయంలో ఈమెను ‘ఈనాడు’ వెలుగులోకి తీసుకొచ్చింది. 2018లో ‘ఈటీవీ’ పాడుతా తీయగా కార్యక్రమంలో పాటలు పాడి గానగంధర్వుడు ఎస్పీ బాలు ప్రశంసలు అందుకున్నారు. ప్రముఖ సంగీత శిక్షకులు రామాచారి శిష్యరికంలో మరింత రాటుదేలారు. వీణ వద్ద కర్ణాటక, శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నారు. ఇల్లు కూడా సరిగా లేకపోవడంతో కొత్త ఇంటి నిర్మాణానికి రామాచారి ఆర్థిక సాయం చేశారు. ఇటీవల శర్వాణి పాడిన ఓ పాటను విన్న మంత్రి కేటీఆర్ ప్రశంసిస్తూ ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్, ఎస్ఎస్ తమన్కు ట్వీట్ చేశారు. దీనికి స్పందించిన దేవిశ్రీప్రసాద్ ఓ టీవీ ఛానల్లో ప్రసారమయ్యే కార్యక్రమంలో పాడే అవకాశం ఇచ్చారు. త్వరలోనే ఆయన సంగీత దర్శకత్వంలో పాట పాడనున్నారు. అమ్మానాన్నల ప్రోత్సాహం, గురువుల సహకారంతో మరింత ముందుకు సాగుతానని, సినిమాల్లో అవకాశం వస్తే తప్పకుండా సత్తా చాటుతానని చెబుతున్నారు ఈ గాయని.
నృత్యం అదరహో..
కృషి, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించారు ఈ గిరి పుత్రిక. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం ముజాహిద్పూర్ జడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ఎన్.సవితకు నృత్యం అంటే ఎంతో ఆసక్తి. ఇష్టంతో నేర్చుకొని ముందుకు సాగారు. ఉపాధ్యాయుల సహకారంతో జిల్లా కేంద్రం వికారాబాద్ డైట్ కళాశాలలో నవంబరు 23 నుంచి 26 వరకు జరిగిన రాష్ట్రస్థాయిలో పోటీల్లో పాల్గన్నారు. లంబాడీ నృత్యంతో అదరగొట్టాడారు. ఇలా జాతీయ స్థాయికి ఎంపికయ్యారు. మరోవైపు చదువులోనూ ఈ విద్యార్థిని ముందు స్థానమే కావడం గమనార్హం. మారుమూల గ్రామం చాకల్పల్లి తండా ఈమె స్వగ్రామం. రవాణా సౌకర్యం సరిగా లేని ఈ ప్రాంతం నుంచి కాలినడకన బడికి వచ్చి వెళ్తున్నారు. జాతీయ స్థాయిలో ప్రతిభ చాటి పాఠశాలకు, గ్రామానికి పేరు తీసుకురావడమే తన లక్ష్యమని చెబుతున్నారు ఈ విద్యార్థిని.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విదేశాలకు వెళ్లాల్సింది.. అనంతలోకాలకు..
[ 24-04-2024]
విదేశాలలో ఉన్నత చదువుకు వెళ్లేందుకు సన్నద్ధమవుతున్న ఓ యువకుడిని బస్సు రూపంలో మృత్యువు వెంటాడింది. -
ఎండలో తిరుగుతున్నారా.. జాగ్రత్త!
[ 24-04-2024]
క్రమంగా ఎండలు పెరుగుతున్నాయి. పగలు ఎండ వేడి తీవ్రమైన నేపథ్యంలో దాని తీవ్రత నుంచి రక్షించుకునేందుకు తగిన జాగ్రత్తలు పాటించాలని గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఎం.రాజారావు సూచించారు. -
యానిమేషన్ సినీ కథా రచయిత ఆత్మహత్య
[ 24-04-2024]
అప్పుల బాధ తట్టుకోలేక ఓ యానిమేషన్ సినిమా కథ రచయిత ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. రాయదుర్గం ఎస్ఐ మన్మథ]రావు తెలిపిన వివరాల ప్రకారం.. -
ఆన్లైన్ రుణం.. తీసుకోకున్నా నరకం
[ 24-04-2024]
లోన్యాప్ నేరగాళ్లు మరో అడుగు ముందుకేసి సరికొత్త పద్ధతుల్లో నరకం చూపిస్తున్నారు. ఇప్పటివరకు యాప్ల ద్వారా రుణం ఇచ్చి.. -
రంగనాథస్వామి దేవస్థాన ప్రధాన అర్చకుడు హఠాన్మరణం
[ 24-04-2024]
జియాగూడలోని ఫ్రఖ్యాత రంగనాథస్వామి దేవస్థానం ప్రధాన అర్చకుడు శృంగారం రాజగోపాలాచార్యులు (55) హఠాన్మరణం చెందారు. -
సికింద్రాబాద్ స్టేషన్లో టిక్కెట్ కౌంటర్ల పెంపు
[ 24-04-2024]
వేసవి సెలవులు ఇవ్వడంతో ప్రయాణాలు పెరిగాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు ప్రయాణికులు పోటెత్తుతున్నారు. క్యూఆర్ కోడ్తో టిక్కెట్లు తీసుకునే వెసులుబాటు ఉన్నప్పటికీ ప్రయాణికులు బారులు తీరాల్సి వస్తోంది. -
హనుమా.. నగర శోభ కనుమా
[ 24-04-2024]
రామలక్ష్మణ జానకీ.. జై బోలో హనుమాన్కీ నినాదాలు.. డప్పు చప్పుళ్లు, డీజే మోతలు.. యువత కేరింతలు.. పటిష్ఠ పోలీసు బందోబస్తు మధ్య వీర హనుమాన్ విజయయాత్ర ఘనంగా జరిగింది. -
బలం ఉంది.. భరోసా కొరవడింది
[ 24-04-2024]
రాజధాని పరిధిలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో భారాసకు బలమైన నేతలున్నారు. ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశిస్తే చాలు దూసుకుపోయే క్యాడర్ ఉంది. -
నేతల చూపు యువత వైపు
[ 24-04-2024]
పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియ ఊపందుకుంటున్న దరిమిలా నేతలు నెమ్మదిగా ప్రచారంపై దృష్టి సారిస్తున్నారు. పార్టీల అభ్యర్థులంతా నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. -
నాయకుల హుషారు.. నామినేషన్ల జోరు
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో భాగంగా మంగళవారం 48 నామినేషన్లు దాఖలయ్యాయి. -
ప్రజారోగ్యంతో బంతాట
[ 24-04-2024]
కోటి మంది జనాభా ఉన్న హైదరాబాద్ నగరంలో ప్రజారోగ్యానికి భరోసా కొరవడింది. జీహెచ్ఎంసీ పరిధిలో ఆహారకల్తీని అరికట్టేందుకు ప్రభుత్వం 24 మంది ఆహార భద్రతాధికారులను నియమించగా అందులో ప్రస్తుతం పనిచేస్తున్నది ఏడుగురు మాత్రమే. -
ఓటేద్దాం.. వేయిద్దాం
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు చేవెళ్ల, మల్కాజిగిరి నియోజకవర్గాల ఎన్నికల అధికారులు కె.శశాంక, గౌతమ్లు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. -
వర్షపు నీటిని ఒడిసి పడదాం..
[ 24-04-2024]
వర్షపు నీటిని ఒడిసిపట్టి రాజధానిలో భూగర్భ జలాలను పెంచడంతో పాటు ప్లంబర్లకు ఉపాధి కల్పించే లక్ష్యంతో ‘ది రెయిన్వాటర్ ప్రాజెక్టు’, జీహెచ్ఎంసీ, జలమండలి, ఈపీటీఆర్ఐ, పీసీబీ కలిసి ప్రారంభించిన ‘రెయిన్వాటర్ హార్వెస్టింగ్’ శిక్షణ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. -
కంటోన్మెంట్లో మూడు నామినేషన్లు దాఖలు
[ 24-04-2024]
ప్రస్తుతం తన చేతిలో రూ.1,45,000 నగదు, ఎస్బీఐ అశోక్నగర్ శాఖలో రూ.5 వేల నగదు, కార్ఖానా వాసవినగర్లోని కెనరా బ్యాంకులో -
ఉద్యానమా.. ఆక్రమించేద్దాం!
[ 24-04-2024]
చుట్టూ బహుళ అంతస్తుల భవనాలు.. గేటెడ్ కమ్యూనిటీల నిర్మాణాలు.. దుండిగల్ మున్సిపాలిటీలోని మల్లంపేటకు కిలోమీటర్ దూరంలో బాహ్య వలయ రహదారి.. -
ఆదరిస్తే.. వందేళ్లకు సరిపడా అభివృద్ధి
[ 24-04-2024]
అయిదేళ్లపాటు జరిగే అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ను ఆదరిస్తే పాలమూరు జిల్లాను వందేళ్లకు సరిపడా అభివృద్ధి చేసి చూపిస్తానని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. -
స్థానికంగా కీలకం.. ప్రగతిలో భాగస్వామ్యం
[ 24-04-2024]
పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ సమీపిస్తుండటంతో ఎంపీ అభ్యర్థుల ప్రచార సందడి మొదలైంది. అభ్యర్థుల నామపత్రాల సమర్పణ సైతం తుది దశకు వస్తుండటంతో ప్రచారపర్వం వేగవంతం చేస్తున్నారు. -
విధులు నిర్వర్తించినా... ఓటేయొచ్చు!
[ 24-04-2024]
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటుకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలనే ఉద్దేశ్యంతో ఎన్నికల సంఘం పలు కార్యక్రమాలు చేపడుతోంది. -
ఐపీఎల్ మ్యాచ్.. అర్ధరాత్రి వరకు మెట్రో సేవల పొడిగింపు
[ 24-04-2024]
ఉప్పల్ స్టేడియంలో గురువారం జరిగే ఐపీఎల్ నేపథ్యంలో మెట్రో సేవలు అర్ధరాత్రి వరకు పొడిగిస్తున్నట్లు ఆ సంస్థ తెలిపింది. -
విశ్రాంత ఐఏఎస్కు రూ.1.89 కోట్లకు టోకరా
[ 24-04-2024]
సైబర్ నేరగాళ్లకు చిక్కిన విశ్రాంత ఐఏఎస్ అధికారి రూ.1.89 కోట్లు పోగొట్టుకున్నారు. సామాజిక మాధ్యమాల్లో పరిచయమైన ఓ మహిళ ఫారెక్స్ ట్రేడింగ్ చేస్తే లాభాలు వస్తాయని ఈ మొత్తం కొట్టేసింది. -
తల్లి ప్రవర్తన నచ్చక.. హత్య చేసిన కుమారుడు
[ 24-04-2024]
తల్లి ప్రవర్తన నచ్చక కుమారుడే హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దుండిగల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. -
కొరియర్ పేరుతో వైద్యురాలికి టోకరా
[ 24-04-2024]
కొరియర్లో డ్రగ్స్ పార్సిల్ వచ్చిందని సైబర్ నేరస్థులు బెదిరించి వైద్యురాలి నుంచి నగదు కొట్టేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. -
మ్యాట్రిమోని వేదిక.. ఒంటరి మహిళలకు వల
[ 24-04-2024]
డిగ్రీ మధ్యలోనే ఆపేసిన ఓ యువకుడు సైబర్ నేరగాడి అవతారం ఎత్తాడు. వితంతువులు, విడాకులు తీసుకున్న ఒంటరి మహిళల్ని మ్యాట్రిమోని వేదికల ద్వారా సంప్రదించి పెళ్లి చేసుకుంటానంటూ మోసాలు చేస్తున్నాడు. -
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
[ 24-04-2024]
హైదరాబాద్ నగరంలోని యూసఫ్గూడలో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక యువతిపై బస్సు ఎక్కడంతో తీవ్రగాయాలతో ఆమె మృతిచెందింది.
తాజా వార్తలు (Latest News)
-
ఆ ఇద్దరికి నో ప్లేస్.. వన్డౌన్ బ్యాటర్గా అతడే: ఇర్ఫాన్ పఠాన్
-
సంపద పంచుతారంటూ మోదీ ఆరోపణలు.. రాహుల్ క్లారిటీ
-
ప్రమాదవశాత్తు పేలిన తుపాకీ.. సీఆర్పీఎఫ్ డీఎస్పీ మృతి
-
వారసత్వ ఆస్తుల్నీ వదలరట: పిట్రోడా వ్యాఖ్యలపై మోదీ విమర్శలు
-
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM