Thomas cup: టెన్నిస్కు డేవిస్.. బ్యాడ్మింటన్కు థామస్..
బాడ్మింటన్లో ప్రతిష్టాత్మక టోర్నమెంట్ ‘థామస్ కప్’లో భారత్ సత్తా చాటింది. 73 ఏళ్ల టోర్నీ చరిత్రలో తొలిసారిగా కప్ను గెలిచి చరిత్ర సృష్టించింది. ఈ నేపథ్యంలో ‘థామస్ కప్’ టోర్నమెంట్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు..
థామస్ కప్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు..
బ్యాడ్మింటన్లో ప్రతిష్టాత్మక టోర్నమెంట్ ‘థామస్ కప్’లో భారత్ సత్తా చాటింది. 73 ఏళ్ల టోర్నీ చరిత్రలో తొలిసారిగా కప్ను గెలిచి చరిత్ర సృష్టించింది. ఈ నేపథ్యంలో ‘థామస్ కప్’ టోర్నమెంట్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు..
🏸 థామస్ కప్ టోర్నీ ఏర్పాటు చేయాలన్న ఆలోచన జార్జ్ అలన్ థామస్ది. ఇంగ్లాండ్కు చెందిన థామస్.. 1900ల్లో గొప్ప బ్యాడ్మింటన్ క్రీడాకారుడు. బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ సహ వ్యవస్థాపకుడు.
🏸 టెన్నిస్లో డేవిస్ కప్.. ఫుట్బాల్లో వరల్డ్ కప్ ఉన్నట్లే బ్యాడ్మింటన్లోనూ ఓ ప్రపంచస్థాయి టోర్నమెంట్ ఉండాలని థామస్ భావించారు. ఈ మేరకు ‘థామస్ కప్’టోర్నీకి ప్రణాళిక రచించారు. థామస్ కప్నే ‘వరల్డ్స్ మెన్స్ టీమ్ ఛాంపియన్షిప్స్’అని కూడా పిలుస్తుంటారు.
🏸 1941లోనే ఈ టోర్నీ నిర్వహించాలని ప్రయత్నించినా...రెండో ప్రపంచయుద్ధం కారణంగా వీలుపడలేదు. దీంతో 1948-49లో తొలి ‘థామస్ కప్’ టోర్నీని ఇంగ్లాండ్లో నిర్వహించారు.
🏸 ఇందులో ఆసియన్, ఆస్ట్రేలియన్, పాన్-అమెరికన్, యూరోపియన్ ఇలా నాలుగు కేటగిరీల్లో మూడు క్వాలిఫైయింగ్ జోన్స్గా ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఆఫ్రికన్, ఓషియనియన్ కేటగిరీలు వచ్చి చేరాయి.
🏸 మూడేళ్లకోసారి జరిగే ఈ టోర్నీలో క్రీడాకారులు బెస్ట్ ఆఫ్ నైన్ ఫార్మాట్లో మ్యాచ్లు ఆడాల్సి వచ్చేది. ఐదు సింగిల్స్ విభాగంలో.. నాలుగు డబుల్స్ విభాగంలో మ్యాచ్లు ఆడాలి. ఎవరైతే ఎక్కువ మ్యాచ్లు గెలుస్తారో వారే విజేతగా నిలిచేవారు. అలా తొలి ‘థామస్ కప్’ను మలేషియా గెలుచుకుంది.
🏸 1984 నుంచి ఈ టోర్నీ రెండేళ్లకొకసారి జరుగుతోంది. అలాగే.. బెస్ట్ ఆఫ్ నైన్ కాకుండా బెస్ట్ ఆఫ్ ఫైవ్ ఫార్మాట్లో మ్యాచ్లను నిర్వహిస్తున్నారు. రెండు డబుల్స్, మూడు సింగిల్ మ్యాచ్లు ఆడాల్సి ఉంటుంది.
🏸 తొలి మూడు సార్లు ‘థామస్ కప్’ను మలేషియానే గెలుచుకుంది. 1957 నుంచి దాదాపు దశాబ్దకాలం కప్ను ఇండోనేషియానే కైవసం చేసుకుంది.
🏸 ఇప్పటి వరకు జరిగిన ఈ టోర్నీలో డెన్మార్క్(2014) మినహా ఆసియేతర దేశాల్లో ఏ ఒక్కటీ ఈ కప్ను గెలవకపోవడం గమనార్హం.
🏸 ఇండోనేషియా అత్యధికంగా 14 సార్లు ఈ కప్ గెలవగా.. చైనా 10 సార్లు, మలేషియా నాలుగుసార్లు విజేతగా నిలిచాయి.
🏸 2014లో దిల్లీ వేదికగా జరిగిన ఈ అంతర్జాతీయ మెగా టోర్నీలో జపాన్ తొలిసారి కప్ను దక్కించుకుంది.
🏸 భారత్ విషయానికొస్తే.. 1952లో తొలిసారి ‘థామస్ కప్’లో పోటీ పడింది. రెండు సార్లు ఫైనల్ రౌండ్ వరకు వెళ్లింది. మూడుసార్లు క్వార్టర్ ఫైనల్స్.. ఓసారి సెమీఫైనల్ వరకు వచ్చి వెనుదిరిగింది.
🏸 తాజాగా థాయ్లాండ్ వేదికగా జరిగిన ఈ టోర్నీలో మొదటిసారి భారత్ కప్ గెలిచి చిరస్మరణీయ విజయాన్ని సొంతం చేసుకుంది.
🏸 ప్రపంచంలోని అన్నీ దేశాలు ఈ టోర్నీలో క్వాలిఫై అయి ఫైనల్ స్టేజ్కి చేరుకునేందుకు తాపత్రయపడుతుంటాయి. కానీ, కొన్ని దేశాలే ఫైనల్ స్టేజ్కు చేరుకుంటాయి.
🏸 1984 నుంచి 2002 వరకు ఫైనల్ స్టేజ్లో ఎనిమిది జట్లను రెండు గ్రూపులుగా విభజించేవారు. ఆ తర్వాత వీటి సంఖ్య పెరుగుతూ వస్తోంది.
🏸 తాజా టోర్నమెంట్లో మొత్తం 29 దేశాలు పోటీ పడగా.. 16 దేశాలు క్వాలిఫై అయ్యాయి. వాటిని నాలుగు గ్రూపులుగా విభజించించి.. పోటీలు నిర్వహించారు.
🏸 ఫైనల్ మ్యాచ్లో 14 సార్లు ఛాంపియన్గా నిలిచిన ఇండోనేషియాతో భారత్ తలపడి విజయకేతనం ఎగరవేసింది. థామస్ కప్ను తొలిసారి ముద్దాడింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
-
మంత్రి కాకాణి అనుచరుడి రైస్ మిల్లులో మద్యం స్వాధీనం
-
జగనన్న నవ్వులు.. జనాలకు చుక్కలు
-
తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. కూలీ బిడ్డకు 993 మార్కులు
-
ఏ ముఖం పెట్టుకుని రాజధాని రైతులను సీఎం ఓట్లు అడుగుతారు
-
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి