తప్పులను ఒప్పుకొని ఈటల ముక్కు నేలకు రాయాలి: బాల్క సుమన్‌

పేదలు, ప్రభుత్వ భూములు కబ్జా చేసినట్లు తేలినందున మాజీ మంత్రి, భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలని తెరాస ఎమ్మెల్యే బాల్క సుమన్‌ ...

Published : 08 Dec 2021 01:34 IST

హైదరాబాద్‌: పేదలు, ప్రభుత్వ భూములు కబ్జా చేసినట్లు తేలినందున మాజీ మంత్రి, భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలని తెరాస ఎమ్మెల్యే బాల్క సుమన్‌ డిమాండ్‌ చేశారు. జమునా హేచరీస్‌ 70 ఎకరాలు కబ్జా చేసినట్లు మెదక్‌ జిల్లా కలెక్టర్‌ నివేదిక ఇచ్చారన్నారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మెదక్‌ కలెక్టర్‌పై ఈటల కుటుంబీకులు చేసిన ఆరోపణలు సరికాదని.. ప్రభుత్వ, పేదల భూములు తిరిగి అప్పగించాలని డిమాండ్‌ చేశారు. ఇప్పటికైనా ఈటల రాజేందర్‌ చేసిన తప్పులను ఒప్పుకొని ముక్కు నేలకు రాయాలన్నారు. ఈ విషయంలో రాబోయే రోజుల్లో చట్టపరంగా ఏమేం జరగాలో అవన్నీ అవుతాయని సుమన్‌ అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని