గుండెపోటుతో అసిస్టెంట్ ప్రొఫెసర్ మృతి
తెవివి దక్షిణ ప్రాంగణం సోషల్ వర్క్ విభాగంలో అసిస్టెంట్ ఫ్రొఫెసర్(కాంట్రాక్ట్)గా విధులు నిర్వహిస్తున్న వీరబత్తిని లక్ష్మణ్(59) గుండెపోటుతో మృతిచెందారు.
లక్ష్మణ్
భిక్కనూరు(కామారెడ్డి కలెక్టరేట్), న్యూస్టుడే: తెవివి దక్షిణ ప్రాంగణం సోషల్ వర్క్ విభాగంలో అసిస్టెంట్ ఫ్రొఫెసర్(కాంట్రాక్ట్)గా విధులు నిర్వహిస్తున్న వీరబత్తిని లక్ష్మణ్(59) గుండెపోటుతో మృతిచెందారు. ఆయన పెద్దనాన్న కుమారుడు అయిదు రోజుల క్రితం మృతిచెందగా అంత్యక్రియల్లో పాల్గొనడానికి సోమవారం కామారెడ్డి నుంచి చేర్యాలకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో జనగామ బస్సెక్కి సిద్దిపేటకు బయలుదేరారు. సీట్లో కూర్చున్న కాసేపటికి నిద్రపోయారు. బస్సు సిద్దిపేటకు చేరుకుని తిరిగి చేర్యాలకు బయలుదేరినా లేవలేదు. సిద్దిపేట కలెక్టరేట్ వద్ద కండక్టర్ టికెట్ అడిగేందుకు తట్టిచూడగా కింద పడిపోయారు. నిద్రలోనే గుండెపోటుతో చనిపోయారు. మంగళవారం ఆయన స్వగ్రామం చేర్యాలలో అంత్యక్రియలు నిర్వహించారు. లక్ష్మణ్కు భార్య, కుమారుడు ఉన్నారు. దక్షిణ ప్రాంగణంలో పదేళ్లపాటు పని చేసిన ఆయన తన 55వ ఏట పీహెచ్డీ పట్టా అందుకున్నారు. లక్ష్మణ్ మృతిపట్ల వీసీ రవీందర్గుప్తా సంతాపం వ్యక్తం చేశారు.
బాలుడిపై లైంగిక దాడి, హత్య కేసులో ఒకరికి జీవిత ఖైదు
నిజామాబాద్ న్యాయవిభాగం, బీబీపేట, న్యూస్టుడే: బాలుడిపై లైంగిక దాడికి పాల్పడి హత్య చేసిన కేసులో కామారెడ్డి జిల్లా బీబీపేటకు చెందిన విభూతి సాయిలు(22)కు జీవిత ఖైదు, రూ.వెయ్యి జరిమానా విధిస్తూ రెండో అదనపు కోర్టు జిల్లా జడ్జి పంచాక్షరి మంగళవారం తీర్పునిచ్చారు. వివరాల్లోకి వెళ్తే.. 2020 ఆగస్టు 7న సాయిలు మండల కేంద్రానికి చెందిన ఓ బాలుడికి(10) డబ్బులు ఇస్తానని మాయమాటలు చెప్పి ఊరి శివారులోని బల్లనికుంటకు తీసుకెళ్లాడు. అక్కడ లైంగికదాడికి పాల్పడిన తర్వాత హత్య చేసి కుంటలో పడేశాడు. బాలుడి తల్లి ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేపట్టగా నిందితుడు నేరం ఒప్పుకొన్నాడు. సాక్ష్యాధారాలు పరిశీలించిన న్యాయమూర్తి ఈ మేరకు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. పోలీసుల తరఫున రెండో అదనపు కోర్టు ఇన్ఛార్జి పిపి రవిరాజ్ వాదించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు
[ 23-04-2024]
మడలంలోని అన్ని గ్రామాల్లో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. -
రేపటి నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు
[ 23-04-2024]
జిల్లాలో రేపటి నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటిస్తున్నట్లు డీఈఓ రాజు ఓ ప్రకటనలో తెలిపారు. -
ప్రజాస్వామ్యంలో ఓటే వజ్రాయుధం
[ 23-04-2024]
ప్రజాస్వామ్యంలో ఓటే వజ్రాయుధమని కలెక్టర్ జితేష్ పాటిల్ అన్నారు. -
భారీ మెజార్టీతో గెలిపించాలి
[ 23-04-2024]
ధర్మారెడ్డి గ్రామంలో ఉపాధి హామీ కూలీల వద్దకు వెళ్లి స్థానిక కాంగ్రెస్ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
మన పార్లమెంటు మహోన్నతం
[ 23-04-2024]
దేశమంతా సార్వత్రిక ఎన్నికల సంగ్రామంతో హోరెత్తుతోంది. ప్రధాన పార్టీలన్నీ ప్రచారంలో మునిగి తేలుతున్నాయి. ఫలితమెలా ఉంటుందని ఉత్కంఠగా ఎదురుచూస్తోంది -
పద..పార్టీ మారుదాం !
[ 23-04-2024]
రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్టీల క్యాడర్ స్వరూపం మారిపోతోంది. ద్వితీయ శ్రేణి నాయకులతో పాటు కిందిస్థాయి క్రీయాశీలక కార్యకర్తల వరకు ఒక్కొక్కరు తమకు అనుకూలంగా ఉండే పార్టీల వైపు క్యూ కడుతున్నారు. -
ఓటరే లక్ష్యం.. అస్త్రాలు సిద్ధం
[ 23-04-2024]
పార్లమెంటు ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ప్రారంభంకావడంతో ఉమ్మడి జిల్లాలో రాజకీయం వేడెక్కింది. నిజామాబాద్, జహీరాబాద్ లోక్సభ స్థానాల్లో ప్రధాన పార్టీల నుంచి బరిలో ఉండే అభ్యర్థులు ప్రచారం చేస్తున్నారు -
12 లో ఫెయిల్ జీవితంలో గెలుపు
[ 23-04-2024]
పది, ఇంటర్, డిగ్రీ పరీక్షల్లో ఉత్తీర్ణతే మైలురాయి కాదు. విద్యాలయాలకు వెళ్లకపోయినా దూర విద్యలోనూ డిగ్రీలు సాధించి ఉన్నత స్థానాల్లో స్థిరపడినవారున్నారు. పరిమిత వనరుల్లోనూ ప్రణాళికాబద్ధంగా చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించిన వారున్నారు. వారిని స్ఫూర్తిగా తీసుకోవాలి -
పోరు.. ఇక హోరు
[ 23-04-2024]
జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో ప్రధాన పార్టీల అగ్రనేతల ప్రచారానికి రంగం సిద్ధమైంది. కాంగ్రెస్, భారాస, భాజపాలు ఇప్పటికే నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మండల, నియోజకవర్గ స్థాయి సమావేశాలు నిర్వహించి కార్యకర్తలకు దిశానిర్దేశం చేశాయి -
సెప్టెంబరులో చక్కెర కర్మాగారాలు తెరిపిస్తాం
[ 23-04-2024]
శాసనసభ ఎన్నికల సందర్భంలో ఇచ్చిన హామీ మేరకు నిజాం చక్కెర కర్మాగారాలు తెరిపించేందుకు అవసరమైన చర్యలు చేపట్టినట్లు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు. -
ఓటరు తీర్పు విభిన్నం..
[ 23-04-2024]
కామారెడ్డి జిల్లా ప్రజలకు జహీరాబాద్, మెదక్ లోక్సభ స్థానాలతో అనుబంధం ఉంది. ఇక్కడి ఓటర్లు విభిన్నమైన తీర్పులు ఇచ్చారు. -
వీడని వాన
[ 23-04-2024]
ఉమ్మడి జిల్లాను అకాల వర్షాలు వీడటం లేదు. ఉపరితల ద్రోణి ప్రభావంతో వరుసగా కురుస్తున్న వానలు అన్నదాతలకు కునుకులేకుండా చేస్తున్నాయి. సోమవారం కూడా పలు ప్రాంతాల్లో భారీ ఈదురుగాలులతో వర్షం పడింది. -
బోధన్ - మహబూబ్నగర్ ప్యాసింజర్ రద్దు
[ 23-04-2024]
నిజామాబాద్ జిల్లా బోధన్ నుంచి మహబూబ్నగర్ మధ్య నడిచే రైలును మే 16 వరకు రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ఉత్తర్వు జారీ చేశారు -
2.30 లక్షల మె.ట.ధాన్యం కొనుగోలు
[ 23-04-2024]
జిల్లాలో ధాన్యం సేకరణ ప్రక్రియ కొనసాగుతోంది. ఐకేపీ, పీఏసీఎస్, మెప్మా ఆధ్వర్యంలో మొదట 480 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉండగా.. 411 కేంద్రాలు ప్రారంభించి ఇప్పటి వరకు 2.30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి.. రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచింది -
కాంగ్రెస్ శ్రేణుల్లో హుషారు
[ 23-04-2024]
నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో నిర్వహించిన తొలి ఎన్నికల సభకు భారీగా జనం తరలివచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సహా ఇతర నాయకులు తమ ప్రసంగాలతో పార్టీ కార్యకర్తల్లో ఉత్తేజం నింపారు
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: ఆర్టికల్ 370.. యామి గౌతమ్, ప్రియమణి నటించిన పొలిటికల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
మద్యం మత్తులో విమాన సిబ్బందిపై ప్రయాణికుడి దాడి
-
వరుసగా మూడో రోజూ లాభాల్లో ముగిసిన సూచీలు
-
‘చొరబాటుదారు’ వ్యాఖ్యలు.. మోదీపై ఫిర్యాదును పరిశీలిస్తున్నామన్న ఈసీ..!
-
వాట్సప్లో కొత్త ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా ఫొటోలు పంపించొచ్చు!
-
టీ20 వరల్డ్ కప్తో రీ ఎంట్రీ?.. తలుపులు మూసుకుపోయాయన్న సునీల్ నరైన్