logo

మరణించి ఎనిమిది మందికి ఊపిరిపోసింది

ఓ మహిళ మరణించి ఎనిమిది మందికి అవయవ దానం చేసిన ఘటన చిట్యాల మండలంలోని వెలిమినేడులో ఆదివారం చోటు చేసుకుంది... ఆ గ్రామానికి చెందిన అశ్విని(25), రెండు ఏళ్ల క్రితం శ్రీనుతో వివాహం చేశారు.

Updated : 06 Dec 2021 14:05 IST


అశ్విని

చిట్యాల గ్రామీణం, న్యూస్‌టుడే: ఓ మహిళ మరణించి ఎనిమిది మందికి అవయవ దానం చేసిన ఘటన చిట్యాల మండలంలోని వెలిమినేడులో ఆదివారం చోటు చేసుకుంది... ఆ గ్రామానికి చెందిన అశ్విని(25), రెండు ఏళ్ల క్రితం శ్రీనుతో వివాహం చేశారు. ఈ క్రమంలో మూడు రోజుల క్రితం వలిగొండ మండలంలోని వేములకొండకు పాపకు తలనీలాలు తీసేందుకు భర్తతో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్లింది. ఆ వాహనం ప్రమాదవశాత్తు కింద పడింది. ఆమె తలకు తీవ్ర గాయాలవడంతో మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ బ్రెయిన్‌ డెడ్‌ కావడంతో మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. కుటుంబ సభ్యుల అంగీకారం మేరకు ఆమె అవయవాలను వైద్యులు సేకరించి ఎనిమిది మందికి అమర్చారు. మృతురాలు అంత్యక్రియలను వెలిమినేడులో నిర్వహించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని