మురుగులో కాసుల వేట!
వికారాబాద్ పురపాలక సంఘం పరిధి భూగర్భ మురుగు నీటి సరఫరా వ్యవస్థలో మ్యాన్హోల్ మూతల మరమ్మతుకు పారిశుద్ధ్య కార్మికులతో పనులు చేయిస్తున్నారు. ఇందుకోసం ప్రభుత్వ డ్రిల్లింగ్ యంత్రాలను వినియోగించి, గుత్తేదారుని పేరిట
సిబ్బందే గుత్తేదారులుగా మారుతున్న వైనం
ఈనాడు డిజిటల్, వికారాబాద్
వికారాబాద్ అగ్నిమాపక కేంద్రం ఎదుట మరమ్మతు చేపడుతున్న సిబ్బంది
* వికారాబాద్ పురపాలక సంఘం పరిధి భూగర్భ మురుగు నీటి సరఫరా వ్యవస్థలో మ్యాన్హోల్ మూతల మరమ్మతుకు పారిశుద్ధ్య కార్మికులతో పనులు చేయిస్తున్నారు. ఇందుకోసం ప్రభుత్వ డ్రిల్లింగ్ యంత్రాలను వినియోగించి, గుత్తేదారుని పేరిట ఎంబీలు రాయిస్తున్నారు. ఇలా పనులను రూ.లక్ష నుంచి రూ.2 లక్షలుగా విభజించి సిబ్బంది సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
* మరో కాలనీలో మున్సిపల్ సిబ్బందితో 50 మీటర్ల మురుగు పైపులైన్ పనులు చేయించారు. దీనికీ బిల్లులు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
* ఏడాదిన్నర కిందట వికారాబాద్ ఓ కాలనీలో భూగర్భ మురుగు నీటి పైపులైన్ వేయడానికి సిబ్బంది, పైపులు, జేసీబీ ఇతర అన్ని రకాలుగా మున్సిపాలిటీకి చెందిన వాటిని వినియోగించుకుని రూ.1.25 లక్షల వరకు బిల్లు చేసుకోవాలని ప్రయత్నించారు. ఈ విషయమై ‘ఈనాడు’లో కథనం ప్రచురితం కావడంతో నిలిపివేశారు.
చేసే పనులు పురపాలక సంఘానివే.. అక్కడ పనిచేసే సిబ్బందికి వేతనాలు చెల్లించేది మున్సిపాలిటీయే.. ఉపయోగించే పరికరాలూ ప్రభుత్వానివే.. అయినా బిల్లుల చెల్లించాలంటూ ఉద్యోగులే గుత్తేదారుగా మారారు. ప్రైవేటు వ్యక్తులకు కాంట్రాక్టు ఇచ్చినట్లు.. వారే పనులు చేసినట్లు నకిలీ బిల్లులు రికార్డు చేసి అందినంత జేబులో వేసుకుంటున్నారు. ఈ తతంగం అధికారులకు తెలిసినా తమకు పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ఇదంతాజిల్లా కేంద్రమైన వికారాబాద్ పురపాలక సంఘంలో విధులు నిర్వహిస్తున్న కొంత మంది సిబ్బంది మాయాజాలం.
వికారాబాద్ పురపాలక సంఘాన్ని కేంద్ర ప్రభుత్వం శాటిలైట్ టౌన్షిప్గా గర్తించింది. భూగర్భ మురుగు నీటి వ్యవస్థ, అంతర్గత రహదారులు, తాగునీటి సరఫరాకు రూ.190 కోట్లకుపైగా నిధులు కేటాయించింది. టెండర్ దక్కించుకున్న సంస్థ పూర్తి స్థాయిలో పనులు చేపట్టకుండానే బిల్లులు తీసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం భూగర్భ మురుగు నీటి వ్యవస్థ నిర్వహణ పేరు చెప్పి కొంత మంది సిబ్బంది జేబులు నింపుకొంటున్నారు. ఇటీవల పట్టణంలో మ్యాన్హోళ్ల మరమ్మతు చేపట్టారు. ఈ సమయంలో పురపాలక యంత్రాలు ఉపయోగించి, సిబ్బందే పనులు చేశారు. రికార్డుల్లో మాత్రం గుత్తేదారు చేపట్టినట్లు ఎంబీలు రికార్డు చేసి, సొమ్ము చేసుకుంటున్నారు. ఇదంతా రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు.
భూగర్భ మురుగు నీటి పారుదల పైపులైన్ వేస్తూ..
పనుల్లో నాణ్యతా అంతంతమాత్రమే...
రాతి పొడి వాడటం వల్ల అవి నెల రోజులే బూడిద తొలగి గుంతలు పడుతున్నాయి. మరో వైపు సెప్టిక్ ట్యాంకుల నిర్వహణ, వాహనాల పనితీరులోనూ చేతివాటం ప్రదర్శిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. రోజు ఎన్ని ట్యాంకులను శుభ్రం చేసినా, రెండు నుంచి మూడు చలానాలను పురపాలక సంఘానికి చెల్లించి, మిగతావి జేబులో వేసుకుంటున్నారని సమాచారం. చెత్త సేకరణ ఆటోల విషయంలో రోజు దస్త్రాల్లో చూపించే ఖర్చు, వాస్తవాలకు వ్యత్యాసం కనిపిస్తోంది. వాహనాలు నడిపించకుండానే డీజిల్ బిల్లులు తీసుకుంటున్నారని తెలుస్తోంది.
బిల్లులు నిలిపివేస్తాం
శరత్చంద్ర, పురపాలక సంఘం కమిషనర్
ఈ విషయమై విచారణ జరిపిస్తాం. పురపాలక సిబ్బందితో పనిచేసి పనులకు బిల్లులు పెట్టినట్లు గుర్తిస్తే, వాటిని రద్దు చేస్తాం. బాధ్యులైన సిబ్బందిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఖాళీ చేద్దాం.. పాగా వేసేద్దాం
[ 20-04-2024]
రాజధాని పరిధిలోని భారాస ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు కాంగ్రెస్లో చేరబోతున్నారా...! ప్రస్తుత పరిస్థితులు చూస్తే అవుననే సమాధానం వస్తోంది. -
2వ రోజు.. 17 నామినేషన్లు
[ 20-04-2024]
లోక్సభ ఎన్నికల్లో భాగంగా పలువురు అభ్యర్థులు శుక్రవారం నామినేషన్ పత్రాలు సమర్పించారు. రెండో రోజు మొత్తం 17 నామపత్రాలు దాఖలయ్యాయి. -
లక్ష్యం @ 60%
[ 20-04-2024]
రాష్ట్రంలోనే రాజధాని జిల్లాలో అతి తక్కువ మంది ఓటేస్తారన్న అభిప్రాయాన్ని.. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో రూపుమాపుతామని జీహెచ్ఎంసీ స్పష్టం చేస్తోంది. -
మీమ్స్ తో ప్రచారం.. యువ ఓటర్లకు గాలం
[ 20-04-2024]
ఎన్నికల్లో గెలవాలంటే అనర్గళంగా ప్రసంగిస్తూ.. అన్నివర్గాల ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం.. గెలిస్తే ఏం చేస్తామో చెప్పడం.. ప్రత్యర్థి పార్టీని విమర్శించడం ఒకప్పటి ప్రచార శైలి.. -
‘భాజపాకు తెలంగాణలో స్థానం లేకుండా చేయాలి’
[ 20-04-2024]
హైదరాబాద్లో సర్జికల్ స్ట్రైక్ చేయాలని ఆలోచన చేసే భాజపాకు తెలంగాణలో రాజకీయ స్థానం లేకుండా చేయాలని మజ్లిస్ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు. -
ఒలింపిక్స్లో పతకం తెస్తే బీఎండబ్ల్యూ కారు
[ 20-04-2024]
ప్రపంచ నంబరు వన్ బ్యాడ్మింటన్ సాత్విక్ సాయిరాజ్ ఒలింపిక్స్లో పతకం గెలిస్తే బీఎండబ్ల్యూ కారు బహుమతిగా ఇస్తానని ఎఫ్ఎన్సీసీ స్పోర్ట్స్ కమిటీ ఛైర్మన్ చాముండేశ్వరినాథ్ ప్రకటించారు. -
భాజపా చేసిందేమీ లేదు: దానం
[ 20-04-2024]
భాజపా నాయకులు చెప్పుకొనేందుకు చేసింది ఏమీ లేక రాముడి పేరును దుర్వినియోగం చేస్తున్నారని కాంగ్రెస్ సికింద్రాబాద్ లోక్సభ అభ్యర్థి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ విమర్శించారు. -
అతివేగానికి మూడు ప్రాణాలు బలి
[ 20-04-2024]
వాహనదారుల అతివేగం రెండు ప్రమాదాలకు కారణమై ముగ్గురి ప్రాణాలు తీసింది. బీడీఎల్ ఠాణా సీఐ రవీందర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. -
ఈవీ.. పరుగులేవీ?
[ 20-04-2024]
పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ) విక్రయాల్లో అంత పురోగతి కనిపించడం లేదు. ఆసక్తి చూపడం లేదు. -
జన్యులోపం బాలుడికి కాలేయ మార్పిడి విజయవంతం
[ 20-04-2024]
అరుదైన జన్యులోపంతో జన్మించి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న బాలుడికి బంజారాహిల్స్లోని కేర్ ఆస్పత్రి వైద్యులు విజయవంతంగా కాలేయ మార్పిడి చేశారు. -
‘కాంగ్రెస్తోనే అన్ని వర్గాల సంక్షేమం’
[ 20-04-2024]
కాంగ్రెస్తోనే అన్నివర్గాల సంక్షేమం, అభ్యున్నతి సాధ్యమని అంతర్జాతీయ వైశ్య సమాఖ్య(ఐవీఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్గుప్తా అన్నారు -
మున్నూరుకాపుల ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు ఇవ్వాలి
[ 20-04-2024]
రాష్ట్రంలోని మున్నూరు కాపుల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్పొరేషన్ దోహదపడుతుందని తెలంగాణ మున్నూరు కాపు మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు మణికొండ వెంకటేశ్వర్రావు, మున్నూరు కాపు సంఘం సికింద్రాబాద్ అధ్యక్షుడు లింగిశెట్టి హన్మంత్రావు అన్నారు. -
కాంగ్రెస్ అభ్యర్థి సునీత నామినేషన్కు సీఎం
[ 20-04-2024]
మల్కాజిగిరి లోక్సభ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా పట్నం సునీతారెడ్డి ఈనెల 22న మధ్యాహ్నం 2గంటలకు నామినేషన్ వేస్తున్నారు. -
మహాకాళి అమ్మవారిని దర్శించుకున్న రాజ్నాథ్సింగ్
[ 20-04-2024]
కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్తో కలిసి సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహాకాళి అమ్మవారిని శుక్రవారం ఉదయం దర్శించుకున్నారు. -
స్వచ్ఛ ఇంధనానికి చేతులు కలిపిన ఐఐసీటీ-బీహెచ్ఈఎల్
[ 20-04-2024]
స్వచ్ఛమైన, పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధిలో కలిసి పనిచేయాలని ఐఐసీటీ, బీహెచ్ఈఎల్ నిర్ణయించాయి. -
పదేళ్లలో పాలమూరును ఎడారిగా మార్చారు
[ 20-04-2024]
వంద రోజుల కాంగ్రెస్ పాలనలోనే పాలమూరులో రూ.10వేల కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. -
ప్రతిభకు పేదరికం అడ్డుకాదు: కలెక్టర్
[ 20-04-2024]
ప్రతిభకు పేదరికం అడ్డురాదని, సివిల్స్ ర్యాంకర్లే ఇందుకు నిదర్శనమని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రం వికారాబాద్లోని కలెక్టర్ కార్యాలయంలో వీడీడీఎఫ్ ఆధ్వర్యంలో అష్ఫక్ను సన్మానించారు. -
ఈకేవైసీ.. గడువుతో పనిలేదు
[ 20-04-2024]
నిరుపేదల కోసం ప్రభుత్వం ఉచితంగా రేషన్ బియ్యం సరఫరా చేస్తోంది. ఆహార భద్రత రేషన్ కార్డుల లబ్ధిదారులకు ఆధార్ అనుసంధానం (ఈ కేవైసీ) చేసుకునేందుకు ప్రభుత్వం గడువు నిబంధన అంటూ ఏమీ లేకుండా చేసింది. -
ఉత్తుత్తి బుకింగ్లు.. జలమండలికి టోకరా
[ 20-04-2024]
ఫేక్ బుకింగ్లతో కొందరు జలమండలికి టోకరా వేస్తున్నారు. ట్యాంకర్లకు కృత్రిమ కొరత ఏర్పడి..పెండింగ్ జాబితా అమాంతం పెరిగిపోతోంది. -
నగరానికి సాగర్ జలాల పంపింగ్
[ 20-04-2024]
హైదరాబాద్ జంట నగరాలు, నల్గొండ జిల్లా సాగునీటి అవసరాలు తీర్చేందుకు నాగార్జునసాగర్ జలాశయంలో జలమండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న అత్యవసర మోటార్ల ప్రయోగాత్మక పరిశీలన కొనసాగుతోంది. -
నగరం గరం
[ 20-04-2024]
-
కుమారుడిపై కేసు భయం.. తల్లి ఆత్మహత్య
[ 20-04-2024]
ఓ బాలుడు చేసిన తప్పు తల్లి ప్రాణాలకు ముప్పుతెచ్చింది. ఈ ఘటన ఫిల్మ్నగర్లో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల వివరాల ప్రకారం.. కోనసీమ జిల్లా కొత్తపేట మండలం మందపల్లికి చెందిన వెంకటరమణ, సూర్యకుమారి దంపతులు నగరానికి కొన్నేళ్ల క్రితం వచ్చారు. -
క్యాబ్లలో వస్తువులు మరిచిపోతున్నారు..!
[ 20-04-2024]
క్యాబ్లలో ప్రయాణికులు వస్తువులు మర్చిపోయే నగరాల జాబితాలో హైదరాబాద్ నాలుగో స్థానంలో ఉంది. ‘లాస్ట్ అండ్ ఫౌండ్ - 2024’ నివేదికను ఉబర్ సంస్థ శుక్రవారం విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
తెదేపా కార్యాలయం వద్ద టాస్క్ఫోర్స్ కదలికలు
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?