TS News: భాజపాలో చేరిన తెలంగాణ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు విఠల్
తెలంగాణ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు సీహెచ్. విఠల్ భాజపాలో చేరారు. దిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో కేంద్రమంత్రి ముక్తార్ అబ్బాస్నఖ్వీ, తెలంగాణ
హైదరాబాద్: తెలంగాణ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు సీహెచ్. విఠల్ భాజపాలో చేరారు. దిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో కేంద్రమంత్రి ముక్తార్ అబ్బాస్నఖ్వీ, తెలంగాణ భాజపా వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్చుగ్ సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకొన్నారు.
ఈ సందర్భంగా భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ అసలైన ఉద్యమకారులకు తమ పార్టీ వేదికగా మారుతోందన్నారు. నిజమైన ఉద్యమకారులకు సీఎం కేసీఆర్ అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. బంగారు తెలంగాణ ఆశయాన్ని పక్కనపెట్టి కుటుంబం, సొంతవారి ఆస్తులు పెంచడానికి కేసీఆర్ కృషి చేస్తున్నారని తరుణ్చుగ్ విమర్శించారు. విఠల్ మాట్లాడుతూ తెలంగాణ వచ్చినా నిరుద్యోగుల ఆత్మబలిదానాలు ఆగడం లేదన్నారు. రాష్ట్రంలో ఉద్యోగాలను భర్తీ చేయడంలో తెరాస ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
30న తెనాలికి చంద్రబాబు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 30న తెదేపా అధినేత చంద్రబాబు గుంటూరు జిల్లా తెనాలి రానున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, కూటమి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. -
వైకాపా బాధితులకు న్యాయం చేయాలి
వైకాపా పాలనలో అన్యాయానికి గురైన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ శనివారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోవూరు శ్రీలక్ష్మి వెల్లడించారు. -
అమరవీరుల స్తూపాన్ని శుద్ధి చేసిన కాంగ్రెస్ నేతలు
ఉద్యమ సమయంలో విద్యార్థుల మరణాలకు కారణమైన మాజీ మంత్రి హరీశ్రావు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద అడుగుపెట్టి మలినం చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆక్షేపించారు. -
పేదల అభ్యున్నతే భారాస లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితిగా పరిణతి చెంది.. రైతులు, శ్రామికులు, బడుగు బలహీన వర్గాలు, పేదల అభ్యున్నతే లక్ష్యంగా పోరాటం కొనసాగిస్తోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. -
కాంగ్రెస్లో కొనసాగుతున్న చేరికలు
కాంగ్రెస్లో చేరికలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి టికెట్ ఆశించారు. -
సంక్షిప్త వార్తలు (8)
దేశవ్యాప్తంగా శుక్రవారం జరిగిన రెండోదశ లోక్సభ ఎన్నికల పోలింగు భాజపా సారథ్యంలోని ఎన్డీయేకు శుభసూచకమని, అధికార కూటమికి అపూర్వమైన మద్దతు లభించినట్లు ప్రధాని మోదీ తెలిపారు.