Hyderabad News: అనుమానం సరే.. ఇన్ని అవమానాలా?
మీకు నెగెటివ్ మీరు ఇంటికెళ్లివచ్చన్నారు.. గంటలోపే పాజిటివ్ అన్నారు.. ఎలా వచ్చారో అలాగే వెళ్లిపోవాలంటూ బెదిరించారు.. పారిపోయి వచ్చిందని ప్రచారం చేశారు..
‘ఈనాడు’తో ఒమిక్రాన్ అనుమానిత మహిళ గోడు
ఈనాడు డిజిటల్, హైదరాబాద్: మీకు నెగెటివ్ మీరు ఇంటికెళ్లివచ్చన్నారు.. గంటలోపే పాజిటివ్ అన్నారు.. ఎలా వచ్చారో అలాగే వెళ్లిపోవాలంటూ బెదిరించారు.. పారిపోయి వచ్చిందని ప్రచారం చేశారు.. ఎన్నో రోజుల తర్వాత చంటిపాపతో స్వదేశంలో అడుగుపెట్టిన ఓ మహిళకు ఎదురైన చేదు అనుభవాలివి..ఒమిక్రాన్ అనుమానంతో యంత్రాంగం చేసిన తప్పులకు తను, తన కుటుంబం ఎదుర్కొంటున్న మనోవ్యధను ‘ఈనాడు’తో పంచుకున్నారు యూకే నుంచి వచ్చిన బాధితురాలు. ఆవేదన ఆమె మాటల్లోనే..
అయిదేళ్ల పాపతో గంటల నిరీక్షణ
నవంబరు 30 సాయంత్రం లండన్లో నా కుమార్తెతో బయల్దేరా. అక్కడ విమానాశ్రయంలో కొవిడ్ నెగెటివ్ ఆర్టీపీసీఆర్ ధ్రువపత్రం తీసుకున్న తర్వాత.. పరీక్షలన్నీ చేసి 4 గంటలు ఆలస్యంగా విమానం ఎక్కించారు. శంషాబాద్ విమానాశ్రయంలో డిసెంబరు 1న ఉదయం దిగగానే పరీక్షలు చేయాలన్నారు. బ్రిటిష్ ఎయిర్వేస్లో వచ్చిన వారితో పాటు ఇతరులు 200 మందిని భౌతికదూరం పాటించకుండా ఒక వరుసలో గంటల తరబడి నిలబెట్టారు. 45 నిమిషాల్లో పరీక్ష ఫలితం కావాలంటే రూ.4,500 కట్టాలన్నారు. ఇబ్బంది పడుతున్న పాపతో నిరీక్షించలేక రూ.4,500 చెల్లించా. 2 గంటల తర్వాత ఫలితం నెగెటివ్ అని చెప్పారు. రిపోర్టు మెయిల్ చేస్తామన్నాక జీడిమెట్లలోని ఇంటికి బయల్దేరా. గంట తర్వాత పాజిటివ్ అంటూ ఇంకో మెయిల్ పంపారు.
టాయిలెట్కూ వెళ్లనివ్వలేదు..
ఇంటికి వచ్చేసరికి పోలీసులున్నారు. అమ్మ గుండె జబ్బు బాధితురాలు. వెంట చిన్నపాప ఉంది. ఇవేం చూడకుండా ఓ పోలీసు నాతో ఫోన్లో ‘ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికే వెళ్లిపోవాలం’టూ దురుసుగా మాట్లాడారు. టాయిలెట్కూ వెళ్లనివ్వకుండా అంబులెన్సులో టిమ్స్కి తరలించారు. అక్కడ పరీక్షల్లో నెగెటివ్ వచ్చింది. దోమలు, అసౌకర్యాల నడుమ ఇబ్బంది పడుతున్నా.
దేన్ని నమ్మాలి.. ఎవరిది తప్ఫు
నెగెటివ్ రిపోర్టును పాజిటివ్గా మార్చి, నేనే పారిపోయి వచ్చానని తప్పుడు ప్రచారం చేశారు. ఎవరి రిపోర్టు సరైనదని నమ్మాలి. ప్రసార మాధ్యమాల్లో మా చిత్రాలు, కుటుంబం వివరాలు ప్రచురిస్తున్నారు. యూకేలో ఉన్న నా భర్త, కుటుంబం ఎంత మనోవ్యధ అనుభవిస్తుందో మాటల్లో చెప్పలేను. ఎవరో చేసిన తప్పులకు మేం శిక్ష అనుభవించాలా?
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్, ముంబయి మ్యాచ్లో నమోదైన రికార్డులివీ..
-
రాశీఖన్నా ‘గోల్డెన్’ మెరుపులు.. అలా చూడొద్దన్న కేతిక.. టీమ్తో కృతి సనన్
-
లీడర్ పిలిస్తే.. జనసేన పార్టీ ప్రచారానికి సిద్ధంగా ఉన్నా: నటి అనసూయ
-
నా దగ్గర అంత డబ్బు లేదు.. అందుకే పోటీ చేయట్లేదు: నిర్మలా సీతారామన్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/03/2024)
-
మాల్దీవుల్లో తాగునీటి కొరత.. టిబెట్ నుంచి 1500 టన్నుల నీరు పంపిన చైనా