ప్రాణాలు పోతున్నా శిక్షల్లేవ్
మద్యం మత్తులో ప్రమాదాలు చేస్తూ అమాయకుల ప్రాణాలు తీస్తున్న నిందితులకు చట్టపరంగా శిక్షలు పడడం లేదు. గర్భశోకంతో బాధితుల తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నా, కుటుంబ సభ్యులను కోల్పోయి
ఐదున్నరేళ్లైనా మొదలుకాని రమ్య మృతి కేసు విచారణ
ఈనాడు, హైదరాబాద్, న్యూస్టుడే, విద్యానగర్: మద్యం మత్తులో ప్రమాదాలు చేస్తూ అమాయకుల ప్రాణాలు తీస్తున్న నిందితులకు చట్టపరంగా శిక్షలు పడడం లేదు. గర్భశోకంతో బాధితుల తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నా, కుటుంబ సభ్యులను కోల్పోయి కట్టుబట్టలతో మిగులుతున్నా.. వారికి న్యాయం జరగడం లేదు. డ్రంకెన్ డ్రైవ్ కారణంగా ఎవరైనా చనిపోయినప్పుడు పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి జైళ్లకు పంపుతున్నారు. వారు కొద్దిరోజులు జైల్లో ఉండి బెయిల్ తీసుకుని బయటకు వచ్చి దర్జాగా తిరుగుతున్నారు. నగరంలో గతేడాది జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 1400 మంది మృతి చెందారు. సుమారు 800మంది మందుబాబులు ఢీకొట్టడం వల్లే చనిపోయారు.
వైరస్ వల్ల జాప్యమట..
డీడీ కాలనీలో తల్లిదండ్రులతో నివాసముంటున్న తొమ్మిదేళ్ల బాలిక రమ్య రోడ్డు ప్రమాదంలో జులై 1, 2016న మృతి చెందింది. రమ్య సికింద్రాబాద్ సెయింట్ ఆన్స్ పాఠశాలలో చదువుకుంటోంది. ఆమెను ఇంటికి తీసుకువచ్చేందుకు కారులో ఆమె బాబాయిలు, తాత వెళ్లారు. ఇంటికి వస్తున్నప్పుడు బంజారాహిల్స్ రోడ్ నంబర్ 2/3 నుంచి పంజాగుట్టవైపు వేగంగా వస్తున్న కారు విభాగినిని ఢీకొని రమ్య ప్రయాణిస్తున్న కారుపై పడింది. దీంతో కారులో ఉన్న ఒక బాబాయి అక్కడికక్కడే చనిపోగా.. వారం రోజులు కోమాలో ఉన్న రమ్య తర్వాత చనిపోయింది. ప్రమాదం జరిగిన 18రోజులకు రమ్య తాత చనిపోయాడు. ఈ సంఘటనలో ముగ్గురు మృతి చెందగా ఈ కేసుకు సంబంధించిన విచారణ ఇప్పటివరకూ ప్రారంభం కాలేదు. ప్రధాన నిందితుడు శ్రావిల్కు బెయిల్ వచ్చింది. కేసు విచారణ ఇంకా ఎందుకు ప్రారంభం కాలేదని బంజారాహిల్స్ పోలీసులను ప్రశ్నించగా కరోనా వైరస్ ప్రభావంతో కొన్ని నెలలు జాప్యం జరిగిందని. వచ్చేనెలలో విచారణ ప్రారంభమవుతుందని వివరించారు.
అభియోగాలే ఆటంకాలా?.
మద్యం మత్తులో ప్రమాదాలు చేస్తున్న వారిపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. బాధితులు చనిపోతే ఐపీసీ 304 పార్ట్-2, ఐపీసీ 337, 185 సెక్షన్లను నమోదు చేస్తున్నారు. కారు పైనుంచి పోనిచ్చినా, ఢీకొట్టినా, బైక్తో బలంగా ఢీకొట్టిప్పుడు బాధితులు చనిపోతే అది మద్యంమత్తులో వాహనదారులు చేసిన హత్యేనని బాధితులు అంటున్నారు. కోర్టులో సాక్ష్యాధారాలను సమర్పించేందుకు, ఫోరెన్సిక్ విభాగం నుంచి ఫలితాలు వచ్చేందుకు ఆలస్యమవుతుందని పోలీసులు చెబుతున్నారు. మత్తులో నడిపి ప్రాణాలు తీస్తున్న వారిని శిక్షించాలంటే ఐపీసీ సెక్షన్లను మార్చాలంటూ బాధిత కుటుంబాలు కోరుతున్నాయి.
ఇంకెంత కాలం: పి.వెంకటరమణ, రమ్య తండ్రి
మద్యం మత్తులో నా కుమార్తె మరణానికి కారణమైన వ్యక్తికి శిక్ష ఎప్పుడు వేస్తారు? ముగ్గురి మరణానికి కారణమైన పబ్ను ఏడాది తిరిగేసరికి ఎక్సైజ్శాఖ ప్రారంభించేందుకు అనుమతులు ఇచ్చింది. ఇప్పటికీ నా భార్య, తమ్ముడు అనారోగ్య సమస్యలతోనే బాధపడుతున్నారు. ఎన్నో కేసుల్ని పరిష్కరిస్తామంటున్న పోలీసులు రమ్య కేసును ఎందుకు పట్టించుకోవడం లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రపంచం గర్వించే స్థాయికి తెలుగు యూనివర్సిటీ ఎదగాలి
[ 20-04-2024]
ప్రపంచం గర్వించే స్థాయికి తెలుగు యూనివర్సిటీ ఎదగాలని పలువురు వక్తలు పేర్కొన్నారు. శుక్రవారం బాచుపల్లిలోని పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ 38వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. -
ఒలింపిక్స్లో పతకం తెస్తే బీఎండబ్ల్యూ కారు
[ 20-04-2024]
ప్రపంచ నంబరు వన్ బ్యాడ్మింటన్ సాత్విక్ సాయిరాజ్ ఒలింపిక్స్లో పతకం గెలిస్తే బీఎండబ్ల్యూ కారు బహుమతిగా ఇస్తానని ఎఫ్ఎన్సీసీ స్పోర్ట్స్ కమిటీ ఛైర్మన్ చాముండేశ్వరినాథ్ ప్రకటించారు. -
ఖాళీ చేద్దాం.. పాగా వేసేద్దాం
[ 20-04-2024]
రాజధాని పరిధిలోని భారాస ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు కాంగ్రెస్లో చేరబోతున్నారా...! ప్రస్తుత పరిస్థితులు చూస్తే అవుననే సమాధానం వస్తోంది. -
2వ రోజు.. 17 నామినేషన్లు
[ 20-04-2024]
లోక్సభ ఎన్నికల్లో భాగంగా పలువురు అభ్యర్థులు శుక్రవారం నామినేషన్ పత్రాలు సమర్పించారు. రెండో రోజు మొత్తం 17 నామపత్రాలు దాఖలయ్యాయి. -
లక్ష్యం @ 60%
[ 20-04-2024]
రాష్ట్రంలోనే రాజధాని జిల్లాలో అతి తక్కువ మంది ఓటేస్తారన్న అభిప్రాయాన్ని.. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో రూపుమాపుతామని జీహెచ్ఎంసీ స్పష్టం చేస్తోంది. -
మీమ్స్ తో ప్రచారం.. యువ ఓటర్లకు గాలం
[ 20-04-2024]
ఎన్నికల్లో గెలవాలంటే అనర్గళంగా ప్రసంగిస్తూ.. అన్నివర్గాల ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం.. గెలిస్తే ఏం చేస్తామో చెప్పడం.. ప్రత్యర్థి పార్టీని విమర్శించడం ఒకప్పటి ప్రచార శైలి.. -
‘భాజపాకు తెలంగాణలో స్థానం లేకుండా చేయాలి’
[ 20-04-2024]
హైదరాబాద్లో సర్జికల్ స్ట్రైక్ చేయాలని ఆలోచన చేసే భాజపాకు తెలంగాణలో రాజకీయ స్థానం లేకుండా చేయాలని మజ్లిస్ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు. -
భాజపా చేసిందేమీ లేదు: దానం
[ 20-04-2024]
భాజపా నాయకులు చెప్పుకొనేందుకు చేసింది ఏమీ లేక రాముడి పేరును దుర్వినియోగం చేస్తున్నారని కాంగ్రెస్ సికింద్రాబాద్ లోక్సభ అభ్యర్థి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ విమర్శించారు. -
అతివేగానికి మూడు ప్రాణాలు బలి
[ 20-04-2024]
వాహనదారుల అతివేగం రెండు ప్రమాదాలకు కారణమై ముగ్గురి ప్రాణాలు తీసింది. బీడీఎల్ ఠాణా సీఐ రవీందర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. -
ఈవీ.. పరుగులేవీ?
[ 20-04-2024]
పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ) విక్రయాల్లో అంత పురోగతి కనిపించడం లేదు. ఆసక్తి చూపడం లేదు. -
జన్యులోపం బాలుడికి కాలేయ మార్పిడి విజయవంతం
[ 20-04-2024]
అరుదైన జన్యులోపంతో జన్మించి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న బాలుడికి బంజారాహిల్స్లోని కేర్ ఆస్పత్రి వైద్యులు విజయవంతంగా కాలేయ మార్పిడి చేశారు. -
‘కాంగ్రెస్తోనే అన్ని వర్గాల సంక్షేమం’
[ 20-04-2024]
కాంగ్రెస్తోనే అన్నివర్గాల సంక్షేమం, అభ్యున్నతి సాధ్యమని అంతర్జాతీయ వైశ్య సమాఖ్య(ఐవీఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్గుప్తా అన్నారు -
మున్నూరుకాపుల ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు ఇవ్వాలి
[ 20-04-2024]
రాష్ట్రంలోని మున్నూరు కాపుల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్పొరేషన్ దోహదపడుతుందని తెలంగాణ మున్నూరు కాపు మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు మణికొండ వెంకటేశ్వర్రావు, మున్నూరు కాపు సంఘం సికింద్రాబాద్ అధ్యక్షుడు లింగిశెట్టి హన్మంత్రావు అన్నారు. -
కాంగ్రెస్ అభ్యర్థి సునీత నామినేషన్కు సీఎం
[ 20-04-2024]
మల్కాజిగిరి లోక్సభ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా పట్నం సునీతారెడ్డి ఈనెల 22న మధ్యాహ్నం 2గంటలకు నామినేషన్ వేస్తున్నారు. -
మహాకాళి అమ్మవారిని దర్శించుకున్న రాజ్నాథ్సింగ్
[ 20-04-2024]
కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్తో కలిసి సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహాకాళి అమ్మవారిని శుక్రవారం ఉదయం దర్శించుకున్నారు. -
స్వచ్ఛ ఇంధనానికి చేతులు కలిపిన ఐఐసీటీ-బీహెచ్ఈఎల్
[ 20-04-2024]
స్వచ్ఛమైన, పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధిలో కలిసి పనిచేయాలని ఐఐసీటీ, బీహెచ్ఈఎల్ నిర్ణయించాయి. -
పదేళ్లలో పాలమూరును ఎడారిగా మార్చారు
[ 20-04-2024]
వంద రోజుల కాంగ్రెస్ పాలనలోనే పాలమూరులో రూ.10వేల కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. -
ప్రతిభకు పేదరికం అడ్డుకాదు: కలెక్టర్
[ 20-04-2024]
ప్రతిభకు పేదరికం అడ్డురాదని, సివిల్స్ ర్యాంకర్లే ఇందుకు నిదర్శనమని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రం వికారాబాద్లోని కలెక్టర్ కార్యాలయంలో వీడీడీఎఫ్ ఆధ్వర్యంలో అష్ఫక్ను సన్మానించారు. -
ఈకేవైసీ.. గడువుతో పనిలేదు
[ 20-04-2024]
నిరుపేదల కోసం ప్రభుత్వం ఉచితంగా రేషన్ బియ్యం సరఫరా చేస్తోంది. ఆహార భద్రత రేషన్ కార్డుల లబ్ధిదారులకు ఆధార్ అనుసంధానం (ఈ కేవైసీ) చేసుకునేందుకు ప్రభుత్వం గడువు నిబంధన అంటూ ఏమీ లేకుండా చేసింది. -
ఉత్తుత్తి బుకింగ్లు.. జలమండలికి టోకరా
[ 20-04-2024]
ఫేక్ బుకింగ్లతో కొందరు జలమండలికి టోకరా వేస్తున్నారు. ట్యాంకర్లకు కృత్రిమ కొరత ఏర్పడి..పెండింగ్ జాబితా అమాంతం పెరిగిపోతోంది. -
నగరానికి సాగర్ జలాల పంపింగ్
[ 20-04-2024]
హైదరాబాద్ జంట నగరాలు, నల్గొండ జిల్లా సాగునీటి అవసరాలు తీర్చేందుకు నాగార్జునసాగర్ జలాశయంలో జలమండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న అత్యవసర మోటార్ల ప్రయోగాత్మక పరిశీలన కొనసాగుతోంది. -
నగరం గరం
[ 20-04-2024]
-
కుమారుడిపై కేసు భయం.. తల్లి ఆత్మహత్య
[ 20-04-2024]
ఓ బాలుడు చేసిన తప్పు తల్లి ప్రాణాలకు ముప్పుతెచ్చింది. ఈ ఘటన ఫిల్మ్నగర్లో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల వివరాల ప్రకారం.. కోనసీమ జిల్లా కొత్తపేట మండలం మందపల్లికి చెందిన వెంకటరమణ, సూర్యకుమారి దంపతులు నగరానికి కొన్నేళ్ల క్రితం వచ్చారు. -
క్యాబ్లలో వస్తువులు మరిచిపోతున్నారు..!
[ 20-04-2024]
క్యాబ్లలో ప్రయాణికులు వస్తువులు మర్చిపోయే నగరాల జాబితాలో హైదరాబాద్ నాలుగో స్థానంలో ఉంది. ‘లాస్ట్ అండ్ ఫౌండ్ - 2024’ నివేదికను ఉబర్ సంస్థ శుక్రవారం విడుదల చేసింది.