Crime News: న్యాయానికి వస్తే వశం చేసుకున్నాడు
మల్కాజిగిరి, న్యూస్టుడే: పెళ్లయిన రెండేళ్లకే భర్తతో మనస్పర్థలు రావడంతో విడాకులు ఇప్పించాలని కోరుతూ వచ్చిన తనకు ఓ న్యాయవాది అన్యాయం చేశాడంటూ బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. మల్కాజిగిరి సీఐ జగదీశ్వరరావు కథనం ప్రకారం.. ఓ ప్రైవేటు ఉద్యోగిని (25) భర్తతో గొడవలయ్యాయి. విడాకులు తీసుకునేందుకు గత ఏడాది జూన్లో ఓ న్యాయవాదిని సంప్రదించింది. ఆమెను పలుమార్లు తన కార్యాలయానికి రప్పించుకున్న న్యాయవాది ఆమెతో చనువు పెంచుకున్నాడు. బాధితురాలు అద్దెకు ఇల్లు వెతుకుతోందని తెలుసుకున్న న్యాయవాది తాను నివసించే ప్రాంతంలోనే ఒక ఫ్లాట్ చూపించాడు. అందులో ఆమెకు తెలియకుండా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశాడు. బాధితురాలు దుస్తులు మార్చుకునే సమయంలో చిత్రీకరించి వాటిని చూపించి బాధితురాలిని వశం చేసుకున్నాడు. వేధింపులు ఎక్కువ చేయడంతో భరించలేక ఆమె మల్కాజిగిరి పోలీసులకు ఈనెల 13న ఫిర్యాదు చేసింది. ఏసీపీ ఆధ్వర్యంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.