పట్టు దొరక్క.. గిట్టుబాటు కాక..
తళతళలాడే పట్టు చీరలు నేసే మగ్గాలపై నేత పని నిలిచిపోతోంది. నేతన్నలు ఉపాధి కోల్పోతున్నారు. చీరల తయారీకి ఉపయోగించే మల్బరీ పట్టు గూళ్ల ధర రెట్టింపైంది.
ఉపాధి కోల్పోతున్న నేతన్నలు
పట్టుగూళ్ల నుంచి పట్టుదారం ఉత్పత్తి
చౌటుప్పల్, చండూరు, న్యూస్టుడే: తళతళలాడే పట్టు చీరలు నేసే మగ్గాలపై నేత పని నిలిచిపోతోంది. నేతన్నలు ఉపాధి కోల్పోతున్నారు. చీరల తయారీకి ఉపయోగించే మల్బరీ పట్టు గూళ్ల ధర రెట్టింపైంది. నేసిన చీరలకు గిట్టుబాటు ధర దక్కటం లేదు. యాదాద్రి భువనగిరి, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో సుమారు 5వేల పట్టు చీరలు నేసే మగ్గాలున్నాయి. వీటిపై ఆధారపడి 20 వేల కుటుంబాలు జీవిస్తున్నాయి.
అమాంతం పెరిగిన పట్టుదారం ధర
తెలంగాణలో పట్టుగూళ్ల మార్కెట్లు తిరుమలగిరి, జనగామలో ఉన్నాయి. రైతులు తాము పండించిన పట్టుగూళ్లను అక్కడ విక్రయిస్తుంటారు. సిల్క్ రీలింగ్, ట్విస్టింగ్ చేసే పరిశ్రమల నిర్వాహకులు ఈ మార్కెట్ల నుంచి పట్టుగూళ్లను కొంటారు. గతేడాది లాక్డౌన్ సమయంలో మార్కెట్లలో పట్టుగూళ్లు కిలోకు ధర రూ.180-200 పలికింది. కనీసం రూ.250- 300 ధర వస్తేనే సెరికల్చర్ చేసే రైతులకు గిట్టుబాటవుతుంది. సరైన ధర రావడం లేదని సగానికి పైగా రైతులు మల్బరీ సాగును మానుకున్నారు. మిగిలిన తోటలకు ఇటీవల వర్షాలకు నష్టం జరిగింది. పట్టుగూళ్ల ఉత్పత్తి తగ్గిపోయింది. మార్కెట్లో పట్టుగూళ్లకు కిలోకు ధర రూ.600కు పైగా పలుకుతోంది. దారం తయారీకి అవసరమైన పట్టుగూళ్ల ఉత్పత్తి తగ్గడంతో మహారాష్ట్ర మార్కెట్ నుంచి కొనాల్సి వస్తోంది. కర్ణాటక నుంచి ముడి పట్టుదారాన్ని తెచ్చుకుంటున్నారు. గతంలో చైనా నుంచి పట్టుదారం దిగుమతయ్యేది. అదీ నిలిచిపోయింది. పట్టుచీరల తయారీకి ఉపయోగించే పట్టుదారం ధర రెట్టింపైంది. యాదాద్రి భువనగిరి, నల్గొండ, సూర్యాపేట జిల్లాల చేనేతలకు సరిపడా పట్టుదారం ఉత్పత్తి కావాలంటే నెలకు 210 టన్నుల పట్టుగూళ్లు అవసరం. 15 వేల ఎకరాల్లో మల్బరీ సాగు చేయాలి.
మగ్గం నేయకపోతే పూట గడవదు
-బత్తుల చంద్రయ్య, చౌటుప్పల్
కరోనా మహమ్మారికి ముందు కిలో పట్టుదారం ధర రూ.3,500 ఉండేది. ఇప్పుడు రూ.5,300 అయ్యింది. ఏడు పట్టుచీరల తయారీకి కిలోన్నర నిలువు దారం, 3.7 కిలోల పేక దారం అవసరం. ప్రస్తుత ధర ప్రకారం పట్టుదారానికి రూ.27,340 అవుతుంది. కరోనాకు ముందు రూ.18,500 సరిపోయేది. పట్టుదారం ధర దాదాపు రెట్టింపైనా చీర ధర అంతే ఉంది. మగ్గం నేయకపోతే పూట గడవదు. నేస్తే కనీస కూలి రాని పరిస్థితి నెలకొంది.
మహారాష్ట్ర నుంచి పట్టుగూళ్లు తెస్తున్నా
-గంజి శ్రీహరి, పట్టుదారం ఉత్పత్తిదారు, చౌటుప్పల్
5వేల మగ్గాలపై పట్టుచీరలు నేస్తున్నారు. మగ్గానికి నెలకు ఆరు కిలోలు చొప్పున 30వేల కిలోల పట్టుదారం అవసరం. పట్టుగూళ్లను జనగామ, తిరుమలగిరి మార్కెట్ల నుంచి కొంటాం. అక్కడికి సగటున రోజుకు 1,000 నుంచి 1,500 కిలోల పట్టుగూళ్లను రైతులు అమ్మకానికి తెచ్చేవారు. కిలోకు రూ.250 నుంచి రూ.300 ధర చెల్లించి కొంటాం. ప్రస్తుతం 100 కిలోలూ మార్కెట్కు రావడం లేదు. ధర కిలోకు రూ.600 అయ్యింది. నా యూనిట్కు రోజుకు 400 కిలోల పట్టుగూళ్లు అవసరం. మహారాష్ట్ర, కర్ణాటకలోనూ ఉత్పత్తి తగ్గింది. ఆంధ్రప్రదేశ్లో సెరికల్చర్ నిలిచిపోయింది. మహారాష్ట్ర నుంచి పట్టుగూళ్లు రోజుకు 150 కిలోలు తెస్తున్నాం. కర్ణాటక నుంచి ముడి పట్టుదారం తెచ్చి ట్విస్టింగ్ చేస్తున్నాం. గతంలో రోజుకు 57 కిలోల పట్టుదారం ఉత్పత్తి చేసేవాళ్లం. ముడి సరుకు కొరతతో 20 కిలోలే ఉత్పత్తి అవుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రభుత్వంపై విమర్శ.. రైతులకు భరోసా
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సుయాత్ర చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దానిని ఉమ్మడి జిల్లా నుంచే ప్రారంభించడంతో.. భారాస నేతలు పెద్దఎత్తున ఏర్పాట్లు చేశారు. -
బాలికలు.. భళా
[ 25-04-2024]
విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. -
మోదీతో తెలంగాణకు తీరని అన్యాయం
[ 25-04-2024]
కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీ తెలంగాణకు తీరని అన్యాయం చేశారని నల్గొండ లోక్సభ ఇన్ఛార్జి, మంత్రి నల్లమాద ఉత్తమ్కుమార్రెడ్డి ఆరోపించారు. -
బాలికలదే హవా
[ 25-04-2024]
రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. -
ఉపాధి కూలీల సౌకర్యాలపై సమీక్ష
[ 25-04-2024]
పని ప్రదేశాలలో ఉపాధి కూలీలకు మౌలిక సౌకర్యాలు సమకూర్చాలని జిల్లా పరిషతు ముఖ్య కార్యనిర్వహణాధికారి శోభారాణి, ఆదనపు డీఆర్డీవో జి.సురేష్, సూచించారు. -
ప్రథమంలో 26.. ద్వితీయంలో 25
[ 25-04-2024]
ఇంటర్ పరీక్ష ఫలితాల్లో బాలికలు సత్తా చాటారు. 2022-23లో జిల్లా ఉత్తీర్ణత శాతం 57 ఉండగా, ప్రస్తుతం 54.50 శాతానికి పడిపోయింది. -
ఊపందుకున్న నామినేషన్ల పర్వం
[ 25-04-2024]
నల్గొండ, భువనగిరి లోక్సభ స్థానాలకు బుధవారం వరకు 45 మంది చొప్పున నామినేషన్లు వేశారు. -
గిరిజన గురుకులాల్లో 88.60శాతం ఉత్తీర్ణత
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషనల్ సొసైటీ ఆధ్వర్యంలో నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో కలిపి ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో 88.60శాతం ఫలితాలు -
మతోన్మాద భాజపాను ఓడించండి: సీపీఐ
[ 25-04-2024]
దేశంలో మతోన్మాదం పేరుతో రాజకీయాలు చేస్తున్న భాజపాను ఓడించి కాంగ్రెస్ అభ్యర్ధులను భారీ మెజార్టీతో గెలిపించాలని సీపీఐ జాతీయ సమితి సభ్యుడు పల్లా వెంకట్రెడ్డి పిలుపునిచ్చారు. -
విభజన హామీల అమలుకు కృషి
[ 25-04-2024]
భువనగిరి లోక్సభ ఎంపీగా తనను గెలిపిస్తే విభజన హామీలను అమలు చేసేందుకు, నిధులు రాబట్టేందుకు కృషి చేస్తానని భువనగిరి లోక్సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్కుమార్రెడ్డి అన్నారు. -
తొలి ఎన్నికలోనే అత్యధిక మెజారిటీ
[ 25-04-2024]
నల్గొండ లోక్సభ నియోజకవర్గం 1951లో ఏర్పడగా.. తొలి ఎన్నికలు 1952లో జరిగాయి. -
రైల్వే ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం, వ్యక్తి అరెస్ట్
[ 25-04-2024]
రైల్వేశాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానని 17 మంది బాధితుల నుంచి నగదు వసూలు చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్టు పోలీస్ ఇన్స్పెక్టర్ అశోక్రెడ్డి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
జగనన్న నవ్వులు.. జనాలకు చుక్కలు
-
కూలీ బిడ్డకు 993 మార్కులు
-
ఏ ముఖం పెట్టుకుని రాజధాని రైతులను సీఎం ఓట్లు అడుగుతారు
-
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?