నెత్తురోడిన అడవి..!
దండకారణ్యం తుపాకీ తూటాలతో మరోసారి మారుమోగింది. పచ్చందాల అడవి నెత్తురొలికింది. బందూకుల మధ్య ప్రత్యక్ష పోరు కొనసాగింది. మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ములుగు జిల్లా
వెంకటాపురం మండలంలోని పామునూరు-జెల్ల ప్రాంతం ఈ ప్రదేశంలోనే ఎన్కౌంటర్ జరిగింది
దండకారణ్యం తుపాకీ తూటాలతో మరోసారి మారుమోగింది. పచ్చందాల అడవి నెత్తురొలికింది. బందూకుల మధ్య ప్రత్యక్ష పోరు కొనసాగింది. మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ములుగు జిల్లా వెంకటాపురం మండలం పామునూరు సమీప కర్రిగుట్ట-ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఊసూరు ఠాణా సరిహద్దుల్లో మంగళవారం ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. గ్రేహౌండ్స్ బలగాలకు చెందిన కానిస్టేబుల్కు తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటనతో మన్యం పల్లెల్లో వాతావరణం వేడెక్కింది.
ఈనాడు, డిజిటల్, జయశంకర్ భూపాలపల్లి, వెంకటాపురం, న్యూస్టుడే
కొనసాగుతున్న కూంబింగ్
జిల్లా సరిహద్దుల్లో పెద్ద ఘటన జరగడంతో ఏజెన్సీ ప్రాంతాలు భయంభయంగా గడుపుతున్నాయి. అడవుల్లో తప్పించుకున్న మావోయిస్టుల కోసం పోలీసు బలగాలు ఇంకా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. వాజేడు, మంగపేట, వెంకటాపురంలో వాహన తనిఖీలు నిర్వహించారు. అటవీమార్గం గుండా లేదా రోడ్డు మార్గం ద్వారా ఇతర ప్రాంతాలకు తరలివెళ్లే అవకాశం ఉండటంతో రహదారులపైనా పోలీసులు నిఘా పెట్టారు.
సంయుక్తంగా అడవుల్లోకి బలగాలు
ఛత్తీస్గఢ్ కీకారణ్యన్ని షెల్టర్ జోన్గా చేసుకుని మావోయిస్టులు తమ కార్యకలపాలు కొనసాగిస్తున్నారు. మావోయిస్టు రాష్ట్ర కమిటీ నాయకత్వంతో పాటు జేఎండబ్ల్యూపీ (జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్, పెద్దపల్లి), వెంకటాపురం-వాజేడు, ఏటూరునాగారం-మహదేవ్పూర్, గుండాల-నర్సంపేట, మహబూబాబాద్ ఏరియా కమిటీల దళాలు సంచరిస్తున్నట్లు ఎస్ఐబీ భావిస్తోంది. ఛత్తీస్గఢ్ పోలీసులతో కలిసి సంయుక్తంగా వ్యూహాలు పన్నినట్లు తెలుస్తోంది. దండకారణ్యంలో మావోయిస్టు దళం సంచరిస్తుందనే పక్కా సమాచారంతో గ్రేహౌండ్స్ బలగాలు మూడు రోజుల కిందటే సర్కిల్ పోలీసుల సహకారంతో సంయుక్తంగా అడవుల్లోకి చొచ్చుకెళ్లాయి. వెంకటాపురం మండల కేంద్రానికి సుమారు 10 నుంచి 12 కి.మీ దూరంలో ఉన్న కర్రిగుట్ట ప్రాంతంలో పాగా వేసి మావోయిస్టులపై ముప్పెటదాడి చేసినట్లు తెలుస్తోంది.
మూడు నెలల్లోనే మళ్లీ పేలిన తూటా
గతేడాది అక్టోబర్ 25న వాజేడు మండలం పెనుగోలుకు సమీపంలోని ఛత్తీస్గఢ్ అడవుల్లో గ్రేహౌండ్స్ బలగాలు పంజా విసిరాయి. ఈ ఘటనలో ఏరియా కమిటీ సభ్యుడితో సహ ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. మూడు నెలలు గడవక ముందే తాజాగా మావోయిస్టుల షెల్టర్జోన్లో మళ్లీ తూటాల శబ్దం వినిపించింది.
సంఘటనా స్థలంలో దొరికిన తుపాకులు
దొరికినట్లే దొరికి తప్పించుకున్నారు..!
దండకారణ్యంలో కీలక మావోయిస్టు నేత ముచ్చాకి ఉంగాల్ అలియాస్ సుధాకర్ కేంద్రంగా పోలీసులు అడుగులు వేస్తున్నారు. పక్కా సమాచారంతో జరిగిన ఈ ఎన్కౌంటర్లో సుధాకర్పై గురి పెట్టినా దొరికినట్లే దొరికి తప్పించుకున్నట్లు నిఘా వర్గాలు చెబుతున్నాయి ఆయన ప్రస్తుతం జేఎండబ్ల్యూపీ డివిజన్ కమిటీ దళ సభ్యుడిగా కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. తొలుత ఎన్కౌంటర్లో సుధాకర్ మృతి చెందినట్లు పోలీసులు భావించారు. ఈ క్రమంలో ప్రచార మాధ్యమాల్లోనూ విస్తృతంగా చక్కర్లు కొట్టింది. చివరికి ఘటన ప్రాంతం నుంచి తప్పించుకున్నట్లు భావిస్తున్నారు.
ఉదయం 6:00: ఎదురుకాల్పులు ప్రారంభం 8:00: సంఘటన వెలుగులోకి వచ్చింది 9:10: అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు 5:29 జిల్లా ఎస్పీ పేరుతో సంఘటనను ధ్రువీకరిస్తూ ప్రకటన విడుదల
ఆగమేఘాలపై హైదరాబాద్కు..
ఉదయం 11.50 గాయపడిన కానిస్టేబుల్ మధును వెంకటాపురం హెలిప్యాడ్ వద్ద హెలికాప్టర్లోకి ఎక్కించుకున్నారు.
12.32 హనుమకొండ సుబేదారి ఆర్ట్స్ కళాశాల మైదానానికి చేరుకుంది
12.45 హెలికాప్టర్ వద్దకు వైద్య సిబ్బంది చేరుకున్నారు.
12.50 నుంచి 1.40 వరకు: అంబులెన్స్లో చికిత్స అందించారు.
1.45 మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు బయలుదేరారు.
వరంగల్ పోలీసు కమిషనర్ డాక్టర్ తరుణ్జోషి పర్యవేక్షణలో సెంట్రల్జోన్ డీసీపీ కె.పుష్పారెడ్డి, పలువురు పోలీసు అధికారులు పర్యవేక్షించారు.
-వరంగల్క్రైం, న్యూస్టుడే
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జజ్జనకర.. జనజాతర
[ 25-04-2024]
కాజీపేట మండలం మడికొండలో ఏర్పాటు చేసిన ఓరుగల్లు జనజాతర బహిరంగ సభ విజయవంతమైంది. వరంగల్ లోక్సభ పరిధిలోని ఏడు సెగ్మెంట్ల నుంచి భారీగా జనసమీకరణ చేయడంతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. -
ప్రథమంలో 24 ద్వితీయంలో 26
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ వార్షిక ఫలితాల్లో వరంగల్ జిల్లా వెనుకబడింది. ప్రథమ సంవత్సరం ఫలితాల్లో రాష్ట్రంలో 24వ స్థానం, ద్వితీయ సంవత్సరంలో 26వ స్థానంలో నిలిచింది. -
హస్తం జోరు..
[ 25-04-2024]
హనుమకొండ జిల్లా పరిధిలోని కాజీపేట మండలం మడికొండలో నిర్వహించిన ఓరుగల్లు జనజాతర బహిరంగ సభ విజయవంతం కావడం కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. -
ఇంటర్ ఫలితాల్లో ములుగు వెలుగు
[ 25-04-2024]
రాష్ట్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో ములుగు జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలను వెనకకు నెట్టి ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో మొదటి స్థానంలో నిలిచింది. -
ఇంటర్ ఫలితాల్లో బాలికలదే హవా
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సర ఉత్తీర్ణతలో బాలికలదే పైచేయిగా నిలిచింది. బుధవారం ప్రకటించిన ఫలితాల్లో జిల్లాలో ప్రథమ సంవత్సరం 55.72 శాతంతో రాష్ట్రంలో 17వ స్థానం పొందింది. -
బాలికలదే పైచేయి
[ 25-04-2024]
ఇంటర్ బోర్డు అధికారులు బుధవారం విడుదల చేసిన ఇంటర్ ఫలితాల్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో బాలికలే పై చేయి సాధించారు. -
ఇంటర్ ఫలితాల్లో బాలికలదే పైచేయి
[ 25-04-2024]
ఇంటర్ పరీక్ష ఫలితాలు బుధవారం వెలువడిన నేపథ్యంలో జిల్లాలో ఉత్తీర్ణత శాతం గత విద్యా సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది వెనక్కి వెళ్లింది. -
21 నామపత్రాల దాఖలు
[ 25-04-2024]
వరంగల్ లోక్సభ స్థానానికి బుధవారం 19 మంది అభ్యర్థులు 21 నామపత్రాలను రిటర్నింగ్ అధికారి ప్రావీణ్యకు సమర్పించారు. భారాస పార్టీ అభ్యర్థి మారపల్లి సుధీర్కుమార్ తరఫున భారాస నాయకులు, -
ఆదర్శం.. గంగారం కస్తూర్బా విద్యాలయం
[ 25-04-2024]
మారుమూల ఏజెన్సీలోని కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల విద్యాలయం(కేజీబీవీ) విద్యార్థినులు ఇంటర్ ఫలితాల్లో వందశాతం ఫలితాలు సాధించి సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
దేశాల మధ్య డీఫ్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
-
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ