logo

గుడివాడలో క్యాసినోల నిర్వహణపై విచారణకు ఆదేశాలు

సంక్రాంతి సమయంలో కృష్ణా జిల్లా గుడివాడలో క్యాసినోలు నిర్వహించటంపై చర్యలు తీసుకోవాలని తెదేపా నేతలు ఇచ్చిన ఫిర్యాదుపై జిల్లా ఎస్పీ సిద్దార్థ్‌ కౌశల్

Published : 19 Jan 2022 13:41 IST

గుడివాడ: సంక్రాంతి సమయంలో కృష్ణా జిల్లా గుడివాడలో క్యాసినోలు నిర్వహించటంపై చర్యలు తీసుకోవాలని తెదేపా నేతలు ఇచ్చిన ఫిర్యాదుపై జిల్లా ఎస్పీ సిద్దార్థ్‌ కౌశల్ స్పందించారు. సంఘటనపై విచారణ చేపట్టాలని నూజివీడు డీఎస్పీ శ్రీనివాసులును ఆదేశించారు. దీంతో ప్రత్యేక బృందంతో నూజివీడు డీఎస్పీ విచారణ ప్రారంభించనున్నారు.

క్యాసినోల నిర్వహణపై స్థానిక పోలీసులు ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టారో పూర్తి వివరాలు సేకరించి ఆ నివేదికను ఎస్పీకి సమర్పించనున్నారు. గుడివాడను అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా చేస్తున్నారని.. పండగ ముసుగులో క్యాసినోలు నిర్వహించారని ఆరోపిస్తూ తెదేపా నేతలు వర్ల రామయ్య, కొల్లు రవీంద్ర, కొనకళ్ల నారాయణ, బోండా ఉమ, గద్దె రామ్మోహన్‌ తదితరులు ఎస్పీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని