అమ్యామ్యాల పర్వం.. వాటాలే సర్వం
లంచావతారుల బాగోతాల్ని బట్టబయలు చేసేలా అనిశా దాడులు చేస్తున్నా.. కొందరిలో మాత్రం మార్పు రావడంలేదు. ఏదో ఒక విభాగంలో ప్రభుత్వ ఉద్యోగి పట్టుబడుతున్నా.. భయపడకుండా బరితెగిస్తున్నారు. తాజాగా కరీంనగర్ బల్దియాను కుదిపేసేలా ఈఈ స్థాయి అధికారి రూ.17వేలు తీసుకుంటూ దొరికిపోవడం కలకలం సృష్టించింది. ఇక్కడి కార్యాలయంలో ఏడేళ్ల కిందట రెవెన్యూ ఇన్స్పెక్టర్ పట్టుబడగా.. మళ్లీ కీలకమైన హోదాలో ఉన్న అధికారి అనిశాకు దొరకడం విస్మయాన్ని కలిగిస్తోంది.
రూ.17 వేలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖకు చిక్కిన ఈఈ
ఈనాడు డిజిటల్, కరీంనగర్ న్యూస్టుడే- కార్పొరేషన్, నేరవార్తలు
పట్టుబడిన ఈఈ రామన్ను విచారిస్తున్న ఏసీబీ అధికారులు
లంచావతారుల బాగోతాల్ని బట్టబయలు చేసేలా అనిశా దాడులు చేస్తున్నా.. కొందరిలో మాత్రం మార్పు రావడంలేదు. ఏదో ఒక విభాగంలో ప్రభుత్వ ఉద్యోగి పట్టుబడుతున్నా.. భయపడకుండా బరితెగిస్తున్నారు. తాజాగా కరీంనగర్ బల్దియాను కుదిపేసేలా ఈఈ స్థాయి అధికారి రూ.17వేలు తీసుకుంటూ దొరికిపోవడం కలకలం సృష్టించింది. ఇక్కడి కార్యాలయంలో ఏడేళ్ల కిందట రెవెన్యూ ఇన్స్పెక్టర్ పట్టుబడగా.. మళ్లీ కీలకమైన హోదాలో ఉన్న అధికారి అనిశాకు దొరకడం విస్మయాన్ని కలిగిస్తోంది.
ప్రతి పనికి ఓ రేటు..!
ఎవరు కాదన్నా.. అవునన్నా..! జిల్లాలోని ఇంజినీరింగ్ పనుల్లో కచ్చితంగా ప్రతి పనికి ఇంత రేటు ఉంటుందనేది అందరికి తెలిసిన విషయమే.! ముఖ్యంగా అభివృద్ధి పనులను చేపట్టే గుత్తేదారులు రాజకీయ నాయకులతోపాటు పనుల్ని పర్యవేక్షించే యంత్రాంగానికి ఆయా స్థాయిని బట్టి ఎంతోకొంత ముట్టచెప్పనిదే దస్త్రం కదలదనేది జగమెరిగిన సత్యం. ఇదే కోవలో ఏఈ స్థాయి నుంచి ఎస్ఈ స్థాయి వరకు ఈ కమీషన్ల గోల నడుస్తూనే ఉంది. 1 నుంచి 3శాతం వరకు ఈ చెల్లింపులు ఉంటున్నట్లు తెలిసింది. చాలా సందర్భాల్లో పనులు చేసే గుత్తేదారుకు, వీటిని గమనిస్తున్న అధికారికి మధ్య సయోధ్య కారణంగా వీరి మధ్య జరిగే ఇచ్చిపుచ్చుకోవడాలు బయటపడవు. చాలా తక్కువ సందర్భాల్లోనే వీరు బయటపడుతుంటారు. పైగా కొందరు అధికారుల వ్యవహారం శ్రుతిమించినట్లు ఉండటంతోపాటు ప్రతిపనిలో ఇబ్బందులు పెడుతున్న సమయంలోనే బాధితులు అనిశా అధికారుల్ని ఆశ్రయిస్తున్నారు. ముఖ్యంగా లక్షలు వెచ్చించి చేసిన పనులకు సంబంధించిన బిల్లులను విడుదల చేయించే క్రమంలో విపరీత జాప్యం చేస్తున్నారనే విమర్శలున్నాయి. చేసిన ఖర్చులు చేతికి రాక బాధితులు ఇలాంటి నిర్ణయాలు తీసుకున్న సంఘటనలు ఇదివరకు జిల్లాలో కనిపించాయి. కొన్ని నెలల కిందట హుజూరాబాద్ నియోజకవర్గంలో చేసిన పనులకు సంబంధించిన బిల్లులు ఇవ్వకుండా ఓ అధికారి సతాయిస్తున్నాడని గుత్తేదారు రాష్ట్రస్థాయి అధికారులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.!
బాధితుడి నుంచి వివరాలు తీసుకుంటున్న అనిశా సిబ్బంది
ఈ ఏడాదిలో తొలికేసు..
లంచంగా తీసుకున్న నగదుతో ఈఈ రామన్
లంచం తీసుకుంటూ నగరపాలక సంస్థ ఈఈ పట్టుబడిన సంఘటన మంగళవారం కరీంనగర్లో జరిగింది. అనిశా డీఎస్సీ భద్రయ్య తెలిపిన వివరాల మేరకు.. కరీంనగర్ కార్పొరేషన్లో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్గా పనిచేస్తున్న పీవీ రామన్ గుత్తేదారు మధుకర్ నుంచి రూ.17వేలు లంచంగా తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నామని డీఎస్పీ తెలిపారు. నగరపాలక సంస్థ పరిధిలోని బుట్టిరాజారాం కాలనీలో నిర్మించిన పార్క్, 17,18 డివిజన్లలో హరితహారం కింద తీసిన గుంతలకు సంబంధించిన బిల్లు, పూడిక తీసిన పనులకు రూ.17,20,546 వరకు బిల్లులు రావడంలో ఆలస్యమైందని.. సంబంధిత దస్త్రాలు ముందుకు కదిలించాలంటే తనకు మొత్తం పనుల్లో ఒక్క శాతం కమీషన్ ఇవ్వాలని ఈఈ డిమాండ్ చేశారని తెలిపారు. ఈఈతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం కార్యాలయం ఆవరణలో డబ్బుల్ని ఇస్తుండగా అనిశా పోలీసులు పట్టుకున్నారు. నగరంలోని ఓ పార్క్ అభివృద్ధితోపాటు హరితహారం గుంతలు, మురుగు కాలువలో పూడికతీతకు సంబంధించిన బిల్లులు గుత్తేదారుకు ఇప్పించడంతో జాప్యం వల్లనే బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడని డీఎస్పీ తెలిపారు.మరోవైపు పట్టుబడిన ఈఈ నివాసముంటున్న జగిత్యాల, హైదరాబాద్, కరీంనగర్లోనూ అనిశా అధికారులు సోదాలు నిర్వహించారు.
* కొత్త సంవత్సరంలో పట్టుబడిన కేసులలో కార్పొరేషన్ది మొదటిది. గతేడాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 10 మంది ప్రభుత్వ ఉద్యోగులు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. గతేడాది నవంబరు 30వ తేదీన రామగుండం నగరపాలక సంస్థ ఇన్ఛార్జి కమిషనర్గా ఉన్న పెద్దపల్లి ఆర్డీవో శంకర్కుమార్ కూడా ఇదే తరహాలో లక్ష రూపాయల్ని తీసుకుంటూ పట్టుబడ్డాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాకా.. వెంకటస్వామికి ఆ పేరెలా వచ్చింది?
[ 24-04-2024]
కాంగ్రెస్ పార్టీ దివంగత, కేంద్ర మాజీ మంత్రి జి.వెంకటస్వామి ‘కాకా’గానే ఎక్కువ మందికి సుపరిచితులు. ఆయనకు ఈ పేరు రావడం వెనుక ఆసక్తికర అంశం ఉంది. -
యాప్ కష్టాలు
[ 24-04-2024]
జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల నిర్వాహకులు అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన యాప్ల్లో సమాచారం నిక్షిప్తం చేయాల్సి ఉంది. -
నిర్వహణ భారం.. కమీషన్లో కోత
[ 24-04-2024]
కేంద్రాల నిర్వహణ భారంగా మారగా.. వచ్చిన కమీషన్లో కోత విధించడంతో నిర్వాహకులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి. -
ఇక ట్వంటీ20 పోరు!
[ 24-04-2024]
పోలింగ్ తేదీకి బుధవారం నుంచి సరిగ్గా ఇరవై రోజులుంది.. అచ్చంగా ట్వంటీ20 క్రికెట్ ఆటలోని 20 ఓవర్ల మాదిరి సమరం. -
మిగిలింది రెండు రోజులే!
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల్లో తొలి అంకం రెండు రోజుల్లో ముగియనుంది. ఈ నెల 25వ తేదీతో నామినేషన్ల స్వీకరణ పూర్తవనుంది. -
నకిలీ పత్రాలు సృష్టించి.. ఇల్లు ధ్వంసం
[ 24-04-2024]
నకిలీ పత్రాలు సృష్టించి, ఇంటిని ధ్వంసం చేసి, దాడికి పాల్పడిన అయిదుగురిని కరీంనగర్ కొత్తపల్లి పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు. -
పార్టీ పెద్దల సమ్మతితోనే రాజేందర్ నామినేషన్
[ 24-04-2024]
పార్టీ పెద్దల సమ్మతితోనే తామంతా కలిసి కాంగ్రెస్ తరఫున వెలిచాల రాజేందర్రావుతో నామినేషన్ వేయించామని, గెలిపిం చుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. -
అతివల ఉపాధికి ఆదరువేదీ!
[ 24-04-2024]
రాష్ట్రంలో 6 లక్షల మంది బీడీ కార్మికులుండగా అత్యధికంగా నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గ పరిధిలోనే ఉన్నారు. -
ఆ పది మందికే 50 శాతం ఓటర్ల మద్దతు
[ 24-04-2024]
ఎన్నికల్లో ప్రత్యర్థి కంటే ఒక్క ఓటు ఎక్కువ వచ్చినా విజయం సాధించినట్లే. అయితే గెలుపొందిన అభ్యర్థికి నియోజకవర్గంలోని ఎంత మంది ఓటర్ల మద్దతు ఉందనేది పోటీలో ఉన్న అభ్యర్థులు, నమోదైన పోలింగ్ శాతాన్ని బట్టి మారుతుంది. -
ఆయుధాలు అప్పగించారు..
[ 24-04-2024]
వ్యక్తిగత భద్రత కోసం లైసెన్సు తీసుకొని వెంట ఉంచుకున్న ఆయుధాలను ఉమ్మడి జిల్లావాసులు ఠాణాలకు అప్పగించారు. -
మాతాశిశుకు తప్పని ఉక్కపోత
[ 24-04-2024]
చంటి బిడ్డలు, బాలింతలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో వేసవి ఉక్కపోత తప్పడం లేదు. -
బ్యాలెట్ యుద్ధానికి చకచకా సన్నద్ధం
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికలను సమర్థంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. -
పనులకు ఆటంకాలు.. రాకపోకలకు అవస్థలు
[ 24-04-2024]
రెండు జిల్లాల సరిహద్దులోని మానేరు వాగు దాటడానికి ఇరువైపులా గ్రామాల ప్రజలు దశాబ్దాల తరబడి నానా అవస్థలు పడుతున్నారు. -
తైబజార్... చిరు వ్యాపారుల బేజార్
[ 24-04-2024]
పురపాలక సంఘంలో తైబజార్ గుత్తేదారు ఇష్టారాజ్యంగా డబ్బులు వసూలు చేస్తున్నా పట్టించుకున్న నాథుడు లేడు.
తాజా వార్తలు (Latest News)
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం
-
మూడోసారి అంతరిక్షంలోకి.. సిద్ధమవుతోన్న సునీతా విలియమ్స్
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్
-
గగనతలంలో ‘అమ్మ’కు సర్ప్రైజ్.. బుడతడి ఐడియా అదుర్స్
-
అవనిగడ్డలో వైకాపా ర్యాలీ.. బాణసంచా పడి తెదేపా కార్యకర్త ఇల్లు దగ్ధం
-
టేకాఫ్ సమయంలో ఊడిన బోయింగ్ విమానం టైరు