TS News: రైలుకింద పడి జూనియర్ ఆర్టిస్టు మృతి
కదులుతున్న రైలు ఎక్కబోయి కింద పడిన మహిళ తీవ్రగాయాలకు గురై మరణించిన సంఘటన మంగళవారం షాద్నగర్ రైల్వేస్టేషన్లో చోటు చేసుకుంది. కడప జిల్లా కేంద్రంలోని సినిమా స్ట్రీట్కు చెందిన జ్యోతిరెడ్డి(28)
షాద్నగర్ పట్టణం, న్యూస్టుడే: కదులుతున్న రైలు ఎక్కబోయి కింద పడిన మహిళ తీవ్రగాయాలకు గురై మరణించిన సంఘటన మంగళవారం షాద్నగర్ రైల్వేస్టేషన్లో చోటు చేసుకుంది. కడప జిల్లా కేంద్రంలోని సినిమా స్ట్రీట్కు చెందిన జ్యోతిరెడ్డి(28) హైదరాబాద్లో హెచ్డీఎఫ్సీ బ్యాంకులో ఉద్యోగిగా, జూనియర్ ఆర్టిస్టుగా పనిచేస్తోంది. పండుగ నిమిత్తం సొంత ఊరికి వెళ్లిన ఆమె సోమవారం రాత్రి తిరుగు ప్రయాణం కాగా, మంగళవారం తెల్లవారుజామున రైలు షాద్నగర్లో ఆగింది. అయితే కాచిగూడ అని భావించి రైలు దిగిన ఆమె కాదని తెలుసుకుని తిరిగి ఎక్కేందుకు ప్రయత్నించింది. అప్పటికే రైలు కదులుతుండటంతో అదుపుతప్పి కిందపడి గాయపడింది. తరువాత చికిత్స పొందుతూ మృతి చెందింది. కాగా ఇది రైల్వేవారి నిర్లక్ష్యమంటూ జూనియర్ ఆర్టిస్టులు ఆసుపత్రి ముందు కొంతసేపు ఆందోళన చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
రంగనాథస్వామి దేవస్థాన ప్రధాన అర్చకుడు హఠాన్మరణం
-
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో..
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్