Hyderabad: పోలీసుశాఖను వెంటాడుతోన్నమహమ్మారి.. ఒక్కరోజే 72 మంది పోలీసులకు కొవిడ్
తెలంగాణలో గత కొన్ని రోజులుగా కరోనా మహమ్మారి తన ప్రతాపం చూపిస్తోంది. రాష్ట్రంలో కొవిడ్ కేసులు గణనీయంగా..
హైదరాబాద్: తెలంగాణలో గత కొన్ని రోజులుగా కరోనా మహమ్మారి తన ప్రతాపం చూపిస్తోంది. రాష్ట్రంలో కొవిడ్ కేసులు గణనీయంగా.. వేగంగా పెరుగుతున్నాయి. ఇప్పుడు ఈ మహమ్మారి ప్రభుత్వ కార్యాలయాలపైనా విజృంభిస్తోంది. కరోనా బారిన పడుతున్న వారిలో పోలీసు శాఖ నుంచి అధికంగా ఉంటున్నారు. నగర వ్యాప్తంగా ఉన్న పలు పోలీసు స్టేషన్లలో కలిపి మొత్తంగా 72 మంది పోలీసులు వైరస్ బారినపడ్డారు. తాజాగా హైదరాబాద్ సీసీఎస్, సైబర్ క్రైమ్ విభాగాల్లో పనిచేస్తున్న 20 మంది పోలీసు సిబ్బందికి పాజిటివ్గా నిర్ధరణ అయింది. ఇటీవల సైబర్ క్రైమ్ బృందం ఓ కేసు విషయంలో రాజస్థాన్ వెళ్లి వచ్చింది. ఆ బృందంలోని ఒక ఎస్సైకి కరోనా పాజిటివ్గా తేలింది. అతని నుంచి మిగతా సిబ్బందికి సోకినట్లు పోలీసులు భావిస్తున్నారు. పాజిటివ్ వచ్చిన 20 మంది పోలీసు సిబ్బంది ప్రస్తుతం హోం ఐసోలేషన్ ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. అలాగే వనస్థలిపురం, అబ్దుల్లాపూర్మెట్ పోలీసు స్టేషన్లలో ఒక్కరు చొప్పున, అల్వాల్ పీఎస్లో నలుగురు కానిస్టేబుళ్లు కరోనా బారినపడ్డారు. సోమవారం యాదగిరిగుట్ట పోలీసు స్టేషన్లో ఏసీపీ, సీఐ సహా 12 మందికి ఈ వైరస్ సోకిన విషయం తెలిసిందే.
నార్సింగి పోలీసు స్టేషన్లో 20 మందికి..
రంగారెడ్డి జిల్లాలోని నార్సింగి పోలీసు స్టేషన్లో 20 మంది పోలీసులకు కరోనా సోకింది. ప్రస్తుతం అందరూ హోం ఐసోలేషన్లో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. పెద్ద సంఖ్యలో పోలీసులు వైరస్ బారినపడటంతో స్టేషన్ వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఫిర్యాదుదారుల కోసం పోలీసుస్టేషన్ ఎదుట ప్రత్యేక టెంట్ వేశారు. ప్రజలంతా మాస్కులు ధరించి.. కొవిడ్ నిబంధనలు పాటించాలని ప్రజలకు సూచించారు.
హయత్నగర్ పీఎస్లో 15 మందికి..
నగరంలోని హయత్నగర్ పోలీసుస్టేషన్లో 15 మంది పోలీసులకు కొవిడ్ పాజిటివ్ నిర్ధరణ అయింది. స్టేషన్లో విధులు నిర్వహిస్తోన్న ఎస్ఐ, మరో 14 మంది కానిస్టేబుళ్లు వైరస్ బారినపడ్డారు. వీరంతా ప్రస్తుతం హోం ఐసోలేషన్లో ఉన్నారు.
చైతన్యపురి పోలీసు స్టేషన్లో..
నగరంలోని చైతన్యపురి పోలీసుస్టేషన్లో విధులు నిర్వహిస్తోన్న 8 మంది కానిస్టేబుళ్లకు కొవిడ్ పాజిటివ్ నిర్ధరణ అయింది. ప్రస్తుతం వారంతా ఐసోలేషన్లో ఉన్నారని ఉన్నతాధికారులు తెలిపారు. దీంతో పోలీసులు పీఎస్లోకి ఎవరినీ అనుమతించడం లేదు. ఫిర్యాదు చేసేందుకు వచ్చేవారు కచ్చితంగా మాస్కు ధరించి, భౌతికదూరం పాటించాలని పోలీసులు సూచిస్తున్నారు.
బీఆర్కే భవన్లో..
బీఆర్కే భవన్లో కరోనా కలకలం రేగింది. బీఆర్కే భవన్లోని సాధారణ పరిపాలన, విద్యాశాఖ సహా పలు విభాగాలకు చెందిన 15 మంది ఉద్యోగులు, సిబ్బంది కరోనా బారినపడ్డారు. వీరిలో ఐఏఎస్ అధికారులు, పలు విభాగాల ఉన్నతాధికారులు, ప్రిన్సిపల్ సెక్రటరీలు ఉన్నారు. వీరంతా ప్రస్తుతం హోం ఐసోలేషన్లో ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
చిలుకూరు ఆలయంలో ‘వివాహ ప్రాప్తి’ రద్దు: ప్రధాన అర్చకులు రంగరాజన్
హైదరాబాద్ నగర శివారులోని చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. -
సైబర్ టవర్స్ వద్ద చంద్రబాబు జన్మదిన వేడుకలు
తెదేపా అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలను హైదరాబాద్లో ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. -
చంద్రబాబుకు ప్రముఖుల జన్మదిన శుభాకాంక్షలు
తెదేపా అధినేత చంద్రబాబుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
దుర్గారావును చూపించాలంటూ ఆందోళన.. సీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
నగరంలోని సీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. సీపీ కాంతి రాణాను కలిసేందుకు వడ్డెర కుల సంఘం నేతలు పెద్ద సంఖ్యలో అక్కడికి వచ్చారు. -
కుప్పంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు.. కేక్ కట్ చేసిన నారా భువనేశ్వరి
చిత్తూరు జిల్లా కుప్పంలో తెదేపా అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలను ఆయన సతీమణి నారా భువనేశ్వరి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్లో ఉరుములు, మెరుపులతో వర్షం
నగరంలోని పలుచోట్ల శనివారం ఉదయం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. -
విశాఖ-బెంగళూరు మధ్య ప్రత్యేక రైలు
వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని విశాఖ- బెంగళూరు మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు. -
పెళ్లి ఘట్టం.. క్యూఆర్ కోడ్లో నిక్ష్లిప్తం
రాజమహేంద్రవరానికి చెందిన అలికాని సత్యశివకుమార్(శివస్వామి), దుర్గాభవానీలు వినూత్న ప్రయత్నం చేశారు. -
మీమ్స్ తో ప్రచారం.. యువ ఓటర్లకు గాలం
ఎన్నికల్లో గెలవాలంటే అనర్గళంగా ప్రసంగిస్తూ.. అన్నివర్గాల ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం.. గెలిస్తే ఏం చేస్తామో చెప్పడం.. ప్రత్యర్థి పార్టీని విమర్శించడం ఒకప్పటి ప్రచార శైలి.. -
ఓటాస్త్రం.. స్వీయచిత్రమే సాక్ష్యం
ఓరుగల్లు నగరంలో ఓటింగ్ శాతం పెంచేందుకు వరంగల్ కలెక్టరేట్ ఆవరణలో సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేశారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు
తాజా వార్తలు (Latest News)
-
‘చోటా కె గారు.. మీ గౌరవాన్ని కాపాడుకోండి’.. కాదు.. కూడదంటే I AM Waiting: హరీశ్
-
హెచ్డీఎఫ్సీ ఫలితాలు.. నికర లాభం రూ.17,622 కోట్లు
-
అనారోగ్య సమస్యలతో కేజ్రీవాల్ మరణించేలా కుట్ర: దిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్
-
‘ఇంకెవరూ మీ భార్యే..’: కోహ్లీ ఆన్సర్కు షాకైన దినేశ్ కార్తిక్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
‘నానమ్మా.. మీ కోడలు పచ్చళ్లు సరిగ్గా చేయట్లేదా?’: ఉపాసన ఫన్నీ వీడియో