తనిఖీలు చేస్తూ.. ఆదాయం పెంచుతూ
ఆర్టీసీ ఆదాయానికి ప్రైవేటు వాహనాలు భారీగా గండికొడుతున్నాయి. మోటార్ వెహికిల్ యాక్ట్ ప్రకారం ఆర్టీసీ బస్టాండు సమీపంలో సుమారు 2 కిలో మీటర్ల దూరం వరకు ప్రైవేటు వాహనాలపై నిషేధం ఉంటుంది.
కుడకుడరోడ్డు(సూర్యాపేట), న్యూస్టుడే: ఆర్టీసీ ఆదాయానికి ప్రైవేటు వాహనాలు భారీగా గండికొడుతున్నాయి. మోటార్ వెహికిల్ యాక్ట్ ప్రకారం ఆర్టీసీ బస్టాండు సమీపంలో సుమారు 2 కిలో మీటర్ల దూరం వరకు ప్రైవేటు వాహనాలపై నిషేధం ఉంటుంది. సంస్థను నష్టాల నుంచి గట్టెక్కించేందుకు ఆర్టీసీ సంస్థ ఎండీ సజ్జనార్ ఆదేశాల మేరకు నవంబరు 24 నుంచి జాతీయ రహదారిపై ఆర్టీసీ, ఆర్టీఏ, పోలీసులు సంయుక్తంగా ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నారు. బస్టాండు సమీపంలోకి ప్రైవేటు వాహనాలు రాకుండా.. ప్రయాణికులు ఆర్టీసీ బస్సులో ఎక్కించేందుకు ప్రతి రోజు నలుగురు ఉద్యోగులకు రెండు విడతల్లో బాధ్యతలు అప్పగించారు. బహిరంగంగా, బలవంతంగా ప్రయాణికులను తరలిస్తున్న ప్రైవేటు వాహనాలపై తనిఖీలు చేపడుతున్నారు. ఉపాధి పేరుతో కొంత మంది ప్రైవేటు వాహనాలను నడిపిస్తున్నట్లు చెబుతున్నా. ఈ ముసుగులో కొంత మంది బడా వ్యాపారులు వాహనాలకు డ్రైవర్లను నియమించుకొని ఆర్టీసీ ఆదాయాన్ని రూ.లక్షలు కొల్లగొడుతున్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో దశాబ్దాలుగా కొనసాగుతున్న అక్రమ వ్యాపారానికి అడ్డుకట్ట వేసి ఆర్టీసీ ఆదాయం పెరిగేలా అధికారులు చర్యలు చేపట్టారు. నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులపై చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటీకే 447 ప్రైవేటు వాహనాలను తనిఖీ చేసి.. అక్రమంగా రవాణా చేస్తున్న 26 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వాహనాల ధ్రువపత్రాలు లేని, శిక్షణ లేని 33 ప్రైవేటు వాహనాల ఛోదకులకు రూ.58,887/-లు అపరాధ రుసుము విధించారు.
కఠిన చర్యలు తీసుకుంటాం
- జి.కేశవులు, ఆర్టీసీ, డివిజన్ మేనేజర్, సూర్యాపేట
ఆర్టీసీ ఆదాయానికి గండి కొడుతున్న ప్రైవేటు వాహనాల యాజమాన్యంపై పోలీసు, ఆర్టీఏ శాఖ సహకారంతో కఠిన చర్యలు తీసుకుంటాం. ఆర్టీసీ సంస్థ ఎండీ సజ్జనార్ ఆదేశాల మేరకు జాతీయ రహదారిపై నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నాం. ఆర్టీఏ యాక్ట్ ప్రకారం ప్రైవేటు వాహనాలు బస్టాండ్కి 2 కిలో మీటర్ల దూరంలో ఉండాలి. నిబంధనలకు విరుద్ధంగా ప్రయాణికులను ఎక్కిస్తున్న ప్రైవేటు వాహనాలపై జరిమానా విధించే విధంగా చర్యలు తీసుకుంటున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆలేరులో కాంగ్రెస్ అభ్యర్థి ఎన్నికల ప్రచారం
[ 20-04-2024]
పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో శనివారం ఆలేరు నియోజకవర్గంలో భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యతో కలిసి ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. -
నల్గొండలో 4... భువనగిరిలో 5
[ 20-04-2024]
లోక్సభ ఎన్నికల నామినేషన్ల స్వీకరణలో రెండో రోజైన శుక్రవారం నల్గొండ లోక్సభ పరిధిలో నలుగురు అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేశారు. -
పండుటాకులకు ఇంటివద్దే ఓటు
[ 20-04-2024]
రాబోయే లోక్సభ ఎన్నికల్లో ఓటర్లందరూ తమ హక్కు వినియోగించుకునేలా చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం భావించింది.ఇందుకోసం పలు చర్యలు చేపట్టింది. -
యథేచ్ఛగా మట్టి దందా
[ 20-04-2024]
నార్కట్పల్లి మండలంలో మట్టి దందా యథేచ్ఛగా సాగుతోంది. గోపలాయపల్లి, యల్లారెడ్డిగూడెంలోని చెరువులు, బ్రాహ్మణవెల్లంల ప్రాజెక్ట్ కాల్వల మట్టిని అక్రమంగా ఇటుక బట్టీలకు, వెంచర్లకు తరలిస్తున్నారు. -
ఇక కఠిన చర్యలు
[ 20-04-2024]
సీఎంఆర్ బియ్యం బకాయిదారులపై కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర అత్యున్నత స్థాయిలో శుక్రవారం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. -
పదమూడేళ్లుగా.. అభ్యున్నతే లక్ష్యంగా..!
[ 20-04-2024]
ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా పదమూడేళ్లుగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థుల అభ్యున్నతికి, చదువుల్లో ఉన్నత స్థాయికి ఎదిగేందుకు పాలిటెక్నిక్లో ప్రవేశానికి నిర్వహించే పాలిసెట్లో ఉచిత శిక్షణ అందిస్తుంది ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ సమితి. -
పార్టీ గుర్తు కావాలంటే బీ ఫారం ఉండాల్సిందే..
[ 20-04-2024]
లోక్సభ, శాసనసభ, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నిక ఏదైనా సరే...రాజకీయ పార్టీ అభ్యర్థిగా గుర్తించి అతనికి ఆయా పార్టీలకు ఎన్నికల సంఘం నిర్ణయించిన గుర్తులను ఎన్నికల అధికారి కేటాయించాలంటే ‘బీ’ ఫారం ఉండాల్సిందే. -
ఎంపీలుగా ఎవరెవరంటే..
[ 20-04-2024]
లోక్సభకు ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి మహామహులు ప్రాతినిథ్యం వహించారు. వారు ప్రాతినిథ్యం వహించిన పార్టీతో పాటు వారు నిర్వహించిన ప్రజా ఉద్యమాలు, సచ్ఛీలత, వ్యక్తిగత పలుకుబడి తోడు కావడంతో ఎన్నికల బరిలో విజయబావుటా ఎగురవేశారు. -
ఏదీ నిఘా..!
[ 20-04-2024]
లోక్సభ ఎన్నికలు.. ఏపీలో అసెంబ్లీ ఎన్నికల వేళ ఉభయ తెలుగు రాష్ట్రాల సరిహద్దుగా ఉన్న కృష్ణానది తీరంలో మరింత నిఘా పెడితేనే అక్రమాలకు అడ్డుకట్ట పడనుంది. -
ఈవీఎం, వీవీప్యాట్లకు తేడా ఇదే!
[ 20-04-2024]
ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ (ఈవీఎం)లోని ఒక భాగమే ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్ (వీవీప్యాట్). అభ్యర్థి పేరు, గుర్తు, సీరియల్ నంబర్ దీనిపై కనిపిస్తాయి. -
వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడి అరెస్ట్
[ 20-04-2024]
జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల్లో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న దొంగను అదుపులోకి తీసుకున్నట్లు నల్గొండ జిల్లా మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు తెలిపారు. -
చిన్నప్పుడు కథలు చెబితేనే నిద్రవచ్చేది
[ 20-04-2024]
మా ఊరు మోత్కూరు మండలం పాలడుగు గ్రామం. ప్రాథమిక విద్య ఇక్కడే చదువుకున్నాను. -
లోక్సభ ఎన్నికల తర్వాత భారాస అడ్రస్ గల్లంతు: ఉత్తమ్
[ 20-04-2024]
లోక్సభ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా భారాస ఒక్క స్థానంలోనూ విజయం సాధించలేదని, డిపాజిట్లు కూడా దక్కవని రాష్ట్ర పౌర సరఫరా, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. -
పల్లె చెరువుల్లో మట్టి లూటీ..!
[ 20-04-2024]
పంట పొలాలకు సాగునీరందించే చెరువుల మట్టి వ్యాపారుల జేబులు నింపుతోంది. ముఖ్యంగా ఇటుక బట్టీల నిర్వాహకులు వివిధ గ్రామాల్లో కొన్నేళ్లుగా ఓ విధానమంటూ లేకుండా చెరువు మట్టిని పొక్లెయిన్లతో తవ్వి ట్రాక్టర్లలో తరలించి ఇటుకల తయారీకి వాడుతున్నారు. -
భాజపాను ఓడించేందుకు ఏకం కావాలి
[ 20-04-2024]
తెలంగాణలోని 17 లోక్సభ స్థానాల్లో అత్యధికంగా గెలవాలని ఉవ్విళ్లూరుతున్న భాజపా ఆశలను వమ్ము చేయడమే తమ ముందున్న లక్ష్యమని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
చిలుకూరు ఆలయంలో ‘వివాహ ప్రాప్తి’ రద్దు: ప్రధాన అర్చకులు రంగరాజన్
-
ఈ పోలింగ్ ఏజెంట్ ఇంటర్నెట్ సెన్సేషన్.. ఎవరీ ఈశా అరోడా..?
-
ఆ సినిమా నుంచి గుణపాఠం నేర్చుకున్నా: సోనాలి బింద్రే
-
దిల్లీ కోటలో తొలి మ్యాచ్.. హైదరాబాద్ దూకుడు కొనసాగేనా?
-
కేంద్ర ఎన్నికల సంఘానికి కనకమేడల మరో లేఖ
-
సైబర్ టవర్స్ వద్ద చంద్రబాబు జన్మదిన వేడుకలు