వివిధ ఘటనల్లో అయిదుగురి ఆత్మహత్య
అప్పుల బాధతో రైతు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం ఎల్కల్లో ఆదివారం చోటు చేసుకుంది. ఏఎస్ఐ శ్రీనివాస్ తెలిపిన వివరాలు..
మనోహరాబాద్, న్యూస్టుడే: సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, సిద్దిపేట జిల్లాల్లో ఆదివారం వివిధ కారణాలతో అయిదుగురు ఆత్మహత్య చేసుకున్నారు. వివరాలు..
అప్పుల బాధతో రైతు...
రాయపోల్ (దౌల్తాబాద్) న్యూస్టుడే: అప్పుల బాధతో రైతు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం ఎల్కల్లో ఆదివారం చోటు చేసుకుంది. ఏఎస్ఐ శ్రీనివాస్ తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన జాల భూమయ్య (55) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. శనివారం సాయంత్రం వరకు కొడుకు సురేందర్తో కలిసి పొలం పనుల్లో పాల్గొన్నారు. తర్వాత ఎడ్లకు నీరు తాపి వస్తానని చెప్పి వెళ్లి ఎంతకూ ఇంటికి రాలేదు. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పొలం, గ్రామంలో వెతికినా కనిపించలేదు. ఆదివారం ఉదయం గ్రామం చుట్టుపక్కల చూడగా తాళ్లకుంట సమీపంలో చెట్టుకు ఉరి వేసుకొని కనిపించాడు. కొడుకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
* దంపతుల మధ్య గొడవతో విసుగు చెందిన భర్త బావిలో దూకి ఆత్మహత్య చేసుకోగా విషయం ఆదివారం వెలుగు చూసింది. ఈ ఘటన మండల పరిధి చెట్లగౌరారంలో చోటు చేసుకుంది. మనోహరాబాద్ ఎస్ఐ రాజు గౌడ్ తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన మౌలానా కుమారుడు బాబర్ (30) ఆటో నడుపుతూ జీవనం సాగించేవాడు. అతనికి తూప్రాన్కు చెందిన నూర్జహాన్ బేగంతో ఆరేళ్ల క్రితం వివాహం చేశారు. వారికి ఇద్దరు కుమార్తెలు ఉండగా బాబర్కు ఆశించిన స్థాయిలో ఆదాయం లేకపోవడంతో నూర్జహాన్ బేగం ఆరునెలల క్రితం భర్తను వదిలి పుట్టింటికి వెళ్లింది. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన అతను ఈ నెల 2న ఇంటినుంచి వెళ్లి గ్రామ సమీపంలోని వ్యవసాయ బావిలో దూకాడు. ఈత రాకపోవడంతో నీట మునిగి చనిపోయాడు. ఆదివారం ఉదయం మృతదేహాన్ని గమనించిన వ్యవసాయ పొలం యజమాని కృష్ణ గౌడ్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు బావి వద్దకు చేరుకుని మృతదేహాన్ని వెలికి తీసి బాబర్గా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. మృతుని తండ్రి మౌలానా ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం తూప్రాన్ ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు ఎస్ఐ తెలిపారు.
కుటుంబ కలహాలతో వివాహిత..
బషీరాబాద్, న్యూస్టుడే: కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్ఐ విద్యాచరణ్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... బషీరాబాద్ మండలం పర్వత్పల్లికి చెందిన పాషాతో గొట్టిగకుర్ధుకు చెందిన మహ్మద్ బిజానీ (26)కు ఆరేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు సంతానం. కుటుంబంలో గొడవల కారణంగా ఇటీవల ఆమె గొట్టిగకుర్ధులోని తల్లిగారింటికి వచ్చింది. శనివారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో బిజానీ పురుగుల మందు సేవించి అపస్మారక స్థితికి చేరుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు తాండూరు జిల్లా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందిందని వైద్యులు పేర్కొన్నారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
భార్య కాపురానికి రానంది.. భర్త..
నవాబుపేట, న్యూస్టుడే: నవాబుపేట మండలం చించల్పేట గ్రామానికి చెందిన సీహెచ్ మహేష్ (32) మోమిన్పేట మండలం వెల్చాల్ గ్రామానికి చెందిన ఉమామహేశ్వరితో ఎనిమిదేళ్ల కిత్రం వివాహమైంది. కొడుకు, కూతుర్లున్నారు. భార్యా భర్తల మధ్య తరచూ గొడవలు జరగడంతో భార్య సంవత్సరం క్రితమే పుట్టింటికి వెళ్లిపోయింది. నెల క్రితం ఆమెను తీసుకు రావడానికి అత్తారింటికి వెళ్లినా ఆమె నిరాకరింది. దీంతో మనస్థాపానికి గురై తాగుడుకు అలవాటు పడ్డారు. ఈ క్రమంలో శనివారం రాత్రి మద్యం తాగి ఇంటికి వచ్చి, పక్కగదిలోకి వెళ్లాడు. ‘భోజనం చేయవా’ అంటూ తండ్రి పిలిచాడు. సమాధానం లేకపోవడంతో గదిలోకి వెళ్లి గమనించగా చీరతో ఉరేసుకుని వేలాడుతూ కనిపించాడు. తండ్రితో పాటు, కుటుంబ సభ్యులు గమనించగా అప్పటికే మృతిచెందాడు. విషయాన్ని పోలీసులకు తెలిపారు. మృతుడి తండ్రి నర్సిములు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకటేశం తెలిపారు.
మతిస్థిమితం లేక... మద్యానికి బానిసై
మద్యానికి బానిసై ఉరేసుకొని మృతిచెందాడో వ్యక్తి... పోలీసులు, కుటుంబీకుల వివరాల ప్రకానం మహబూబ్నగర్ జిల్లా, బాలనగర్ మండలం, చిన్నరేవెల్లి గ్రామానికి చెందిన వై..వెంకటయ్య, (40) భార్య యాదమ్మలకు ముగ్గురు సంతానం. పెద్ద అమ్మాయి వివాహం చేశారు. పిల్లలు సంధ]్య, శ్రీరామ్లతో కలిసి నాలుగు నెలల క్రితం నవాబుపేట మండలం ముభారక్పూర్ గ్రామ సమీపంలో అదే గ్రామానికి చెందిన విష్ణువర్థన్రెడ్డి కోళ్లఫాంలో పనికి కుదిరారు. వెంకటయ్యకు గతంలో రోడ్డు ప్రమాదంలో తలకు గాయమెంది. దీంతో అప్పుడప్పుడు మతిస్థిమితం లేకుండా వ్యవహరించేవాడు. మద్యానికి అలవాటు పడ్డాడు. భార్య ఎంత చెప్పినా వినిపించుకునేవాడు కాదు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం భార్య నిద్రలేచి చూసే సరికి ఇంట్లో లేడు. గమనించగా పక్క గదిలో ఉరి వేసుకుని కనిపించాడు. భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకటేశం తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
[ 27-04-2024]
గ్రేటర్ హైదరాబాద్లోని గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ఎన్నికల అధికారులు ప్రకటనలు చేయడంతో చేవెళ్ల, మల్కాజిగిరి నియోజకవర్గాల నుంచి కొన్ని ప్రతిపాదనలొచ్చాయి. -
ఆమోదం 178.. తిరస్కరణ 124
[ 27-04-2024]
రాజధాని పరిధిలోని హైదరాబాద్, సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజిగిరి లోక్సభ నియోజకవర్గాల్లో అభ్యర్థుల నామపత్రాల పరిశీలన శుక్రవారం ముగిసింది. -
ఓటర్లను కాదు నేతలను కొనేద్దాం
[ 27-04-2024]
సాధారణంగా ఎన్నికల సమయంలో ఓటర్లకు డబ్బులిచ్చి ప్రలోభపెడుతుండటం చూస్తుంటాం.. వింటుంటాం. ఈ లోక్సభ ఎన్నికల్లో మాత్రం నాయకులు పూర్తిగా ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. -
ఎన్వోసీ ఇవ్వడానికి రూ.5 లక్షల లంచం
[ 27-04-2024]
వాణిజ్య భవనానికి నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) ఇచ్చేందుకు రూ.5 లక్షల లంచం డిమాండ్ చేసిన నీటిపారుదల శాఖ డిప్యూటీ కార్యనిర్వాహక ఇంజినీరు(డీఈఈ) యాత పవన్కుమార్ అనిశాకు దొరికిపోయాడు. -
ఎవరి దారి వారిదే
[ 27-04-2024]
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం లేకపోవడంతో జాతీయ రహదారుల సంస్థ, మెట్రో రైలు సంస్థలు..ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. -
నిజాం కళాశాలలో ‘డూ యూ నో..?’ బోర్డులు
[ 27-04-2024]
ఉస్మానియా విశ్వవిద్యాలయం ‘తక్షు’ కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోంది. అందులో భాగంగా నిజాం కళాశాలలో చదివి ఉన్నతస్థాయికి ఎదిగిన పూర్వ విద్యార్థుల ఫ్లెక్సీలతో ‘డూ యూ నో’(మీకు తెలుసా..?) బోర్డులను కాలేజీ ప్రాంగణంలో ప్రిన్సిపల్ ప్రొ.బి.బీమా శుక్రవారం ఏర్పాటు చేయించారు. -
ఐపీఎల్ టికెట్లు బ్లాక్లో విక్రయిస్తున్న ఇద్దరి అరెస్టు
[ 27-04-2024]
రెజిమెంటల్బజార్: ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ టికెట్లను బ్లాక్లో విక్రయిస్తున్న ఇద్దరిని బుధవారం ఉత్తర మండలం టాస్క్ఫోర్స్, గోపాలపురం పోలీసులు అరెస్టు చేశారు. -
కోడ్ ఉల్లంఘనలా.. ఫిర్యాదు చేయండి
[ 27-04-2024]
ఎన్నికల నియమావళి ఉల్లంఘనలపై హైదరాబాద్ జిల్లా పరిధిలోని రెండు ఎంపీ స్థానాలు, ఓ అసెంబ్లీ పరిధిలో ఏవేనీ ఫిర్యాదులు ఉన్నట్లయితే.. ఆయా స్థానాలకు నియమితులైన పరిశీలకులకు ఫిర్యాదు చేయొచ్చని జిల్లా ఎన్నికల అధికారి(డీఈఓ) రోనాల్డ్రాస్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. -
ప్రచారానికి వడదెబ్బ
[ 27-04-2024]
పార్లమెంట్ ఎన్నికల గడువు ముంచుకొస్తోంది.. ప్రస్తుతం అభ్యర్థులు నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఇక అన్ని పార్టీలు ప్రచారం కోసం రంగంలోకి దిగనున్నాయి. -
మజ్లిస్ ఓటమికి మతతత్వ శక్తుల కుట్ర: ఒవైసీ
[ 27-04-2024]
26 ఏళ్లు శ్రమిస్తే దక్కిన ఎంపీ సీటును 1984 నుంచి కాపాడుకుంటూ వస్తున్నామని మజ్లిస్ అధినేత, హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. -
ఎన్నికల వేడి.. రైళ్లు ప్రత్యేకమండి
[ 27-04-2024]
వేసవి సెలవులు వచ్చాయంటే ప్రత్యేక రైళ్లు వేయడం పరిపాటే. కానీ ఈ సారి వాటికి తోడు ఎన్నికలు కూడా వచ్చాయి. -
భార్య తిట్టిందని ఆత్మహత్య
[ 27-04-2024]
భార్య తిట్టిందని భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. అమీన్పూర్ ఎస్ఐ మల్లయ్య వివరాల ప్రకారం.. అమీన్పూర్ పురపాలిక బీరంగూడ మంజీరానగర్లో ఉంటున్న శ్రీనివాస్(29) మద్యానికి అలవాటుపడి ఇంటివద్దే ఉంటున్నాడు. -
స్వతంత్రంగా ఉంటాం
[ 27-04-2024]
ఉస్మానియా విశ్వవిద్యాలయం, జవహర్లాల్ సాంకేతిక విశ్వవిద్యాలయాలకు అనుబంధ గుర్తింపున్న ప్రైవేటు, కార్పొరేటు ఇంజినీరింగ్ కళాశాల్లో కొన్ని అనుబంధ గుర్తింపుతో పాటు ‘స్వయం ప్రతిపత్తి’ కోరుకుంటున్నాయి. -
కిడ్నాపర్ల చెర నుంచి తప్పించుకున్న బాలిక
[ 27-04-2024]
నాగపూర్లో కిడ్నాప్ అయిన ఓ బాలిక తప్పించుకుని సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసులను ఆశ్రయించింది. పోలీసుల కథనం ప్రకారం మహారాష్ట్ర నాగపూర్కు చెందిన బాలిక (17) శుక్రవారం రాత్రి 9.30 గంటల సమయంలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో డిప్యూటీ స్టేషన్ మాస్టర్ గదిలోకి పరుగున వచ్చింది. -
అక్రమ లేఅవుట్లు..ఆదాయానికి తూట్లు
[ 27-04-2024]
వ్యాపార వాణిజ్య పట్టణంగా రాష్ట్రంలో పేరున్న తాండూరులో అక్రమ లేఅవుట్లు యథేచ్ఛగా సాగి పోతున్నాయి. -
డ్వాక్రా మహిళలే కీలకం!
[ 27-04-2024]
జిల్లా వ్యాప్తంగా గ్రామం, వార్డు అనే తేడా లేకుండా అన్నిచోట్లా ‘డ్వాక్రా స్వయం సహాయక సంఘాలు’న్నాయి. వీటిలో వేలాది మంది కొనసాగుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
జనం భూమిలో... జగన్ చిచ్చు..!
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు
-
వైకాపా ప్రభుత్వ విలేజీ క్లినిక్.. కాలేదు క్లిక్
-
రెండు కిలోమీటర్లకే రూ.9 వ్యత్యాసమా..!