AP News: అమెరికాలో భారీ ప్యాకేజీతో విశాఖ యువతికి కొలువు
తొలి నుంచి సైన్సు పట్ల మక్కువ పెంచుకున్న రమ్యలేఖ ఇంటర్మీడియట్లో బైపీసీ గ్రూపులో చేరి... 98.5శాతం మార్కులతో ఉత్తీర్ణురాలయ్యారు. తర్వాత ఎంసెట్ రాసి 2,161 ర్యాంకు తెచ్చుకున్నారు. విజయవాడ సిద్ధార్థ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ సీటు...
పరిశోధనా రంగాన మెరుపు!!
న్యూస్టుడే, విశాఖపట్నం
ఇంటర్ బైపీసీలో మంచి మార్కులు.. ఎంసెట్లో ఉత్తమ ర్యాంకు వచ్చిన చాలా మంది ఎంబీబీఎస్ వైపు మొగ్గు చూపుతారు. కానీ, విశాఖ చెందిన మేడిద రమ్యలేఖ విభిన్నంగా ఆలోచించారు. అదే ఆమెకు ఇప్పుడు భారీ ప్యాకేజీతో కొలువును తెచ్చి పెట్టింది. రమ్య లేఖ విభిన్న ఆలోచన ఏమిటి.. ఆమె తన లక్ష్యాన్ని ఏవిధంగా చేరుకున్నారో... తెలుసుకుందాం..
తొలి నుంచి సైన్సు పట్ల మక్కువ పెంచుకున్న రమ్యలేఖ ఇంటర్మీడియట్లో బైపీసీ గ్రూపులో చేరి... 98.5శాతం మార్కులతో ఉత్తీర్ణురాలయ్యారు. తర్వాత ఎంసెట్ రాసి 2,161 ర్యాంకు తెచ్చుకున్నారు. విజయవాడ సిద్ధార్థ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ సీటు వచ్చినా వద్దనుకున్నారు. తిరుపతి ఎస్వీ పశువైద్య కళాశాలలో వెటర్నరీ సైన్స్ (పశువైద్యశాస్త్రం) కోర్సులో చేరారు. అందులో ప్రథమ స్థానంలో ఉత్తీర్ణులయ్యారు. తర్వాత 2018లో పశుసంవర్థక శాఖలో సహాయ వైద్యురాలిగా ఉద్యోగం వచ్చినా వదులుకున్నారు. తన లక్ష్యానికి అనుగుణంగా జంతుశాస్త్రంలో పీహెచ్డీ చేసి శాస్త్రవేత్తగా స్థిరపడాలన్న ఆలోచనతో వివిధ పోటీ పరీక్షలకు హాజరయ్యారు.
అదే ఆలోచనగా...
విశాఖకు చెందిన వ్యాపారవేత్త మేడిద మురళీకృష్ణ, రమ దంపతుల కుమార్తె రమ్యలేఖ బాల్యం నుంచి చదువులో చురుకైన విద్యార్థినిగా పేరు తెచ్చుకున్నారు. ఆశీలుమెట్ట సమీపంలోని ఓ స్కూలులో పదో తరగతి (సీబీఎస్ఈ) చదివారు. పదికి పది పాయింట్లు తెచ్చుకున్నారు.
* జీవన ప్రమాణాలు పెంచొచ్చు.: తనకు జంతువులన్నా, జంతుశాస్త్రం అన్నా తొలి నుంచి మక్కువ ఎక్కువని, ఈ కారణంగా జంతుశాస్త్రం ఆధారంగా పీహెచ్డీ పూర్తి చేశానని రమ్యలేఖ తెలిపారు. శాస్త్రవేత్త అయితే జంతువులు, మానవాళికి అవసరమైన ఔషధాలు కనిపెట్టవచ్చునని, తద్వారా జీవన ప్రమాణాల పెంపునకు దోహద పడవచ్చునన్నారు. తన ఉన్నతికి తల్లిదండ్రులు అండగా నిలిచారని, వివాహం అయ్యాక భర్త ప్రోత్సహించారని చెప్పారు. భర్త పి.ఆదర్స్ శాన్ఫ్రాన్సిస్కో నగరంలోని రాబిన్హుడ్ సంస్థలో కన్సల్టెంట్గా సేవలందిస్తున్నారన్నారు. వెటర్నరీ సైన్సెస్ కోర్సులు చేసిన వారికి మంచి ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయని పేర్కొన్నారు.
* ప్రతిభకు గుర్తింపు: యూనివర్సిటీ ఆఫ్ మిన్నెసోట (అమెరికా) నిర్వహించిన ఉపకారవేతన పరీక్షల్లో ఉత్తీర్ణులై ఎమ్మెస్సీ సీటు సాధించారు. స్కాలర్ షిప్పై సీటు రావడంతో ఎటువంటి ఖర్చు లేకుండానే మిన్నెసోట వర్సిటీలో చేరారు. ఆమె ప్రతిభను గుర్తించిన వర్సిటీ అధికారులు ఎమ్మెస్సీ బదులు పీహెచ్డీలో చేర్చుకున్నారు. 2018లో పీహెచ్డీలో చేరిన రమ్యలేఖ ఈ ఏడాది జనవరి 18న కోర్సు పూర్తి చేసి పట్టా అందుకున్నారు. వెంటనే శాన్ఫ్రాన్సిస్స్కోలోని రాణి థెరిప్యుటిక్స్ ఫార్మా సంస్థలో దాదాపు రూ.2కోట్ల ప్యాకేజీతో శాస్త్రవేత్తగా కొలువు లభించింది. సోమవారం నుంచి విధుల్లో చేరనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
[ 26-04-2024]
సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ సంచలన ఆరోపణలు చేశారు. -
జగన్ బ్యాండేజీ సంగతి డాక్టర్లు చూసుకుంటారు: మంత్రి బొత్స
[ 26-04-2024]
విమర్శలు చేసేటప్పుడు ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల సంయమనం పాటించాలని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. -
జగన్ రాజకీయ నియంత
[ 26-04-2024]
జగన్ రాజకీయ నియంత అని సినీనటుడు పృథ్వీరాజ్ అన్నారు. గురువారం అనకాపల్లి జనసేన అభ్యర్థి కొణతాల రామకృష్ణతో కలిసి గాంధీనగరం, అంజయ్య కాలనీల్లో, రాత్రి కొత్తూరులో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
జగన్ ప్యాలెస్కు కోట్లు.. పర్యటకానికి తూట్లు
[ 26-04-2024]
రిషికొండలో జగన్ ప్యాలెస్ నిర్మాణం కోసం పర్యటక శాఖ రూ. వందల కోట్లు కుమ్మరించింది. ఇదే శాఖ రాష్ట్ర పర్యటక రాజధానిగా ఉన్న అరకులోయ, పరిసర ప్రాంతాల కోసం కనీసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. -
చిరంజీవిని విమర్శిస్తే ఖబడ్దార్.. వైకాపాకు సీఎం రమేశ్ హెచ్చరిక
[ 26-04-2024]
రాజకీయాలకు దూరంగా తటస్థంగా ఉన్న చిరంజీవిని విమర్శిస్తే ఆయన అభిమానులు చూస్తూ ఊరుకోరని అనకాపల్లి పార్లమెంట్ కూటమి అభ్యర్థి సీఎం రమేశ్ వైకాపా నాయకులను హెచ్చరించారు. -
వైకాపా ర్యాలీలో కార్యకర్తల ఘర్షణ
[ 26-04-2024]
తురువోలు సమీపంలో గురువారం సాయంత్రం వైకాపా కార్యకర్తలు నడిరోడ్డుపై ఘర్షణ పడ్డారు. ఒకరినొకరు కొట్టుకోవడంతో రోడ్డున పోయే వారు భయాందోళనకు గురయ్యారు. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
[ 26-04-2024]
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
రాష్ట్రాభివృద్ధే కూటమి ధ్యేయం
[ 26-04-2024]
నర్సీపట్నం తొమ్మిదో వార్డులో మాజీ మంత్రి అయ్యన్న సతీమణి, తెదేపా కౌన్సిలర్ చింతకాయల పద్మావతి, కోడళ్లు సువర్ణ, దివ్య, జనసేన కౌన్సిలర్ అద్దేపల్లి సౌజన్య ఇంటింటి ప్రచారం నిర్వహించారు. -
పేట వైకాపాకు భారీ షాక్
[ 26-04-2024]
వైకాపాకు భారీ షాక్ తగిలింది. పాయకరావుపేట, నక్కపల్లి మండలానికి చెందిన అనేక మంది గురువారం తెదేపాలో చేరారు. ఇప్పటికే పాయకరావుపేట మండలం పాల్తేరు, పాల్మన్పేట తదితర గ్రామాల నుంచి పెద్దఎత్తున వైకాపా నాయకులు, కార్యకర్తలు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు తెదేపాలో చేరిన విషయం తెల్సిందే. -
ఎంపీకి 25.. అసెంబ్లీకి 148 నామినేషన్లు
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో నామినేషన్ల ఘట్టం గురువారం ముగిసింది. జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు మొత్తం 148 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. -
సీఎం నోరు తెరిస్తే అబద్ధాలే!
[ 26-04-2024]
ప్రజలకు అబద్ధాలు చెప్పి మోసగించడంలో జగన్కు మించిన నాయకుడు దేశంలోనే లేరని జనసేన అసెంబ్లీ అభ్యర్థి సుందరపు విజయ్కుమార్ ఆరోపించారు. -
చెప్పింది ఘనం.. చేసింది శూన్యం
[ 26-04-2024]
రాష్ట్రంలో సులువైన పారిశ్రామిక విధానం ఉంది. పరిశ్రమల స్థాపనకు, వ్యాపార ప్రతిపాదనలతో వచ్చేవారికి అనువైన వాతావరణం కల్పించేందుకు కృతనిశ్చయంతో ఉన్నాం. -
ఏడునియోజకవర్గాలకు 147 మంది నామపత్రాల దాఖలు
[ 26-04-2024]
నామపత్రాల స్వీకరణకు చివరి రోజైన గురువారం అసెంబ్లీ నియోజకవర్గాలకు భారీగా నామపత్రాలు దాఖలయ్యాయి. -
ఉక్కులో విద్యుత్తు ఛార్జీల పెంపు తగదు : సిటూ
[ 26-04-2024]
ఉక్కునగరంలో నివాసం ఉండే కార్మికులపై విద్యుత్తు ఛార్జీల భారం పెంచేలా యాజమాన్యం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని సిటూ నాయకులు డిమాండ్ చేశారు. -
ఐదేళ్లూ మాటలే.. జనంతో ఆటలే!!
[ 26-04-2024]
రోడ్లు విస్తరణ, మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టకుండా ముక్కుపిండి నగరవాసుల నుంచి పన్నులు వసూళ్లు చేశారు. జి-20 పుణ్యమా అని వచ్చిన నిధులను సైతం నాణ్యత లేకుండా సుందరీకరణ పనుల పేరుతో ఇష్టారాజ్యంగా ఖర్చు చేశారు. -
పదో తరగతి ఫీజు 30లోగా చెల్లించాలి
[ 26-04-2024]
ఇటీవల విడుదల అయిన పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులు కాని విద్యార్థులు ఏప్రిల్ 30వ తేదీలోపు ఫీజు చెల్లించుకోవచ్చని డీఈఓ ఎల్.చంద్రకళ తెలిపారు. -
న్యాయ కళాశాల విద్యార్థికి గాయాలు
[ 26-04-2024]
ఆంధ్ర విశ్వవిద్యాలయం డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ న్యాయ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు నాలుగో పట్టణ పోలీస్ కానిస్టేబుల్పై నగర పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. -
తెలంగాణ ఇంటర్ ఫలితాలలో 983 మార్కులు
[ 26-04-2024]
తెలంగాణ ఇంటర్మీడియట ఫలితాలలో విశాఖకు చెందిన పూజారి సిద్విని 983 మార్కులు(హెచ్జీపీ) సాధించింది. ఆమె తండ్రి పూజారి రఘుప్రసాద్ ద్వారకా బస్స్టేషన్లో ఆర్టీసీ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. -
ప్రధాన దారులు.. నరకానికి నకళ్లు..
[ 26-04-2024]
సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లు అని ప్రచారం చేసుకుంటున్న వైకాపా ప్రభుత్వం ఆ సిద్ధాంతాన్ని క్షేత్ర స్థాయిలో అమలు చేయడంలో ఘోరంగా విఫలమైంది. జగన్ పాలనలో రాష్ట్రంలోని రోడ్లన్నీ అథోగతి పాలయ్యాయన్నది వాస్తవం. -
పారిశ్రామిక ప్రాంతాలు.. నిర్లక్ష్యానికి నిదర్శనాలు
[ 26-04-2024]
వైకాపా ముఖ్యమంత్రి జగన్ పాలనలో పారిశ్రామిక పురోగతి పూర్తిగా చతికిలపడింది. కొత్త పరిశ్రమలు రాకపోగా ఉన్నవి మూతపడే పరిస్థితి నెలకొంది. -
మట్టి తవ్వకందారులకు వైకాపా అండదండలు..
[ 26-04-2024]
చెరువులు, కొండల్లో అక్రమంగా మట్టి తవ్వకాలు జరిపి సొమ్ము చేసుకుంటున్న అక్రమదారులకు వైకాపా ప్రజాప్రతినిధులు పుష్కలంగా అండదండలు అందిస్తున్నారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
దొడ్డిదారి బదిలీలకు రాచమార్గం
[ 26-04-2024]
‘మా ప్రభుత్వంలో అంతా పారదర్శకమే. ఎక్కడా లంచాలు లేవు.. అవినీతికి తావులేదు. సుపరిపాలన అంటే మాదే’ అని సీఎం జగన్మోహన్రెడ్డి తరచూ గొంతుచించుకుంటూ ఉంటారు. -
బాబు వస్తేనే యువతకు జాబు
[ 26-04-2024]
విశాఖ నగరం అభివృద్ధి చెందాలంటే తెదేపా, జనసేన, భాజపా కూటమి ఎంపీ అభ్యర్థి శ్రీభరత్, ఎమ్మెల్యే అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ను గెలిపించాలని శ్రీభరత్ సతీమణి తేజస్విని కోరారు. -
ఎవరు ఆ ఇద్దరు?
[ 26-04-2024]
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఇద్దరు వ్యక్తులు అనధికారికంగా ఉద్యోగాలు చేస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. వీరికి ఏయూ వేతనాలు చెల్లిస్తున్నట్లు చర్చ జరుగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక