వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరి దుర్మరణం
జిల్లాలో వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు దుర్మరణం చెందారు. సంగారెడ్డి పట్టణ సీఐ బైరి రమేశ్ తెలిపిన వివరాలు.. అందోలు మండలం అల్మాయిపేటకు చెందిన బుచ్చిరెడ్డిగారి గోపాలకృష్ణారెడ్డి (46) కార్పెంటర్.
సంగారెడ్డి అర్బన్, న్యూస్టుడే: జిల్లాలో వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు దుర్మరణం చెందారు. సంగారెడ్డి పట్టణ సీఐ బైరి రమేశ్ తెలిపిన వివరాలు.. అందోలు మండలం అల్మాయిపేటకు చెందిన బుచ్చిరెడ్డిగారి గోపాలకృష్ణారెడ్డి (46) కార్పెంటర్. నిత్యం సంగారెడ్డిలో పని పూర్తయిన తర్వాత స్వగ్రామం వెళుతుంటారు. శనివారం రాత్రి ద్విచక్ర వాహనంపై వెళుతూ.. సంగారెడ్డిలోని ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణం సమీపంలో నిలిపి ఉన్న లారీని ఢీకొన్నారు. ఎగిరి కిందపడగానే.. అదే సమయంలో నారాయణఖేడ్ వైపు వెళ్లే బస్సు గోపాలకృష్ణారెడ్డిని ఢీకొని.. పైనుంచి వెళ్లింది. తల నుజ్జునుజ్జు కావడంతో అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటన విషయం తెలుసుకున్న లారీ డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. గోపాలకృష్ణారెడ్డికి భార్య స్వప్న, ఇద్దరు పిల్లలున్నారు. వారు కన్నీరుమున్నీరయ్యారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లుగా సీఐ వివరించారు.
సంగారెడ్డి గ్రామీణం: గుర్తుతెలియని వాహనం ఆటోని ఢీకొన్న ఘటనలో ఒకరు మృత్యువాత పడ్డాడు. ఎస్సై సుభాష్ తెలిపిన వివరాలు.. మండల పరిధి ఇస్మాయిల్ఖాన్పేట్ శివారులో శనివారం రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందారు. వయస్సు సుమారు 35 సంవత్సరాలు ఉంటుంది. మృతునికి సంబంధించి ఎలాంటి వివరాలు తెలియలేదని, మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని ఎస్సై పేర్కొన్నారు.
గుర్తుతెలియని మహిళ మృతి
సంగారెడ్డి అర్బన్, న్యూస్టుడే: సంగారెడ్డి పట్టణం విద్యానగర్ కాలనీలో గుర్తు తెలియని మహిళ మృతిచెందింది. గ్రామీణ ఎస్ఐ కె.సుభాష్ తెలిపిన వివరాలు.. 45-50 ఏళ్ల వయస్సున్న మహిళ మూడు రోజులుగా పట్టణంలోని విద్యానగర్ కాలనీలో భిక్షాటన చేస్తోంది. రహదారి పక్కన పడుకొని అనారోగ్యానికి గురికాగా.. స్థానికులు ఆసుపత్రికి తీసుకెళుతుండగా మరణించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంరక్షణపై నీలినీడలు
[ 18-04-2024]
బాల నేరస్థులకు ఆశ్రయం కల్పించే రాష్ట్రంలోని ఏకైక జువైనల్ హోమ్ నిర్వహణ గాలిలో దీపంలా మారింది. మౌలిక సదుపాయాల కొరత ఒకెత్తయితే.. సరిపడా సిబ్బంది లేక చిన్నారుల్ని సంరక్షించలేకపోవడం పెద్ద వైఫల్యం. తాజాగా గాజులరామారంలోని జువైనల్ హోమ్ నుంచి 8 మంది బాలురు తప్పించుకొని పారిపోవడం కలకలం రేపింది. -
బైకును 100 మీటర్లు ఈడ్చుకెళ్లిన లారీ
[ 18-04-2024]
లారీ ద్విచక్ర వాహనదారుడిని ఢీ కొట్టి మరింత వేగంగా నడిపి కారును ఢీ కొట్టాడు. ఐఎస్ సదన్ ఠాణా పరిధిలో జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. -
రూ.70 లక్షల విలువైన బంగారు వజ్రాభరణాల చోరీ
[ 18-04-2024]
ఓ వ్యాపారి ఇంట్లో రూ.70లక్షల విలువైన బంగారు వజ్రాభరణాలు చోరీకి గురయ్యాయి. -
మహిళా ఎస్సై సస్పెన్షన్
[ 18-04-2024]
కేపీహెచ్బీ ఎస్సై మౌనికను క్రమశిక్షణారాహిత్య చర్యల కింద సైబరాబాద్ కమిషనర్ సీపీ అవినాశ్ మహంతి సస్పెండ్ చేశారు -
పలు అంశాలతో పుస్తకాల పంపిణీ
[ 18-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో శతశాతం ఓటింగ్ లక్ష్యంగా ఎన్నికల అధికారులు నగరంలో విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!