logo

కుట్టుమిషన్‌ విక్రయించిన మామ హత్య

కుట్టుమిషన్‌లో తలెత్తిన వివాదం చివరికి ఓ వ్యక్తి ప్రాణం పోగోట్టుకోవల్సి వచ్చింది. మంగళవారంరాత్రి నగరంలోని వెంకటేశ్వరపురం భగత్‌సింగ్‌కాలనీలో మేనల్లుడు సొంత మామనే హత్య చేశాడు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మూడు జెండాల సెంటరుకు సమీపంలో

Published : 19 Jan 2022 05:44 IST


మృతదేహాన్ని పరిశీలిస్తున్న నవాబుపేట ఇన్‌స్పెక్టర్‌ సుబ్బారావు, ఎస్సై రమేశ్‌బాబు

నెల్లూరు(నేరవిభాగం), న్యూస్‌టుడే: కుట్టుమిషన్‌లో తలెత్తిన వివాదం చివరికి ఓ వ్యక్తి ప్రాణం పోగోట్టుకోవల్సి వచ్చింది. మంగళవారంరాత్రి నగరంలోని వెంకటేశ్వరపురం భగత్‌సింగ్‌కాలనీలో మేనల్లుడు సొంత మామనే హత్య చేశాడు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మూడు జెండాల సెంటరుకు సమీపంలో షేక్‌ ఖాసీం(39) తన తమ్ముడు మస్తాన్‌కు చెందిన ఇంట్లో నివాసం ఉంటున్నాడు. ఇతని భార్య విడిపోయి ఒంటరిగా నివాసం ఉంటున్నాడు. దీంతో మతిస్థిమితం కోల్పోయాడు. చిత్తుకాగితాలు ఏరుకోవడం, ఇళ్లబయట వస్తువులుంటే తీసుకెళ్లి విక్రయించి... తాగేవాడు. ఇతను ఉండే ఇంటికి సమీపంలోనే మేనల్లుడు ఖాజావలీ నివాసం ఉంటున్నారు. రెండు రోజుల క్రితం అల్లుడు ఇంట్లోని కుట్టుమిషన్‌ను తీసుకెళ్లి విక్రయించాడు. దీంతో ఖాజావలీ కర్రతో తలపై కొట్టడంతో ఖాసీం అక్కడికక్కడే ప్రాణాలొదిలాడు. సమాచారం అందుకున్న నవాబుపేట ఇన్‌స్పెక్టర్‌ టీవీ సుబ్బారావు, ఎస్సై రమేశ్‌బాబు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని