చెరువులు ఇక చరిత్రేనా?
నగరంలో ఏ చెరువు చూసినా.. ఆక్రమణల చెరలో చిక్కి శల్యమవుతోంది. తటకాలు కనుమరుగై.. భారీ భవంతులు పుట్టుకొస్తున్నాయి. ఆక్రమణలను అడ్డుకునేందుకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం చెబుతున్నా... క్షేత్రస్థాయిలో నిర్మాణాలు ఆగడం లేదు.
సుందరీకరణకు నోచుకోని ఫలితం
ఈనాడు, హైదరాబాద్ - న్యూస్టుడే, యూసుఫ్గూడ,
నగరంలో ఏ చెరువు చూసినా.. ఆక్రమణల చెరలో చిక్కి శల్యమవుతోంది. తటకాలు కనుమరుగై.. భారీ భవంతులు పుట్టుకొస్తున్నాయి. ఆక్రమణలను అడ్డుకునేందుకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం చెబుతున్నా... క్షేత్రస్థాయిలో నిర్మాణాలు ఆగడం లేదు. గ్రేటర్ సహా శివారు ప్రాంతాల్లోని చెరువులు కబ్జాల వలలో చిక్కుకున్నాయి. ఏళ్ల తరబడి రెవెన్యూ, నీటి పారుదల శాఖల నిస్తేజాన్ని ఆసరాగా చేసుకుని అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు.
చెరువులంటే సాగు, తాగునీరు అందించే వనరులు..! ఆహ్లాదాన్ని పంచే ప్రదేశాలు..!! ఇదంతా ఒకప్పటి మాట.!!! ఆక్రమణల దరువు ఇప్పటి మాట!!!!
పెద్దతటాకం.. చిన్న కొలనుగా మారి
దాదాపు నాలుగు దశాబ్దాల కిందట యూసుఫ్గూడ అంటే పోలీస్ మొదటి పటాలం, పెద్ద చెరువు, చిన్నచెరువు గుర్తుకు వచ్చేవి. దాదాపు 35 ఎకరాల్లో పెద్దచెరువు విస్తరించి ఉండేదని అంచనా. రానురానూ పెద్ద చెరువులోని భాగం కబ్జాకు గురైంది. ఉన్న కాస్త స్థలాన్ని కాపాడుకునేందుకు ప్రహరీ నిర్మించి 2004లో కృష్ణకాంత్పార్కును ఏర్పాటు చేశారు. ప్రస్తుతం పార్కు మధ్యలో ఉన్న చిన్న కొలను ప్రాంతమే గతంలో పెద్దచెరువుకు ఆనవాలుగా మిగిలింది. యాదగిరినగర్, జవహర్నగర్ పెద్దచెరువులోనే పుట్టుకొచ్చాయి. ఇక చిన్నచెరువులోనే లక్ష్మీనర్సింహనగర్ బస్తీ ఏర్పడింది. శ్రీకృష్ణానగర్ ఏ-బ్లాకులోని కొద్ది ప్రాంతం సైతం ఇందులోనే ఏర్పడింది.
* ప్రాంతం: యూసుఫ్గూడ
* పేరు: పెద్దచెరువు
* విస్తీర్ణం: 35 ఎకరాలు
* మిగిలింది: చిన్న కొలను
పాతబస్తీ.. కబ్జాలతో జబర్దస్తీ
పాతబస్తీ బార్కస్లోని గుర్రంచెరువు ఎఫ్టీఎల్, బఫర్జోన్ ఎక్కడా కనిపించకుండా మాయమైంది. పదుల సంఖ్యలో కాలనీలు వెలిశాయి. అధికారులు నామమాత్రంగా కేసులు పెట్టి చేతులు దులుపుకొంటున్నారు. రాయల్కాలనీ వైపున రోహింగ్యాల పేరుతో చెరువును కబ్జా చేస్తున్నారు. చెరువు సుందరీకరణకు 2015లో మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేసినా.. ముందుకు సాగడం లేదు. అక్రమ కట్టడాలను కూల్చివేసి చుట్టూ వాకింగ్ ట్రాక్ నిర్మించాల్సి ఉండగా.. కబ్జాదారులకు వత్తాసు పలుకుతూ అధికారులు ఫెన్సింగ్ పనులు చేపట్టారు. బార్కస్, సలాలావైపు ట్రాక్ నిర్మాణ పనులే చేపట్టలేదు.
* ప్రాంతం: బార్కస్
* పేరు: గుర్రంచెరువు
* విస్తీర్ణం: 90.69 ఎకరాలు
* మిగిలింది: 20 ఎకరాలు
శంకుస్థాపన చేసి పనులు చేయక
బండ్లగూడలోని సూరం తటాకం రూపురేఖలు కోల్పోయింది. 2000లో హుడా నివేదిక ప్రకారం 46.95 ఎకరాలు ఉండేది. తర్వాత హెచ్ఎండీఏ జారీ చేసిన నోటిఫైడ్ మ్యాప్లో 39.30 ఎకరాలున్నాయి. 12 ఎకరాలే మిగిలింది. ప్రజాప్రతినిధుల అండతో.. పట్టా భూములున్నాయంటూ పెద్దఎత్తున ఆక్రమణలు వెలిశాయి. చెరువులో రూ.2.39 కోట్లతో సుందరీకరణ పనులు చేపట్టినా.. పూర్తి కాలేదు. ముళ్ల చెట్లు పెరిగి ట్రాక్ అధ్వానంగా మారింది.
* ప్రాంతం: బండ్లగూడ
* పేరు: సూరం కాసారం
* విస్తీర్ణం: 46.95 ఎకరాలు
* మిగిలింది: 12 ఎకరాలు
మిగిలేదెంతో.. ఆ ‘దేవుని’ దయ!
కాకతీయుల కాలంలో ఎన్ఎండీసీ సమీపంలోని గుట్టపై వేంకటేశ్వర స్వామి ఆలయం కోసం హుమాయున్నగర్లో దేవుని కుంట నిర్మించారు. 1965-1975 వరకు జరిపిన టౌన్ సర్వే రికార్డుల ప్రకారం ఆసిఫ్నగర్ సర్వే నం.22లో 11.2 ఎకరాలలో విస్తరించి ఉంది. చెరువుపై పర్యవేక్షణ కొరవడి నాలుగువైపులా కబ్జాల బారిన పడింది. ఏడు ఎకరాలు అన్యాక్రాంతమయ్యాయి.మూడేళ్ల కిందట మిగిలిన దాన్ని కబ్జా చేసేందుకు ఆక్రమణదారులు ప్రయత్నించారు. కబ్జా విషయంలో ఉన్నతాధికారులను తప్పుదోవ పట్టించినందుకు ఆసిఫ్నగర్ తహసీల్దార్ను అప్పటి కలెక్టర్ సస్పెండ్ చేశారు.
* ప్రాంతం: హుమాయున్నగర్
* పేరు: దేవునికుంట
* విస్తీర్ణం: 11.2ఎకరాలు
* మిగిలింది: 4.5 ఎకరాలు
‘బతుకమ్మా’.. కుంటను బతికించే దారేది..?
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే బతుకమ్మలను మహిళలు అంబర్పేటలోని కుంట (చెరువు)లో నిమజ్జనం చేయడం వల్ల దీనికి బతుకమ్మ కుంట అనే పేరు వచ్చింది. 1961-62లో బతుకమ్మకుంట 13.29 ఎకరాల్లో ఉండగా దాదాపు ఎనిమిది ఎకరాలు ఆక్రమణకు గురైంది. ఎఫ్టీఎల్, బఫర్ జోన్ లోపల, వెలుపల అక్రమ నిర్మాణాలు వెలిశాయి. రెవెన్యూ, నీటి పారుదల శాఖలు స్పందించి పరిరక్షించకుంటే పూర్తిగా అన్యాక్రాంతమయ్యే ప్రమాదం ఉంది.
* ప్రాంతం: అంబర్పేట
* పేరు: బతుకమ్మకుంట
* విస్తీర్ణం: 13.29 ఎకరాలు
* మిగిలింది: 5.12 ఎకరాలు
వానొస్తే అక్రమ కట్టడాలు మునకే
* బౌరంపేట సర్వే నం.755లో 9.03 ఎకరాల్లోని పెద్దచెరువు అర ఎకరా మేర ఆక్రమణకు గురైంది. ఐదేళ్లక్రితం చెరువు ఎఫ్టీఎల్, బఫర్జోన్లోనూ ఓ నిర్మాణ సంస్థ విల్లాలను నిర్మించింది. గతేడాది భారీ వర్షాలకు గేటెడ్ కమ్యూనిటీని వరదనీరు ముంచెత్తింది.
* దుండిగల్ సర్వే నం.405లో 78.20 ఎకరాల్లో ధామరచెరువు విస్తరించింది. పదేళ్ల క్రితం ఓ కళాశాలకు చెందిన నిర్మాణాలు వెలిసినా.. నీటి పారుదల శాఖాధికారులు పట్టించుకోవడం లేదు.
అధికార పార్టీ నేతల చెరలో..
కాముని చెరువును పూడ్చి చదును చేసిన ప్రాంతం
కూకట్పల్లి, మూసాపేట జంట సర్కిళ్లలో 15 చెరువులున్నాయి. 10 చెరువులు చాలావరకు కబ్జాకు గురవ్వగా.. మరో 5 చెరువులు స్వల్పంగా ఆక్రమణకు గురయ్యాయి. అల్లాపూర్, మూసాపేట ఆనుకొని ఉండే సున్నం, కాముని చెరువులను అధికార పార్టీకి చెందిన నేత దర్జాగా కబ్జా చేస్తున్నాడు.
* సున్నంచెరువు 24.12ఎకరాలలో ఉండగా.. 8.89ఎకరాలు మేర ఆక్రమణకు గురైంది. వందలాది ఇళ్లు కాలనీలో నిర్మించారు.
* కాముని చెరువులో పాత కట్టతో సహా చెరువును పూడ్చివేసి కొత్తగా అనుకూలంగా కృత్రిమ కట్ట ఏర్పాటుచేసి 400గజాల స్థలాన్ని కాజేసేందుకు ఇక్కడి అధికార పార్టీ నాయకుడు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు.
* మైసమ్మ చెరువు 10ఎకరాలు ఆక్రమణకు గురైంది. ఇక్కడ ఒక రియల్ఎస్టేట్ కంపెనీ నిర్వాహకులు, స్థానిక నేతలు కొందరు ఆక్రమించి భవనాలు, ఇళ్లు నిర్మించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
యూసఫ్గూడలో అగ్నిప్రమాదం.. 20 కార్లు దగ్ధం!
[ 23-04-2024]
యూసఫ్గూడలో అగ్నిప్రమాదం జరిగింది. అక్కడి గణపతి కాంప్లెక్స్లో సెకండ్ హ్యాండ్ కార్లు విక్రయించే చోట ఈ ఘటన చోటుచేసుకుంది. -
అభిమానం పోటెత్తి.. చెయ్యెత్తి జైకొట్టి
[ 23-04-2024]
మల్కాజిగిరి లోక్సభ నియోజకవర్గ కాంగ్రెస్ జన జాతర బహిరంగ సభకు నాయకులు ఆశించిన జనం కంటే అధికంగా రావడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. -
పొరుగు నేతలకే పెద్దపీట
[ 23-04-2024]
గత రెండు నెలల్లో భారాస నుంచి కాంగ్రెస్ పార్టీలోకి పెద్దఎత్తున నేతలు చేరిపోయారు. దీంతో రాజధానిలో అనేక నియోజకవర్గాల్లో బలపడ్డామని నాయకులు భావిస్తున్నారు. ఇదే సమయంలో క్షేత్రస్థాయిలో పరిస్థితి మరోలా ఉండటంతో ఆందోళన సైతం వ్యక్తమవుతోంది. -
కొండంత విశ్వాసం
[ 23-04-2024]
చేవెళ్ల ఎంపీ స్థానానికి భాజపా అభ్యర్థిగా కొండా విశ్వేశ్వర్రెడ్డి సోమవారం భారీ ర్యాలీతో వచ్చి నామినేషన్ దాఖలు చేశారు.c -
4 ఎంపీ స్థానాలకు 37 నామపత్రాలు
[ 23-04-2024]
సికింద్రాబాద్, హైదరాబాద్, చేవెళ్ల, మల్కాజిగిరి ఎంపీ స్థానాలకు మొత్తం 37 మంది అభ్యర్థులు సోమవారం నామినేషన్లు దాఖలు చేశారు. -
ఇంటికి ఆరుగురు.. ఎలా గురూ?
[ 23-04-2024]
రాజధానిలోని ఒక ఇంటి నంబరుపై గరిష్ఠంగా ఆరుగురు, కనిష్ఠంగా ముగ్గురు ఓటర్లున్నారు. చార్మినార్, బహదూర్పుర నియోజకవర్గాల్లో ఆరు మంది ఓటర్లుండగా, సికింద్రాబాద్, కంటోన్మెంట్ పరిధిలో ముగ్గురేసి ఉన్నారు. -
చరవాణి హ్యాక్ చేసి.. రూ. 40.74 లక్షలు స్వాహా
[ 23-04-2024]
మొబైల్ ఫోన్ హ్యాక్ చేసి నగదు దోచేశారంటూ బాధితుడు హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఠాణాలో సోమవారం ఫిర్యాదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. నగరానికి చెందిన వ్యాపారి ఫోన్కు ‘మీ ఖాతా బ్లాక్ చేయబడింది’ అంటూ సందేశం వచ్చింది. -
15 స్ట్రాంగ్ రూముల్లో.. 5వేల ఈవీఎంలు
[ 23-04-2024]
సికింద్రాబాద్, హైదరాబాద్ ఎంపీ స్థానాలకు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నికకు సంబంధించి ఈవీఎంలను సిద్ధం చేశామని జీహెచ్ఎంసీ కమిషనర్, జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్రాస్ వెల్లడించారు. -
అప్పుడు 38.5.. ఇప్పుడు 43.3
[ 23-04-2024]
నగరంలో రికార్డు స్థాయిలో పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సోమవారం 43.3 డిగ్రీలు నమోదైంది. -
ప్రతిదానికీ ఓ లెక్కుంది..!
[ 23-04-2024]
ఫలితాల వరకు ఈనాడు డిజిటల్, హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే సికింద్రాబాద్, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, చేవెళ్ల లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి పలు పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. -
రూ.72 లక్షలు వడ్డీతో సహా చెల్లించండి
[ 23-04-2024]
నిర్మాణ ఒప్పందానికి సంబంధించి బ్యాంకు గ్యారంటీలు చెల్లించకుండా కాలయాపన చేసిన ఐసీఐసీఐ బ్యాంకుకు హైదరాబాద్ వాణిజ్య వివాదాల కోర్టు మొట్టికాయలు వేసింది. -
స్ట్రాంగ్ రూమ్లకు భారీ బందోబస్తు
[ 23-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు కొన్ని నెలలుగా అధికారులు చేస్తున్న ఏర్పాట్లు ఒక్కొక్కటీ పూర్తవుతున్నాయి. ఎన్నికలకు అవసరమైన సరంజామా ఆయా నియోజకవర్గాలకు చేర్చారు. -
గుడిలో ఆభరణాల చోరీ కేసులో ముగ్గురి రిమాండ్
[ 23-04-2024]
ఆర్టీసీ క్రాస్రోడ్డులోని పంచముఖి ఆంజనేయస్వామి ఆలయంలో పంచలోహ విగ్రహాలు, బంగారు ఆభరణాల చోరీ కేసులో నిందితుడు సహా మరో ఇద్దరిని చిక్కడపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
రేవంత్రెడ్డికి పాలనా అనుభవం శూన్యం: పొన్నాల
[ 23-04-2024]
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి పాలన అనుభవం శూన్యమని, అందుకే విమర్శలు చేస్తున్నారని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. -
సాంకేతిక ఉత్సవం.. విద్యార్థుల నైపుణ్యం
[ 23-04-2024]
జేఎన్టీయూ ఇంజినీరింగ్ విద్యార్థులు సాంకేతిక నమూనాలతో సత్తాచాటారు. సోమవారం వర్సిటీలో రెండురోజుల సాంకేతిక ఉత్సవాల ప్రారంభం సందర్భంగా వివిధ విభాగాల్లో విద్యార్థులు ఏర్పాటుచేసిన నమూనాలు వారిలోని సాంకేతిక పరిజ్ఞానాన్ని చాటాయి. -
విమానాశ్రయంలో పార్కింగ్ చేసిన డీసీఎం దగ్ధం
[ 23-04-2024]
పార్కింగ్ చేసిన ఓ డీసీఎం అగ్నికి ఆహుతైన సంఘటన శంషాబాద్ విమానాశ్రయంలో సోమవారం చోటు చేసుకుంది. అప్రమత్తమైన ఎయిర్పోర్ట్ అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేయడంతో అధికారులు, ఉద్యోగులు ఊపిరి పీల్చుకున్నారు. -
నీటి విక్రయం.. నాణ్యత ప్రశ్నార్థకం
[ 23-04-2024]
జిల్లాలో నాణ్యతలేని తాగు నీటి విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ప్రజల అవసరాన్ని ఆసరా చేసుకుని అక్రమార్కులు రూ.లక్షల్లో సంపాదిస్తున్నారు. -
సీఎం సుడిగాలి పర్యటన నేడు
[ 23-04-2024]
ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నాలుగోసారి పాలమూరుకు రానున్నారు. ప్రచారంలో భాగంగా ఇప్పటికే కొడంగల్, నారాయణపేట, మహబూబ్నగర్లో పర్యటించిన సీఎం మరోసారి పాలమూరులో నేడు (మంగళవారం) సుడిగాలి పర్యటన చేయనున్నారు. -
ప్రజలను మోసం చేసిన భాజపా, భారాస: కాంగ్రెస్
[ 23-04-2024]
మతతత్వ పార్టీలకు ఓటు ద్వారా తగిన బుద్ధి చెప్పాలని చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని గొట్లపల్లి, తట్టేపల్లి గ్రామాలు కేంద్రాలుగా ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. -
తనిఖీలు శూన్యం.. సౌకర్యాలు కనం
[ 23-04-2024]
తాండూరు ప్రాంతం నాపరాయి ఇతర జిల్లాలు..పొరుగు రాష్ట్రాలు..విదేశాలకు ఎగుమతి అవుతోంది. అంతటి పేరున్న నాపరాయిని వెలికితీసేందుకు వేలాది మంది కార్మికులు శ్రమిస్తున్నారు. -
ఆర్ఎంపీ, పీఎంపీలు నిబంధనలు పాటించాలి
[ 23-04-2024]
జిల్లాలోని ఆర్ఎంపీ, పీఎంపీలు తమ పరిమితికి మించి వైద్య సేవలు అందించకూడదని, ఒకవేళ అందిస్తే క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్-2010 ప్రకారం క్రిమినల్ చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్యాధికారి పల్వన్కుమార్ సోమవారం హెచ్చరించారు.
తాజా వార్తలు (Latest News)
-
కేజ్రీవాల్, కవిత జ్యుడీషియల్ కస్టడీ మళ్లీ పొడిగింపు
-
ఫొటోకు పోజులిస్తూ... అగ్నిపర్వతంలో జారిపడిన పర్యటకురాలు
-
విమానాల్లో 12 ఏళ్లలోపు వారికి తల్లిదండ్రుల పక్కనే సీటివ్వాలి: డీజీసీఏ
-
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీ పిటిషన్పై తీర్పు వాయిదా
-
కొంతమంది ముంబయి ఆటగాళ్లు రోహిత్ శర్మనే కెప్టెన్ అనుకుంటున్నారు: ఇర్ఫాన్ పఠాన్
-
మాధురి దీక్షిత్తో నటించాలంటే భయమేసింది: మనీషా కొయిరాలా