ఆర్థిక స్వావలంబన.. ఉపాధి కల్పన
ఒకప్పుడు వంటింటికే పరిమితమైన మహిళలు ఇప్పుడు అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. తమ సామర్థ్యాన్ని నిరూపిస్తున్నారు ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు మహిళలు.
చిట్యాల, నల్గొండ టౌన్, న్యూస్టుడే
దుస్తుల డిజైన్ కటింగ్లో మహిళలకు సలహాలిస్తున్న పాపని వనజ
చెవులు వినిపిస్తే మాటలొస్తాయి!
ఈ చిత్రంలో కనిపిస్తున్న చిన్నారి పేరు ఎండీ హజ్రా. చిరుమర్తి గ్రామానికి చెందిన హైమత్పాషా, గౌస్యాభేగంల రెండో కుమార్తె. ప్రస్తుతం ఏడేళ్ల వయసున్న ఈ చిన్నారికి చిన్నప్పటి నుంచే చెవులు వినిపించవు, మాటలు రావు. తల్లిదండ్రులు ఆమె వైద్యం కోసం పలు ఆసుపత్రులకు తీసుకెళ్లారు. రూ.లక్షకు పైగా ఖర్చు చేశారు. అయినా ఫలితం లేదు. ఇక చేసేదేమి లేక గ్రామంలోనే ప్రభుత్వ పాఠశాలలో ఒకటో తరగతిలో చేర్పించారు. తల్లి తోడుగా పాఠశాలలో వదిలి వెళ్తుంది. మళ్లీ సాయంత్రం వచ్చి తీసుకెళ్తుంది. తండ్రి కూలి పనులు చేస్తుండగా.. తల్లి పూర్తిగా పిల్లల సంరక్షణలోనే ఉంటుంది. దివ్యాంగురాలి పింఛన్ కోసం ఏడాదిన్నర క్రితం దరఖాస్తు చేసినా మంజూరు కాలేదని తల్లిదండ్రులు వాపోతున్నారు. అయితే హజ్రాను వైద్యులకు చూపించినపుడు ఆమెకు చెవులు వినిపిస్తే మాటలు వచ్చే అవకాశం ఉందని చెప్పారని వారు చెబుతున్నారు. ఇందుకు అవసరమైన శస్త్రచికిత్సతోపాటు అత్యాధునిక వినికిడి పరికరాలు కొనుగోలు చేయాల్సి ఉంటుందని, ఇందుకు రూ.లక్షకు పైగా ఖర్చవుతుందని వైద్యులు తెలిపారని, ప్రభుత్వంగానీ, దాతలుగానీ ముందుకొచ్చి చిన్నారికి బంగారు భవిష్యత్తు కల్పించాలని వేడుకుంటున్నారు. - మాడ్గులపల్లి, న్యూస్టుడే
ఆసరా లేక అనాథ
ఆపన్నహస్తం కోసం ఎదురుచూపులు
విధి ఆడిన వింత నాటకంలో ఆ చిన్నారి బలిపశువుగా మారింది. అభం శుభం తెలియని చిన్నారికి పెద్ద కష్టం వచ్చి పడిండి. తను పుట్టగానే ప్రమాదం రూపంలో వచ్చి మృత్యువు తండ్రి రాములును బలితీసుకుంది. ఆమె వయస్సు ఆరు నెలలున్నప్పుడు అనారోగ్యంతో తల్లి బుజ్జిని కోల్పోయి అనాథగా మారింది. దీనికి తోడు పుట్టుకతోనే కుడి చేయి లేకపోవడం, ఆలనాపాలనా చూసే దిక్కులేక నానా అవస్థలు పడింది. ఈ దీనగాథ కోదాడ పట్టణ పరిధిలోని లక్ష్మీపురం కాలనీకి చెందిన సంపంగి అనూషది. అప్పటి నుంచి మేనమామ ఇంట్లో పెరిగింది. వారిది రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం కావడంతో కష్టపడుతూనే పెంచారు. చిన్నారికి ప్రస్తుతం పదేళ్లు. ఏమనుకుందో ఏమో మేనమామ కుటుంబానికి ఆసరాగా నిలిచేందుకు.. పట్టణంలో యాచిస్తోంది. వారు ఉంటున్న ఇళ్లు సైతం ఇబ్బందిగా మారింది. చిన్నపాటి వర్షం వచ్చినా కురుస్తుంది. బాలిక దుస్థితిని చూసి స్థానికులు జాలిపడుతున్నా సాయం అందించే వారు లేరు. ప్రభుత్వ అధికారులు కనీసం ఆమెకు దివ్యాంగ పింఛను మంజూరు చేయాలని కోరుతున్నారు. దాతలు ఆపన్నహస్తం అందిస్తే తోటి విద్యార్థుల మాదిరిగానే చదువుకుంటానని ఆశగా చెబుతోంది. దాయార్థుల సాయం కోసం దీనంగా వేడుకుంటుంది ఆ చిన్నారి. - కోదాడ పట్టణం, న్యూస్టుడే
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కసరత్తు షురూ..!
[ 27-04-2024]
నల్గొండ - ఖమ్మం - వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల కావడంతో.. ప్రధాన పార్టీలు లోక్సభ ఎన్నికలతో పాటూ ఈ ఎన్నిక గెలుపుపైనా దృష్టి సారించాయి. -
ఇంటింటికీ పోల్ చిట్టీలు..!
[ 27-04-2024]
ఓటు వేసేందుకు ఓటర్లు ఎటువంటి ఇబ్బందులకు గురి కాకుండా ఉండేందుకు ఎన్నికల సంఘం ఓటర్లందరికీ ప్రత్యేకంగా పోల్ చిట్టీలు పంపిణీ చేస్తోంది. -
పురంపై సైబర్ ఉచ్చు..!
[ 27-04-2024]
జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ రోడ్డులో రాకేశ్ అనే వ్యాపారికి ఈ నెల 21న సాయంత్రం సెల్ నంబరు 63054 68441 నుంచి ఫోన్ కాల్ వచ్చింది. -
మామిడీలా
[ 27-04-2024]
మామిడి.. భారతదేశపు పండుగా గుర్తింపు పొందింది. ప్రపంచ ఎగుమతుల్లోనూ అగ్రస్థానంలో ఉంది. ఇది నిన్నామొన్నటి మాట. -
ఆదరించండి.. అభివృద్ధి చేస్తాడు: రాజగోపాల్రెడ్డి
[ 27-04-2024]
రాబోయే నాలుగేళ్లలో డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పూర్తి చేసి మునుగోడు నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు సాగు నీరందించి సస్యశ్యామలం చేస్తానని భువనగిరి లోక్సభ కాంగ్రెస్ ఎన్నికల ఇన్ఛార్జి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు. -
పద తమ్ముడూ.. పార్టీ మారుదాం!
[ 27-04-2024]
అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాజకీయ పార్టీల క్యాడర్ స్వరూపం మారిపోతోంది. రాజకీయ సమీకరణాలూ శరవేగంగా మారుతున్నాయి. -
సమగ్ర సమాచార మార్గదర్శి
[ 27-04-2024]
ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ఎన్నికల సంఘం అనేక రకాల చర్యలు చేపడుతోంది. -
‘గుర్తు’ తెచ్చుకుందాం..రండి
[ 27-04-2024]
రాజకీయ పార్టీల ఉనికిని చాటేది వాటి గుర్తులే. గుర్తుల ఆధారంగానే ఆయా పార్టీలు ఎన్నికల ప్రచారం నిర్వహించడమే కాకుండా ఓటర్లు ఓటు వేస్తుంటారు. -
ప్రజల మనిషి ధర్మభిక్షం
[ 27-04-2024]
మునుగోడు మండలం ఊకొండిలో కల్లుగీత వృత్తి పని చేసుకునే ధర్మభిక్షం కుటుంబం సూర్యాపేటకు వలసవెళ్లి అక్కడే స్థిరపడింది. -
ఈతకెళ్లి తండ్రీతనయుల మృతి
[ 27-04-2024]
నీటి ప్రమాదాల నుంచి తప్పించుకునేలా తన ఇద్దరు కుమారులకు ఈత నేర్పాలని భావించిన ఆ తండ్రి. -
అవార్డుల ఉపాధ్యాయుడు ఆదె..!
[ 27-04-2024]
వృత్తిరీత్యా ఉపాధ్యాయుడిగా రెండు దశాబ్దాల నుంచి చిన్నారులకు విద్యాబోధన అందించటమే కాకుండా సమాజంలో విద్యాభివృద్ధికి తనవంతు తోడ్పాటు అందిస్తున్నారు ఆదె సత్యనారాయణ. -
వీడని మిస్టరీ..!
[ 27-04-2024]
ఈ నెల 18 నుంచి కనిపించకుండా పోయిన సూర్యాపేట మండలం యల్కారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు వడ్డె ఎల్లయ్య కేసు మిస్టరీ వీడటం లేదు. -
చివరికి మొగి పురుగు దాడి
[ 27-04-2024]
ఈ సీజన్లో ఎస్సారెస్పీ కాల్వల ద్వారా గోదావరి జలాలు ఆలస్యంగా విడుదల కావడంతో తుంగతుర్తి నియోజకవర్గంలో 40 శాతం వరి సాగు జనవరి మాసంలో చేపట్టారు. -
వేతనాలు రాక టీఏల ఇబ్బందులు
[ 27-04-2024]
గ్రామీణ ప్రాంతాల్లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలకు ఉపాధి పనులను చూపిస్తూ విధులు నిర్వహిస్తున్న సాంకేతిక సహాయకుల ( టెక్నికల్ అసిస్టెంట్లు)కు రెండు నెలలుగా వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. -
బరిలో..
[ 27-04-2024]
లోక్సభ ఎన్నికల నామినేషన్లలో భాగంగా శుక్రవారం జరిగిన నామపత్రాల పరిశీలన కార్యక్రమంలో నల్గొండ లోక్సభ పరిధిలో 25 మంది అభ్యర్థుల నామినేషన్లు సరిగా లేకపోవడంతో తిరస్కరించినట్లు అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు
-
వైకాపా ప్రభుత్వ విలేజీ క్లినిక్.. కాలేదు క్లిక్
-
రెండు కిలోమీటర్లకే రూ.9 వ్యత్యాసమా..!
-
ఇచ్చేది మెతుకంత.. చిందరవందరే బతుకంతా!!
-
క్రీడలపై గ‘లీజు’ పెత్తనం.. జగన్ జమానాలో అంతా వ్యాపారమే