logo

భూమి ఖాళీ చేయమన్నారని రైతులపై కత్తులతో దాడి

కౌలుకు తీసుకున్న వ్యవసాయ భూమిని ఖాళీ చేయమని అడిగిన రైతులపై ఓ వ్యాపారి అనుచరులతో కలిసి కత్తులు, కొడవళ్లు, రాడ్లతో దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటన శంషాబాద్‌లో మంగళవారం చోటు చేసుకుంది. ఆర్జీఐఏ

Published : 19 Jan 2022 03:59 IST


చికిత్స పొందుతున్న రైతు

శంషాబాద్‌,న్యూస్‌టుడే: కౌలుకు తీసుకున్న వ్యవసాయ భూమిని ఖాళీ చేయమని అడిగిన రైతులపై ఓ వ్యాపారి అనుచరులతో కలిసి కత్తులు, కొడవళ్లు, రాడ్లతో దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటన శంషాబాద్‌లో మంగళవారం చోటు చేసుకుంది. ఆర్జీఐఏ పోలీసులు, బాధితులు తెలిపిన కథనం ప్రకారం.. శంషాబాద్‌కు చెందిన కె.శివానంద్‌రెడ్డి, కె.జయపాల్‌రెడ్డిలకు చారినగర్‌ సమీపంలో ఐదు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఈ భూమిని హైదరాబాద్‌, చాంద్రాయణగుట్టకు చెందిన సయ్యద్‌ బిన్‌ అహ్మద్‌ రెండేళ్ల కోసం కౌలుకు తీసుకొని కోళ్లు, మేకల వ్యాపారం చేస్తున్నాడు. గడువు తీరినా భూమిని ఖాళీ చేయలేదు.   ఈ క్రమంలో మంగళవారం శివానంద్‌రెడ్డి, జయపాల్‌రెడ్డి, ఏ.వెంకట్‌రెడ్డి, రాఘవేందర్‌రెడ్డి, సంక్రాంతి పండుగ కోసం వీరి ఇంటికి వచ్చిన బంధువులు విఠల్‌రెడ్డి (ఇబ్రహీంపట్నం) ఎ.జయపాల్‌రెడ్డి (సిద్ధాపూర్‌), శంషాబాద్‌కు చెందిన తాజ్‌బాబా మరో ఇద్దరు కలిసి వ్యవసాయ భూమి వద్దకు వెళ్లారు. వారిని చూసి ఆగ్రహంతో సయ్యద్‌ బిన్‌ అహ్మద్‌ తన అనుచరులు 10 మందితో కలిసి కత్తులు, కొడవళ్లు, రాడ్లతో విచక్షణ రహితంగా దాడి చేశారు. గాయపడిన తొమ్మిది మంది క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని