logo

పెళ్లి బారాత్‌లో కత్తితో నృత్యం.. ఇద్దరిపై కేసు

పెళ్లి బారాత్‌లో కత్తితో నృత్యం చేసి భయబ్రాంతులకు గురిచేసిన ఇద్దరిపై బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. స్థానిక సింగాడకుంట బస్తీలో

Published : 05 Dec 2021 01:50 IST

జూబ్లీహిల్స్‌, న్యూస్‌టుడే: పెళ్లి బారాత్‌లో కత్తితో నృత్యం చేసి భయబ్రాంతులకు గురిచేసిన ఇద్దరిపై బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. స్థానిక సింగాడకుంట బస్తీలో గత నెల 30న రాత్రి వేళ వసీం అనే వ్యక్తికి సంబంధించిన పెళ్లి బారాత్‌ నిర్వహించారు. ఈ సమయంలో అదే బస్తీకి చెందిన ఎలక్ట్రీషియన్‌ అబ్దుల్‌ నదీమ్‌(26), మెకానిక్‌గా పనిచేసే మహబూబ్‌ అన్సారీ(24)లు డాగర్‌(కత్తి)తో నృత్యం చేశారు. దీంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. బస్తీ ప్రాంతానికి చెందిన ప్రైవేటు ఉద్యోగి సయ్యద్‌ సమీర్‌ శుక్రవారం రాత్రి బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. నదీమ్‌, అన్సారీలపై ఆయుధ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని