logo

చనిపోయిన వ్యక్తికి సెకండ్‌ డోస్‌ టీకా!

వైద్యాధికారులు బతికున్నవారికే కాదు...మృతి చెందిన వారికి సైతం కోవిడ్‌ టీకాలను వేసినట్లు  ఆశ్చర్యానికి గురిచేస్తున్నారు. కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌ మండలం పోరండ్ల గ్రామానికి

Published : 19 Jan 2022 02:22 IST

తిమ్మాపూర్‌,న్యూస్‌టుడే: వైద్యాధికారులు బతికున్నవారికే కాదు...మృతి చెందిన వారికి సైతం కోవిడ్‌ టీకాలను వేసినట్లు  ఆశ్చర్యానికి గురిచేస్తున్నారు. కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌ మండలం పోరండ్ల గ్రామానికి చెందిన కె.లింగయ్య రెండు నెలల  కిందట అనారోగ్యంతో మృతి చెందాడు. లింగయ్యకు కోవిషీల్డ్‌ సెకండ్‌ డోస్‌ టీకా వేసినట్లు అతని కుమారుడి చరవాణికి సోమవారం మధ్యాహ్నం  సందేశం వచ్చింది.  దీంతో కుటుంబ సభ్యులు కంగుతిన్నారు. సాంకేతిక లోపం వలన సందేశం వచ్చి ఉండవచ్చని వైద్యాధికారి సమాధానమిచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని