logo

గోశాలలకుచేయూత అందించాలి

గ్రేటర్‌ పరిధిలోని గోశాలలకు ప్రభుత్వపరంగా ఆర్థిక చేయూత అందించాలని తెలంగాణ గోసంరక్షణ సంస్థలు కోరాయి. 40 గోశాలల్లో 30 వేల గోవులు ఉన్నాయని, వాటి నిర్వహణ కష్టమవుతోందని పేర్కొన్నాయి.

Published : 06 Dec 2021 04:23 IST

మంత్రి తలసానికి జ్ఞాపిక అందజేస్తున్న స్వామి స్వయం భగవాన్‌దాస్‌, జస్మత్‌పటేల్‌

కాచిగూడ, న్యూస్‌టుడే: గ్రేటర్‌ పరిధిలోని గోశాలలకు ప్రభుత్వపరంగా ఆర్థిక చేయూత అందించాలని తెలంగాణ గోసంరక్షణ సంస్థలు కోరాయి. 40 గోశాలల్లో 30 వేల గోవులు ఉన్నాయని, వాటి నిర్వహణ కష్టమవుతోందని పేర్కొన్నాయి. ఆదివారం కాచిగూడలోని తెలంగాణ లవ్‌ఫర్‌కౌ ఫౌండేషన్‌ ఛైర్మన్‌ జస్మత్‌పటేల్‌, ప్రాణిమిత్ర రమేశ్‌ జాగిర్దార్‌ మెమోరియల్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపక కార్యదర్శి రితీశ్‌ జాగిర్దార్‌, తెలంగాణ ఎనిమల్‌ వెల్ఫేర్‌ బోర్డు సభ్యుడు స్వామి స్వయం భగవాన్‌దాస్‌, గోసంరక్షణ ఉద్యమకారుడు రమేశ్‌ తివారి తదితరులు మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, డైరెక్టర్‌ ఎస్‌.రామచంద్రలను మారేడుపల్లిలోని నివాసంలో జ్ఞాపికతో సన్మానించి విజ్ఞప్తి చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు