అంధత్వాన్ని అధిగమిస్తూ.. ఆటల్లో రాణిస్తూ
పేద కుటుంబంలో అంధత్వంతో పుట్టినా ఎలాంటి చింతన చేయకుండా వివిధ పోటీల్లో రాష్ట్ర స్థాయిలో రాణిస్తూ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. అంధత్వాన్ని అధిగమిస్తూ...
నల్గొండ అంధుల పాఠశాల నుంచి రాష్ట్రపతిని కలిసిన బృందంలో నితిన్ (ఎడమ నుంచి మొదటి వ్యక్తి)
హుజూర్నగర్ గ్రామీణం, న్యూస్టుడే: పేద కుటుంబంలో అంధత్వంతో పుట్టినా ఎలాంటి చింతన చేయకుండా వివిధ పోటీల్లో రాష్ట్ర స్థాయిలో రాణిస్తూ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. అంధత్వాన్ని అధిగమిస్తూ... అన్నింటిలో రాణిస్తూ.. ముందుకు సాగుతున్నాడు సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ పుర పరిధిలోని గోవిందపురం గ్రామానికి చెందిన అన్నబత్తులు కృష్ణమూర్తి, శోభ దంపతుల పెద్ద కుమారుడు నితిన్. ఆయన నల్గొండలోని స్కూల్ ఫర్ ద బ్లైండ్లో పదో తరగతి వరకు చదివారు. అనంతరం శంషాబాద్లో చిన్న జీయర్ స్వామి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నేత్ర విద్యాలయంలో ఇంటర్ చేరి అక్కడ వివిధ క్రీడల్లో మెళకువలు నేర్చుకొని చెస్, అథ్లెటిక్స్, కబడ్డీ, క్రికెట్లో రాణిస్తూ రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో ప్రతిభ కనబర్తున్నారు. ప్రస్తుతం బీకాం కంప్యూటర్స్లో ద్వితీయ సంవత్సరం చదువుతున్న నితిన్ మొదటి సంవత్సరం మొదటి సెమ్లో 96.4 శాతం మార్కులు సాధించి కళాశాల టాపర్గా నిలిచారు.
క్రీడల్లో ప్రతిభ ఇలా...
చెస్లో... * 2019లో అంధుల అండర్-18 విభాగంలో జాతీయ స్థాయి పోటీల్లో రెండో స్థానం సాధించారు.
* 2019లో ఓపెన్ చెస్ పోటీల్లో రాష్ట్ర స్థాయిలో బంగారు బహుమతి పొంది, దిల్లీలో జరిగిన జాతీయ పోటీలకు ఎంపికై అక్కడ ఐదో స్థానంలో నిలిచారు.
అథ్లెటిక్స్లో... * 2019లో రాష్ట్ర స్థాయి పోటీలలో 100 మీటర్ల పరుగు పందెంలో బంగారు బహుమతి.
* 2020లో జయశంకర్ భైపాల్పల్లిలో జరిగిన రాష్ట్ర స్థాయి పారా ఒలంపిక్స్లో 100 మీటర్ల పరుగు పందెం, షాట్ఫుట్, డిస్కస్త్రోల్లో బంగారు పతకం. దీంతో బెంగుళూరులో జరిగిన జాతీయ పారా ఒలంపిక్స్ పోటీల్లో పాల్గొని షాట్ పుట్, 100 మీటర్ల పరుగు పందెంలో నాల్గో స్థానంలో నిలిచారు.
* కబడ్డీలో... 2020లో దిల్లీలో జరిగిన జాతీయ అంధుల కబడ్డీ పోటీలలో రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించారు.
క్రికెట్లో...
అంధుల క్రికెట్ల్లో పలు మార్లు రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని సత్తాచాటి దిల్లీలో నవంబరు 17 నుంచి 24 వరకు జరిగిన జాతీయ క్రికెట్ పోటీల్లో పాల్గొన్నారు.
* 2019, 2020 రిపబ్లిక్ డే సందర్భంగా గవర్నర్ ఎదుట ఎన్సీసీ తరుపున పెరేడ్లో పాల్గొన్నారు.
గ్రూప్-2 స్థాయి ఉద్యోగం సాధించటమే ఆశయం
అంధుల చెస్ పోటీల్లో పొందిన బహుమతితో నితిన్
ప్రభుత్వం సహకరించి శిక్షణ ఇస్తే అంతర్జాతీయ పోటీల్లో రాణిస్తా. డిగ్రీ పూర్తి అయిన తరువాత గ్రూప్-2 పరీక్షలకు సంసిద్ధ ఆ స్థాయి ఉద్యోగం సాధించేలానే లక్ష్యంతో ఉన్నా. వైకల్యాలను అధిగమించి ఉన్నత స్థాయికి చేరుకునేందుకు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నల్గొండలో 4... భువనగిరిలో 5
[ 20-04-2024]
లోక్సభ ఎన్నికల నామినేషన్ల స్వీకరణలో రెండో రోజైన శుక్రవారం నల్గొండ లోక్సభ పరిధిలో నలుగురు అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేశారు. -
పండుటాకులకు ఇంటివద్దే ఓటు
[ 20-04-2024]
రాబోయే లోక్సభ ఎన్నికల్లో ఓటర్లందరూ తమ హక్కు వినియోగించుకునేలా చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం భావించింది.ఇందుకోసం పలు చర్యలు చేపట్టింది. -
యథేచ్ఛగా మట్టి దందా
[ 20-04-2024]
నార్కట్పల్లి మండలంలో మట్టి దందా యథేచ్ఛగా సాగుతోంది. గోపలాయపల్లి, యల్లారెడ్డిగూడెంలోని చెరువులు, బ్రాహ్మణవెల్లంల ప్రాజెక్ట్ కాల్వల మట్టిని అక్రమంగా ఇటుక బట్టీలకు, వెంచర్లకు తరలిస్తున్నారు. -
ఇక కఠిన చర్యలు
[ 20-04-2024]
సీఎంఆర్ బియ్యం బకాయిదారులపై కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర అత్యున్నత స్థాయిలో శుక్రవారం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. -
పదమూడేళ్లుగా.. అభ్యున్నతే లక్ష్యంగా..!
[ 20-04-2024]
ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా పదమూడేళ్లుగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థుల అభ్యున్నతికి, చదువుల్లో ఉన్నత స్థాయికి ఎదిగేందుకు పాలిటెక్నిక్లో ప్రవేశానికి నిర్వహించే పాలిసెట్లో ఉచిత శిక్షణ అందిస్తుంది ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ సమితి. -
పార్టీ గుర్తు కావాలంటే బీ ఫారం ఉండాల్సిందే..
[ 20-04-2024]
లోక్సభ, శాసనసభ, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నిక ఏదైనా సరే...రాజకీయ పార్టీ అభ్యర్థిగా గుర్తించి అతనికి ఆయా పార్టీలకు ఎన్నికల సంఘం నిర్ణయించిన గుర్తులను ఎన్నికల అధికారి కేటాయించాలంటే ‘బీ’ ఫారం ఉండాల్సిందే. -
ఎంపీలుగా ఎవరెవరంటే..
[ 20-04-2024]
లోక్సభకు ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి మహామహులు ప్రాతినిథ్యం వహించారు. వారు ప్రాతినిథ్యం వహించిన పార్టీతో పాటు వారు నిర్వహించిన ప్రజా ఉద్యమాలు, సచ్ఛీలత, వ్యక్తిగత పలుకుబడి తోడు కావడంతో ఎన్నికల బరిలో విజయబావుటా ఎగురవేశారు. -
ఏదీ నిఘా..!
[ 20-04-2024]
లోక్సభ ఎన్నికలు.. ఏపీలో అసెంబ్లీ ఎన్నికల వేళ ఉభయ తెలుగు రాష్ట్రాల సరిహద్దుగా ఉన్న కృష్ణానది తీరంలో మరింత నిఘా పెడితేనే అక్రమాలకు అడ్డుకట్ట పడనుంది. -
ఈవీఎం, వీవీప్యాట్లకు తేడా ఇదే!
[ 20-04-2024]
ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ (ఈవీఎం)లోని ఒక భాగమే ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్ (వీవీప్యాట్). అభ్యర్థి పేరు, గుర్తు, సీరియల్ నంబర్ దీనిపై కనిపిస్తాయి. -
వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడి అరెస్ట్
[ 20-04-2024]
జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల్లో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న దొంగను అదుపులోకి తీసుకున్నట్లు నల్గొండ జిల్లా మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు తెలిపారు. -
చిన్నప్పుడు కథలు చెబితేనే నిద్రవచ్చేది
[ 20-04-2024]
మా ఊరు మోత్కూరు మండలం పాలడుగు గ్రామం. ప్రాథమిక విద్య ఇక్కడే చదువుకున్నాను. -
లోక్సభ ఎన్నికల తర్వాత భారాస అడ్రస్ గల్లంతు: ఉత్తమ్
[ 20-04-2024]
లోక్సభ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా భారాస ఒక్క స్థానంలోనూ విజయం సాధించలేదని, డిపాజిట్లు కూడా దక్కవని రాష్ట్ర పౌర సరఫరా, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. -
పల్లె చెరువుల్లో మట్టి లూటీ..!
[ 20-04-2024]
పంట పొలాలకు సాగునీరందించే చెరువుల మట్టి వ్యాపారుల జేబులు నింపుతోంది. ముఖ్యంగా ఇటుక బట్టీల నిర్వాహకులు వివిధ గ్రామాల్లో కొన్నేళ్లుగా ఓ విధానమంటూ లేకుండా చెరువు మట్టిని పొక్లెయిన్లతో తవ్వి ట్రాక్టర్లలో తరలించి ఇటుకల తయారీకి వాడుతున్నారు. -
భాజపాను ఓడించేందుకు ఏకం కావాలి
[ 20-04-2024]
తెలంగాణలోని 17 లోక్సభ స్థానాల్లో అత్యధికంగా గెలవాలని ఉవ్విళ్లూరుతున్న భాజపా ఆశలను వమ్ము చేయడమే తమ ముందున్న లక్ష్యమని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
-
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి
-
స్కూల్లో హెచ్ఎంకు ఫేషియల్ వీడియో తీసిన టీచరుపై దాడి
-
సైబర్ యుద్ధాలను ఎదుర్కొనేందుకు చైనా సైన్యంలో కొత్త విభాగం
-
MS Dhoni: ధోని.. ఇంకా నాటౌటే
-
వైకాపా పాలనలో చంద్రబాబుపై 22 కేసులు