నెట్టింట పిలుపు.. నట్టింట పనులు
నగర జీవనం అంటేనే ఉరుకులు పరుగులతో కూడుకున్నది. అలాంటిది భార్యాభర్తలు ఉద్యోగులు, వ్యాపారులు అయితే చిన్నా, చితకా పనులు చేసుకునేందుకు సమయం వెచ్చించలేని పరిస్థితి. దీన్నే వ్యాపార
ఇల్లు శుభ్రం మొదలు పలు రకాల సేవలు
ఐటీకారిడార్లో పెరుగుతున్న ఆదరణ
ఈనాడు డిజిటల్, హైదరాబాద్
నగర జీవనం అంటేనే ఉరుకులు పరుగులతో కూడుకున్నది. అలాంటిది భార్యాభర్తలు ఉద్యోగులు, వ్యాపారులు అయితే చిన్నా, చితకా పనులు చేసుకునేందుకు సమయం వెచ్చించలేని పరిస్థితి. దీన్నే వ్యాపార మార్గంగా మలచుకుంటున్న అనేక సంస్థలు క్రమంగా తమ సేవలను విస్తరిస్తున్నాయి. మీట నొక్కగానే మేమున్నామంటూ ఇంటికి వచ్చి కావాల్సిన పనులు చేస్తున్నాయి. దీంతో సెలవు రోజుల్లో కుటుంబంతో మాత్రమే గడిపేలా పలువురు ఇలాంటి యాప్ ఆధారిత సంస్థలను ఆశ్రయిస్తున్నారు. ఉదయం పాలు వేసే దగ్గర నుంచి క్షవరం, లాండ్రీ, ఇల్లు శుభ్రం చేసుకోవడం, దుస్తులు కుట్టడం వంటి వాటికి ఇంటి ముంగిట వాలిపోతున్నారు.
ఆన్లైన్ దర్జీలు..
పురుషులకు అవసరమైన సూట్లు, మహిళల, చిన్నారుల దుస్తులు, మగ్గం వర్క్తో పాటు ఇతర డిజైన్లను ప్రత్యేకంగా చేయించాలనుకునేవారు ఈ సంస్థలను ఆశ్రయిస్తున్నారు. అపాయింట్మెంట్ బుక్ చేసుకుంటే సంస్థ ప్రతినిధి షెడ్యూల్ సమయంలో వచ్చి కొలతలు తీసుకుంటారు. అనంతరం డిజైనర్ వీడియో లేదా ఆడియోకాల్లో మాట్లాడి నచ్చిన విధంగా దుస్తులను కుట్టి డెలివరీ చేస్తారు. మార్పులు, చేర్పులు అవసరమైతే మరోసారి తీసుకెళ్లి రీడెలివరీ చేస్తారు. క్లౌడ్ టేలర్, టేలర్మోబ్, టేలర్జంక్షన్ తదితర సంస్థలు అందుబాటులో ఉన్నాయి. రూ.650 నుంచి మొదలుకొని లక్షలాది రూపాయల విలువైన దుస్తులకు ఆర్డర్లు ఇస్తున్నారు.
ఉపాధి పొందుతున్న వారు: 2వేలు
లాండ్రీయాప్..
వినియోగదారు నుంచి ఫోన్ కాల్ వచ్చిన వెంటనే సిబ్బంది ఇంటికొచ్చి దుస్తులు తీసుకెళ్తారు. ప్రతిదానికీ ఓ ట్యాగ్ తగిలిస్తారు. ఆ దుస్తుల్ని ఎలా ఉతకాలో ఆ ట్యాగ్ వివరిస్తుంది. దీంతో ఒకరివి మరొకరికి మారడం ఉండదు. ఖరీదైన దుస్తులు పాడైపోతాయన్న దిగులు ఉండదు. వీటిని వివిధ రకాలుగా విభజించి ఉతికి, వాటిని ఇస్త్రీ చేసి ఇంటికి చేరుస్తారు. ఇదీ లాండ్రీయాప్లు పని తీరు. కొన్ని సంస్థలు 1.5కేజీల బరువు ఉంటే రూ.400, 4.5 కేజీలు ఉంటే రూ.300 చెల్లించేలా ప్రత్యేక ప్యాకేజీలు అందిస్తున్నాయి. నగరంలో 6లక్షల మంది ఐటీ ఉద్యోగులు ఉండగా..ఇందులో 1.80లక్షల మంది ఈ సేవలను పొందుతున్నారు. వీటితోపాటు హోటళ్లు, లాడ్జీలు, వీటి సేవలను ఉపయోగించుకుంటున్నాయి. హెలోవాష్, ది లాండ్రీ బాస్కెట్, పర్ల్ వాష్ లాండ్రీ, వాష్హబ్ ఆన్లైన్ తదితర సంస్థలు అందుబాటులో ఉన్నాయి.
ఉపాధి పొందుతున్న వారు: 7వేలు
సౌందర్యానికి మెరుగులు
బ్యూటీ సర్వీసెస్, హోమ్ సెలూన్, అర్బన్ క్లాప్ వంటి పేర్లతో అనేక సంస్థలు ఈ సేవలను అందిస్తున్నాయి. మహిళలు బ్యూటీపార్లర్కు వెళ్లకుండా ఇంట్లోనే ఉండి వీటిని పొందుతున్నారు. హెయిర్ కేర్తోపాటు స్టైలింగ్, ఫేషియల్, క్లీనప్, బ్లీచ్, మేకప్ తదితర సేవలున్నాయి. పురుషులకు హెయిర్ కట్, క్లీనింగ్, ఫేస్బ్లీచ్ తదితర సేవలు అందిస్తున్నారు. యాప్లో బుక్ చేయగానే ఇంటికొచ్చిన ప్రతినిధి రేటింగ్, చేసే పని ఆధారంగా నిముషానికి రూ.6 నుంచి రూ.15 వరకు ఛార్జీ చేస్తున్నాయి. మరికొన్ని సంస్థలు హెయిర్స్టైల్ ఆధారంగా రూ.200 నుంచి రూ.2,500 వరకు వసూలు చేస్తున్నాయి.
ఉపాధి పొందుతున్న వారు: 2వేలు
వారే ఊడుస్తారు..
ఇంటిని శుభ్రం చేయడం ఇప్పుడు అత్యంత డిమాండ్ ఉన్న సేవల్లో ఒకటిగా మారింది. నగరంలో చాలా కాలం నుంచి ఈ సేవలను అనేక సంస్థలు అందిస్తున్నాయి. డీప్ క్లీనింగ్, కిచెన్ క్లీనింగ్ను ఎక్కువ మంది నగరవాసులు కోరుకుంటున్నారు. విదేశాల్లో ఉంటున్నవారు, కొవిడ్తో నగరం వదిలి సొంత ఊళ్లకు వెళ్లినవారు ఇళ్లను శుభ్రం చేయాలని కోరుతున్నారు. ముఖ్యంగా మాదాపూర్, కొండాపూర్, ఖాజాగూడ, గచ్చిబౌలి, హైటెక్సిటీ, కోకాపేట, కూకట్పల్లి తదితర ప్రాంతాల్లో ఈ సేవలకు డిమాండ్ ఉంది. ఐటీ ఉద్యోగులు, ఆకాశహర్మ్యాల్లోని ఫ్లాట్లు, విల్లాల నుంచి ఎక్కువగా బుకింగ్ వస్తున్నాయని ఆయా సంస్థల ప్రతినిధులు చెబుతున్నారు.
ఉపాధి పొందుతున్న వారు: 5వేలు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బంగారం పేరుతో రూ.6.12 కోట్ల మోసం.. సాఫ్ట్వేర్ ఇంజినీర్ అరెస్టు
[ 20-04-2024]
బంగారంలో పెట్టుబడి అంటూ రూ.6.12 కోట్లు మోసం చేసిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ను సైబరాబాద్ ఆర్థిక నేర విభాగం పోలీసులు అరెస్టు చేశారు. -
అందుకే భారాస కష్టాల్లో పడింది: గుత్తా సుఖేందర్రెడ్డి
[ 20-04-2024]
తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారం అవాస్తవమని శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉన్నానని చెప్పారు. -
గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ గారడీ చేస్తోంది: కిషన్రెడ్డి
[ 20-04-2024]
భారాస ఎమ్మెల్యేలు పార్టీ మారటం చూసి కేసీఆర్ ఫ్రస్టేషన్లో ఉన్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి విమర్శించారు. -
చిలుకూరు ఆలయంలో ‘వివాహ ప్రాప్తి’ రద్దు: ప్రధాన అర్చకులు రంగరాజన్
[ 20-04-2024]
హైదరాబాద్ నగర శివారులోని చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. -
హైదరాబాద్లో ఉరుములు, మెరుపులతో వర్షం
[ 20-04-2024]
నగరంలోని పలుచోట్ల శనివారం ఉదయం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. -
ప్రపంచం గర్వించే స్థాయికి తెలుగు యూనివర్సిటీ ఎదగాలి
[ 20-04-2024]
ప్రపంచం గర్వించే స్థాయికి తెలుగు యూనివర్సిటీ ఎదగాలని పలువురు వక్తలు పేర్కొన్నారు. శుక్రవారం బాచుపల్లిలోని పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ 38వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. -
ఒలింపిక్స్లో పతకం తెస్తే బీఎండబ్ల్యూ కారు
[ 20-04-2024]
ప్రపంచ నంబరు వన్ బ్యాడ్మింటన్ సాత్విక్ సాయిరాజ్ ఒలింపిక్స్లో పతకం గెలిస్తే బీఎండబ్ల్యూ కారు బహుమతిగా ఇస్తానని ఎఫ్ఎన్సీసీ స్పోర్ట్స్ కమిటీ ఛైర్మన్ చాముండేశ్వరినాథ్ ప్రకటించారు. -
ఖాళీ చేద్దాం.. పాగా వేసేద్దాం
[ 20-04-2024]
రాజధాని పరిధిలోని భారాస ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు కాంగ్రెస్లో చేరబోతున్నారా...! ప్రస్తుత పరిస్థితులు చూస్తే అవుననే సమాధానం వస్తోంది. -
2వ రోజు.. 17 నామినేషన్లు
[ 20-04-2024]
లోక్సభ ఎన్నికల్లో భాగంగా పలువురు అభ్యర్థులు శుక్రవారం నామినేషన్ పత్రాలు సమర్పించారు. రెండో రోజు మొత్తం 17 నామపత్రాలు దాఖలయ్యాయి. -
లక్ష్యం @ 60%
[ 20-04-2024]
రాష్ట్రంలోనే రాజధాని జిల్లాలో అతి తక్కువ మంది ఓటేస్తారన్న అభిప్రాయాన్ని.. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో రూపుమాపుతామని జీహెచ్ఎంసీ స్పష్టం చేస్తోంది. -
మీమ్స్ తో ప్రచారం.. యువ ఓటర్లకు గాలం
[ 20-04-2024]
ఎన్నికల్లో గెలవాలంటే అనర్గళంగా ప్రసంగిస్తూ.. అన్నివర్గాల ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం.. గెలిస్తే ఏం చేస్తామో చెప్పడం.. ప్రత్యర్థి పార్టీని విమర్శించడం ఒకప్పటి ప్రచార శైలి.. -
‘భాజపాకు తెలంగాణలో స్థానం లేకుండా చేయాలి’
[ 20-04-2024]
హైదరాబాద్లో సర్జికల్ స్ట్రైక్ చేయాలని ఆలోచన చేసే భాజపాకు తెలంగాణలో రాజకీయ స్థానం లేకుండా చేయాలని మజ్లిస్ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు. -
భాజపా చేసిందేమీ లేదు: దానం
[ 20-04-2024]
భాజపా నాయకులు చెప్పుకొనేందుకు చేసింది ఏమీ లేక రాముడి పేరును దుర్వినియోగం చేస్తున్నారని కాంగ్రెస్ సికింద్రాబాద్ లోక్సభ అభ్యర్థి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ విమర్శించారు. -
అతివేగానికి మూడు ప్రాణాలు బలి
[ 20-04-2024]
వాహనదారుల అతివేగం రెండు ప్రమాదాలకు కారణమై ముగ్గురి ప్రాణాలు తీసింది. బీడీఎల్ ఠాణా సీఐ రవీందర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. -
ఈవీ.. పరుగులేవీ?
[ 20-04-2024]
పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ) విక్రయాల్లో అంత పురోగతి కనిపించడం లేదు. ఆసక్తి చూపడం లేదు. -
జన్యులోపం బాలుడికి కాలేయ మార్పిడి విజయవంతం
[ 20-04-2024]
అరుదైన జన్యులోపంతో జన్మించి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న బాలుడికి బంజారాహిల్స్లోని కేర్ ఆస్పత్రి వైద్యులు విజయవంతంగా కాలేయ మార్పిడి చేశారు. -
‘కాంగ్రెస్తోనే అన్ని వర్గాల సంక్షేమం’
[ 20-04-2024]
కాంగ్రెస్తోనే అన్నివర్గాల సంక్షేమం, అభ్యున్నతి సాధ్యమని అంతర్జాతీయ వైశ్య సమాఖ్య(ఐవీఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్గుప్తా అన్నారు -
మున్నూరుకాపుల ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు ఇవ్వాలి
[ 20-04-2024]
రాష్ట్రంలోని మున్నూరు కాపుల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్పొరేషన్ దోహదపడుతుందని తెలంగాణ మున్నూరు కాపు మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు మణికొండ వెంకటేశ్వర్రావు, మున్నూరు కాపు సంఘం సికింద్రాబాద్ అధ్యక్షుడు లింగిశెట్టి హన్మంత్రావు అన్నారు. -
కాంగ్రెస్ అభ్యర్థి సునీత నామినేషన్కు సీఎం
[ 20-04-2024]
మల్కాజిగిరి లోక్సభ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా పట్నం సునీతారెడ్డి ఈనెల 22న మధ్యాహ్నం 2గంటలకు నామినేషన్ వేస్తున్నారు. -
మహాకాళి అమ్మవారిని దర్శించుకున్న రాజ్నాథ్సింగ్
[ 20-04-2024]
కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్తో కలిసి సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహాకాళి అమ్మవారిని శుక్రవారం ఉదయం దర్శించుకున్నారు. -
స్వచ్ఛ ఇంధనానికి చేతులు కలిపిన ఐఐసీటీ-బీహెచ్ఈఎల్
[ 20-04-2024]
స్వచ్ఛమైన, పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధిలో కలిసి పనిచేయాలని ఐఐసీటీ, బీహెచ్ఈఎల్ నిర్ణయించాయి. -
పదేళ్లలో పాలమూరును ఎడారిగా మార్చారు
[ 20-04-2024]
వంద రోజుల కాంగ్రెస్ పాలనలోనే పాలమూరులో రూ.10వేల కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. -
ప్రతిభకు పేదరికం అడ్డుకాదు: కలెక్టర్
[ 20-04-2024]
ప్రతిభకు పేదరికం అడ్డురాదని, సివిల్స్ ర్యాంకర్లే ఇందుకు నిదర్శనమని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రం వికారాబాద్లోని కలెక్టర్ కార్యాలయంలో వీడీడీఎఫ్ ఆధ్వర్యంలో అష్ఫక్ను సన్మానించారు. -
ఈకేవైసీ.. గడువుతో పనిలేదు
[ 20-04-2024]
నిరుపేదల కోసం ప్రభుత్వం ఉచితంగా రేషన్ బియ్యం సరఫరా చేస్తోంది. ఆహార భద్రత రేషన్ కార్డుల లబ్ధిదారులకు ఆధార్ అనుసంధానం (ఈ కేవైసీ) చేసుకునేందుకు ప్రభుత్వం గడువు నిబంధన అంటూ ఏమీ లేకుండా చేసింది. -
ఉత్తుత్తి బుకింగ్లు.. జలమండలికి టోకరా
[ 20-04-2024]
ఫేక్ బుకింగ్లతో కొందరు జలమండలికి టోకరా వేస్తున్నారు. ట్యాంకర్లకు కృత్రిమ కొరత ఏర్పడి..పెండింగ్ జాబితా అమాంతం పెరిగిపోతోంది. -
నగరానికి సాగర్ జలాల పంపింగ్
[ 20-04-2024]
హైదరాబాద్ జంట నగరాలు, నల్గొండ జిల్లా సాగునీటి అవసరాలు తీర్చేందుకు నాగార్జునసాగర్ జలాశయంలో జలమండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న అత్యవసర మోటార్ల ప్రయోగాత్మక పరిశీలన కొనసాగుతోంది. -
నగరం గరం
[ 20-04-2024]
-
కుమారుడిపై కేసు భయం.. తల్లి ఆత్మహత్య
[ 20-04-2024]
ఓ బాలుడు చేసిన తప్పు తల్లి ప్రాణాలకు ముప్పుతెచ్చింది. ఈ ఘటన ఫిల్మ్నగర్లో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల వివరాల ప్రకారం.. కోనసీమ జిల్లా కొత్తపేట మండలం మందపల్లికి చెందిన వెంకటరమణ, సూర్యకుమారి దంపతులు నగరానికి కొన్నేళ్ల క్రితం వచ్చారు. -
క్యాబ్లలో వస్తువులు మరిచిపోతున్నారు..!
[ 20-04-2024]
క్యాబ్లలో ప్రయాణికులు వస్తువులు మర్చిపోయే నగరాల జాబితాలో హైదరాబాద్ నాలుగో స్థానంలో ఉంది. ‘లాస్ట్ అండ్ ఫౌండ్ - 2024’ నివేదికను ఉబర్ సంస్థ శుక్రవారం విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
బంగారం పేరుతో రూ.6.12 కోట్ల మోసం.. సాఫ్ట్వేర్ ఇంజినీర్ అరెస్టు
-
social look: వర్ష చీరకట్టు.. ప్రియాంక క్యూటు.. రష్మి హాటు..
-
ప్రజలు బెంజ్ కారు అడగట్లేదు కదా!.. ఎన్నికలపై విశాల్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
అందుకే భారాస కష్టాల్లో పడింది: గుత్తా సుఖేందర్రెడ్డి
-
జగన్పై రాయిదాడి కేసు.. దుర్గారావు ఎక్కడ?
-
22న ఏపీ పదోతరగతి ఫలితాలు