logo

ఆస్తి గొడవల్లో యువకుడి హత్య

ఆస్తి గొడవల కారణంగా యువకుడిని హతమార్చిన ఘటన మండలంలోని పదిపుట్లబైలు పంచాయతీ కొండకిందపల్లిలో సోమవారం రాత్రి జరిగింది. పాకాల సీఐ ఆశీర్వాదం కథనం మేరకు గ్రామానికి చెందిన ఆర్టీసీ డ్రైవర్‌ సురేంద్ర కుమారుడు కడపల రవికుమార్‌(32)కు... అతని

Published : 19 Jan 2022 05:51 IST


రవికుమార్‌ (పాతచిత్రం)

పదిపుట్లబైలు(పాకాల): ఆస్తి గొడవల కారణంగా యువకుడిని హతమార్చిన ఘటన మండలంలోని పదిపుట్లబైలు పంచాయతీ కొండకిందపల్లిలో సోమవారం రాత్రి జరిగింది. పాకాల సీఐ ఆశీర్వాదం కథనం మేరకు గ్రామానికి చెందిన ఆర్టీసీ డ్రైవర్‌ సురేంద్ర కుమారుడు కడపల రవికుమార్‌(32)కు... అతని పెదనాన్న క్రిష్ణయ్య కుటుంబంతో తరచూ గొడవలు జరుగుతుండేవి. ఆరునెలల కిందట గ్రామానికి చెందిన పెద్దలు ఇంటి వద్ద దారి సమస్యతో పాటు ఆస్తి తగాదాలు పరిష్కరించారు. మూడు రోజుల కిందట రవికుమార్‌ తన పొలం వద్ద జేసీబీతో గట్లు వేసుకోగా అప్పటి నుంచి పెద్దనాన్న కుటుంబ సభ్యులు దూషించడం ప్రారంభించారు. వీటిని పట్టించుకోకుండా రవికుమార్‌ సోమవారం రాత్రి పొలం నుంచి ఇంటికి వస్తున్న సమయంలో పెదనాన్న క్రిష్ణయ్య, పెద్దమ్మ ఆదిలక్ష్మి, వారి కుమారులు శ్రీనివాసులు, మల్లికార్జున బండరాయి, ఇటుకతో మోది తల పగులగొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం పీలేరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు పాకాల పోలీసులు మంగళవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని