మృత్యు మలుపు
ద్విచక్రవాహనం అదుపుతప్పి ఇద్దరు యువకులు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డ సంఘటన నేరెల్ల పసులపాపన్న గుట్ట వద్ద మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. ఎస్ఐ కిరణ్ కుమార్, స్థానికుల వివరాల
అదుపుతప్పిన ద్విచక్రవాహనం
ఇద్దరు యువకుల మృతి
ధర్మపురి గ్రామీణం, న్యూస్టుడే : ద్విచక్రవాహనం అదుపుతప్పి ఇద్దరు యువకులు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డ సంఘటన నేరెల్ల పసులపాపన్న గుట్ట వద్ద మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. ఎస్ఐ కిరణ్ కుమార్, స్థానికుల వివరాల మేరకు.. ధర్మపురి మండలం కొరండ్లపల్లెకు చెందిన కంది హరీష్, బుద్దేశ్పల్లెకు చెందిన జనగామ రాజ్కుమార్, తిమ్మాపూర్ గ్రామానికి చెందిన లింగం సురేష్ ముగ్గురు ద్విచక్ర వాహనంపై నేరెల్ల వైపు నుంచి ధర్మపురి వైపు వెళ్తున్నారు. నేరెల్ల మూలమలుపులో ద్విచక్రవాహనం అదుపుతప్పి గుట్టను అతివేగంగా ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స కోసం ఆస్పత్రికి తరలించగా కంది హరీష్(27), జనగామ రాజ్కుమార్(26) మృతి చెందారు. తీవ్రంగా గాయపడ్డ లింగం సురేష్ను కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. హరీష్ ఎలక్ట్రిషియన్గా పనిచేసుకుంటూ ఉపాధి పొందుతున్నాడు. రెండేళ్ల క్రితమే వివాహమైంది. రాజ్కుమార్ పీజీ పూర్తిచేసి ఇటీవలే ఓ లారీని కొనుగోలు చేసి వ్యాపారం చేసే ప్రయత్నంలో ఉన్నాడు. 108 వాహనం ఆలస్యం కావడంతో ప్రమాద స్థలం వద్ద తీవ్రంగా గాయపడ్డ లింగం సురేష్ రోదనలు పలువురిని కలిచివేశాయి. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సురేష్ను, అచేతనావస్థలో పడి ఉన్న హరీష్ను ఓ ప్రైవేట్ వాహనంలో ఆస్పత్రికి తరలించారు. ప్రైవేట్ వాహనంలో నుంచి మార్గంమధ్యలో ఇద్దరిని 108 వాహనంలో ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.
ప్రమాదకరంగా పసులపాపన్న గుట్ట మూలమలుపు
తరచూ ప్రమాదాలే..
ధర్మపురి : పసులపాపన్న గుట్ట వద్ద మూలమలుపు ప్రమాదాలకు నిలయంగా మారింది. జాతీయ రహదారి ఇక్కడ ఇరుకుగా, కుడివైపు మూల మలుపు ప్రమాదకరంగా ఉంది. ఈ ప్రాంతంలోని రహదారిని మరింత వెడల్పు చేయడంతో పాటు, సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలు అమలు కాలేదు. అలాగే ఆకుసాయిపల్లె లోలెవల్ కాజ్వే వద్ద రహదారి ప్రమాదకరంగా ఉంటోంది. నెలకో ప్రమాదం జరిగి పలువురు మృత్యువాత పడుతున్నారు. లోలెవల్ కల్వర్టును తొలగించి హైలెవల్ వంతెన నిర్మించడానికి రూ.కోటి వ్యయంతో గతంలోనే జాతీయ రహదారి అధికారులు ప్రతిపాదించారు. నిధులు మంజూరు కాలేదు. ఈ మూలమలుపు వద్ద వేగంగా వస్తున్న వాహనాలు ఢీ కొట్టడంతోనే ప్రమాదాలు జరిగి, మృత్యువాత పడుతున్నారు. మూల మలుపును పూర్తిగా మార్చివేసేలా డిజైనింగ్ చేయాలని గతంలోనే ప్రతిపాదించారు. జాతీయ రహదారి అధికారులు దీనిపై దృష్టిపెట్టడం లేదు. పూర్తి స్థాయిలో ప్రమాదాలను నివారించాలని స్థానికులు కోరుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కరీంనగర్ కాంగ్రెస్ టికెట్ ఎవరి చేతికి?.. మల్లగుల్లాలు పడుతున్న అధిష్ఠానం
[ 29-03-2024]
కరీంనగర్ లోక్సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి ఖరారుపై ఆ పార్టీ అధిష్ఠానం మల్లగుల్లాలు పడుతోంది.. ఇప్పటికే భారాస, భాజపాల అభ్యర్థులు ఖరారవగా.. హస్తం పార్టీ తరఫున బరిలో నిలిచేదెవరో తెలియకపోవడంతో కాంగ్రెస్ స్థానిక నాయకులు, కార్యకర్తలు అభ్యర్థి తేలేదెప్పుడు.. అని ఆందోళన చెందుతున్నారు. -
కనుల పండువగా శివయ్య కల్యాణం
[ 29-03-2024]
ప్రసిద్ధ శైవక్షేత్రమైన వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరస్వామి క్షేత్రంలో గురువారం శివ కల్యాణోత్సవం కనుల పండువగా జరిగింది. -
ఆందోళన వద్దు.. అవకాశాలు కోకొల్లలు!
[ 29-03-2024]
విద్యార్థులు ప్రాథమిక విద్య నుంచి ఒక్కో మెట్టు ఎక్కుతూ పదో తరగతి పూర్తి చేశారు. ఒకట్రెండు రోజుల్లో పరీక్షలు కూడా పూర్తి చేసి ఉన్నతవిద్య వైపు అడుగులు వేయనున్నారు. -
అవసరాల మేరకు ఏదీ అనుసంధానం!
[ 29-03-2024]
ఈ రెండు అంశాల్లోనే కాదు. ప్రయాణికుల అవసరాలు తీర్చడంలో ద.మ.రై.అధికారులు ఆది నుంచీ నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు. రైల్వే ఉద్యోగుల అవసరాలు, అధికారులు, నాయకులు లాబీయింగులతోనే కొత్త హాల్టింగులు, ఇతర వసతులు కల్పిస్తున్నారు. -
కరీంనగర్ బస్స్టేషన్ ఆస్తి పన్ను రూ.1.88 కోట్లు చెల్లింపు
[ 29-03-2024]
ఆస్తిపన్ను బకాయిలపై 90 శాతం రాయితీ గడువు మూడు రోజుల్లో ముగుస్తుందని నగరపాలక కమిషనర్ బోనగిరి శ్రీనివాస్ తెలిపారు. -
భార్య చేతిలో భర్త హతం
[ 29-03-2024]
భర్త మద్యానికి బానిసై శారీరకంగా.. మానసికంగా వేధిస్తున్నాడని వేదనకు గురైన ఓ భార్య తనకు తెలిసిన ఇద్దరి సహాయంతో తాళ్లతో కట్టేసి.. కళ్లలో కారం చల్లి... ఒంటిపై వేడి నీళ్లు పోసి తీవ్రంగా కొట్టడంతో స్పృహ కోల్పోయి మృతి చెందాడు. -
లోక్సభ ఎన్నికలు ప్రజాస్వామ్యానికి పరీక్ష
[ 29-03-2024]
రానున్న లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో 15 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలవడం ఖాయమని శాసనమండలి సభ్యుడు, నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి టి.జీవన్రెడ్డి అన్నారు. -
వేసవి గట్టెక్కేనా!
[ 29-03-2024]
జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, రాయికల్ పట్టణాలకు డబ్బాలోని గ్రిడ్ ద్వారా మిషన్ భగీరథ పథకం నీరు సరఫరా అవుతోంది. ధర్మపురి పట్టణానికి డబ్బా నుంచి పైపులైన్లు వేసినా చివరి ప్రాంతం కావడంతో నీరు సరఫరా సక్రమంగా కావడం లేదు. -
మట్టి గుట్టలు మాయం!
[ 29-03-2024]
మండలంలోని వరద కాలువ మట్టిని కొందరు గుత్తేదార్లు, స్తిరాస్థి వ్యాపారులు అక్రమంగా తరలించుకుపోతుండటంతో మట్టికట్టలు మాయమవుతున్నాయి. -
నిధులు దూరం.. నిర్వహణ భారం
[ 29-03-2024]
వ్యవసాయ శాఖ సేవలను రైతులకు మరింత చేరువ చేసే లక్ష్యంతో గత ప్రభుత్వం క్లస్టర్ల వారీగా రైతు వేదికలను నిర్మించింది. శాఖాపరంగా రైతులకు ఆధునిక సాగు విధానంపై సలహాలు, సూచనలు ఇవ్వాలనేది ప్రధాన లక్ష్యం. -
లక్ష్యానికి చేరువగా సింగరేణి
[ 29-03-2024]
సింగరేణి సంస్థ తొలిసారిగా 70 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యానికి చేరువ అవుతోంది. మూడేళ్లుగా ఈ లక్ష్యాన్ని నిర్దేశించుకున్న సంస్థ ఇప్పటివరకు ఆ మేరకు బొగ్గు ఉత్పత్తిని చేరుకోలేకపోయింది. -
బయో మైనింగ్ ప్రక్రియకు అవాంతరాలు
[ 29-03-2024]
పెరుగుతున్న నగరీకరణ.. అందుకు అనుగుణంగా పారిశుద్ధ్య నిర్వహణ ప్రభుత్వ యంత్రాంగానికి సవాల్గా మారుతోంది. ఈ క్రమంలో చెత్త నుంచి సేంద్రియ ఎరువును తయారు చేసేందుకు రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. -
భాజపా పాలనపై ప్రజల్లో విసుగు
[ 29-03-2024]
రానున్న పార్లమెంటు ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్ అభ్యర్థులను ఓడించాలని భారాస ఎంపీ అభ్యర్థులు ఆర్.ఎస్.ప్రవీణ్కుమార్, కొప్పుల ఈశ్వర్లు అన్నారు. -
మతం పేరిట కేసీఆర్ రాజకీయం చేయలేదు: కేటీఆర్
[ 29-03-2024]
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పదేళ్లలో ఏ రోజు కూడా మతం పేరిట రాజకీయం చేయలేదని మాజీ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. -
రాష్ట్రాన్ని దోచుకుంది భారాసనే: ఆది శ్రీనివాస్
[ 29-03-2024]
తెలంగాణ ఏర్పడిన తరవాత రూ.16 వేల కోట్ల నిల్వ బడ్జెట్తో రాష్ట్రాన్ని అప్పగిస్తే భారాస తొమ్మిదిన్నరేళ్ల పాలనలో రాష్ట్రాన్ని రాబంధుల్లా దోచుకుందని, రూ.6.67 లక్షల కోట్ల అప్పుల భారాన్ని రాష్ట్ర ప్రజలపై మోపిందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మండిపడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
సీఎం రేవంత్రెడ్డితో ఎంపీ కె.కేశవరావు భేటీ
-
ఉత్తర్ప్రదేశ్లో హైఅలర్ట్.. గ్యాంగ్స్టర్ ముఖ్తార్ మృతిపై కుటుంబం అనుమానాలు!
-
కాంగ్రెస్కు మళ్లీ షాక్.. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు
-
విజయ్ దేవరకొండను పార్టీ అడిగిన రష్మిక.. ఎందుకంటే..?
-
ప్రధాని మోదీ, బిల్గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
-
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్