Uttarakhand: బాబోయ్.. కొండలెక్కడం అంత ఈజీ కాదు..!
పర్వతారోహణ చెయ్యడమంటే చాలా మందికి భలే సరదా. అయితే పర్వతారోహణ సమయంలో ఎదురయ్యే సమస్యలు, వాటి పరిష్కార మార్గాలను తెలుసుకొని, సరైన శిక్షణ తీసుకున్న తర్వాతనే ముందుకు వెళ్లడం ఉత్తమం అని చెబుతున్నారు నిపుణులు. ఆ సమస్యలేంటి..? పరిష్కార మార్గాలేంటి?
ఉత్తరాఖండ్లో అకస్మాత్తుగా సంభవించిన హిమపాతం కారణంగా 10 మంది పర్వతారోహకులు ప్రాణాలు కోల్పోయారు. మొత్తం 40 మంది పర్వతారోహణకు వెళ్లినట్లు తెలుస్తోంది. తక్షణమే స్పందించిన విపత్తు ప్రతిస్పందన సహాయక బృందాలు 8 మందిని రక్షించాయి. మిగతావారి ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో పర్వతారోహకులు ఎలాంటి సమస్యలు ఎదుర్కొనే అవకాశముంది? వాటి నుంచి ఎలా బయటపడాలో తెలుసుకుందామా?
ఎత్తైన కొండలపై నడుచుకుంటూ ప్రకృతిని ఆస్వాదించడమంటే కొందరికి భలే సరదా. పర్వతారోహణను ప్రతికూల వాతావరణంలో చేసే ఒక రకమైన సాహస క్రీడగానే చెప్పాలి. శారీరక దారుఢ్యాన్ని పెంపొందించుకునేందుకు కూడా ఇది ఓ మార్గమే. అయితే, ట్రెక్కింగ్కి వెళ్లే వారికి కొన్ని సమస్యలు ఎదురవుతాయి. వాటిని ఎదుర్కొనేందుకు ముందుగానే సంసిద్ధంగా ఉండాలి. అవసరమైతే నిపుణులతో శిక్షణ తీసుకోవాల్సిందే. లేదంటే ప్రాణాల మీదకి వచ్చే ప్రమాదముంది. ఇంతకీ పర్వతారోహకులు ఎదుర్కొనే సమస్యలేంటి?
1. ఊహించని ప్రమాదాలు
మంచుకొండలను ఎక్కడమంటే పెద్ద సాహసమే. ప్రమాదం ఎటువైపు నుంచి వస్తుందో ఎవరూ చెప్పలేరు. ఉన్నట్లుండి హిమపాతం సంభవించొచ్చు. కొన్ని సార్లు పర్వతభాగం కుంగిపోవచ్చు. నునుపైన ప్రాంతాల్లో ట్రెక్కింగ్ చేసే క్రమంలో కాలుజారి ప్రాణాలు కోల్పోయిన సందర్భాలూ ఉన్నాయి. అందువల్ల పర్వతారోహణకు వెళ్లే ముందు కచ్చితంగా శిక్షణ తీసుకోవాలి. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కోగలనన్న నమ్మకం వచ్చిన తర్వాతే పర్వతారోహణకు సిద్ధమవ్వాలి. లేదంటే ప్రాణాలతో చెలగాటమాడినట్లే అవుతుంది.
2. అరికాళ్లలో బొబ్బలు
దాదాపు సగానికిపైగా పర్వతారోహకులు ఎదుర్కొనే సమస్య ఇది. పర్వతాలను అధిరోహించే క్రమంలో బూట్లకు, ఏటవాలుగా ఉన్న కొండ ఉపరితలానికి మధ్య తీవ్రమైన ఒత్తిడి కలుగుతుంది. ఈ క్రమంలో అరికాళ్లలో బొబ్బలు ఏర్పడి.. పర్వతారోహకులకు తీవ్ర సమస్యగా మారతాయి. కొన్నిసార్లు ఇవి పగిలిపోయి గాయాలుగా మారిపోతాయి. అందుకోసం ఇలాంటి సమస్యలు తలెత్తకుండా నిపుణుల సూచన మేరకు సరైన బూట్లను ఎంపిక చేసుకోవాలి. కాళ్లకు కచ్చితంగా సరిపోయేలా చూసుకోవాలి. తేలికగా ఉండి, మడమ మొత్తం బూట్ల అడుగుబాగాన ఆనుకునేలా ఉన్న బూట్లను ఎంపిక చేసుకోవాలి. క్వాలిటీ సాక్సులు ఉండేలా చూసుకోవాలి. పర్వత భాగానికి, కాలికి మధ్య ఏర్పడిన ఒత్తిడిని ఇవి కొంతవరకు తగ్గిస్తాయి.
3. చర్మ సమస్యలు
పర్వతారోహణ కోసం దేశ విదేశాల నుంచి వస్తారు. విభిన్న వాతావరణాల్లో పెరిగిన వారుంటారు.అందువల్ల వారి శరీరం అక్కడి వాతావరణానికి అలవాటుపడి ఉంటుంది. ఒక్కసారిగా ప్రతికూల వాతావరణంలోకి వచ్చేసరికి సాధారణంగానే చిన్నపాటి చర్మ సమస్యలు ఏర్పడతాయి. అలాంటిది పర్వతారోహణ సమయంలో దీని ప్రభావం మరింతగా ఉంటుంది. చర్మంపై దద్దుర్లు ఏర్పడే అవకాశముంది. అందువల్ల శరీరాన్ని పూర్తిగా కప్పిఉంచేలా తేలికపాటి దుస్తుల్ని ఎంపిక చేసుకోవాలి. లో దుస్తుల విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. టీ షర్టులు వేసుకున్నప్పుడు వాటిని పూర్తిగా కప్పి ఉంచేలా పొడవాటి మరో చొక్కాను ధరించడం ఉత్తమం. చిన్నపాటి ప్రాథమిక చికిత్సపెట్టెను తమతోపాటు తీసుకెళ్లడం మంచిది.
4. మోకాళ్ల నొప్పులు
ఎత్తయిన ప్రదేశాలను ఎక్కుతున్నప్పుడు కాలి ఎముకలు, కీళ్లు, కండరాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. ప్రధానంగా కాలి మోకీళ్లపై ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. దీనిని ఎదుర్కొనేలా ముందుగా జాగ్రత్త పడాలి. పర్వాతారోహణకు వెళ్లడానికి కొన్ని నెలల ముందునుంచే నడటవటం, వ్యాయామం లాంటివి అలవాటు చేసుకోవాలి. అవసరమైతే నిపుణుల పర్యవేక్షణలోనే కసరత్తులు చేయడం మంచిది. పర్వతారోహణకు అనుగుణంగా శరీరాన్ని అలవాటు చేసేందుకు సహజంగా 4 నుంచి 6 వారాలు పడుతుంది. వ్యాయామానికి తగ్గట్టుగా శరీరానికి తగిన విశ్రాంతి కూడా ఇవ్వాలి.
5. మెడ నొప్పి..వెన్ను నొప్పి
పర్వతారోహకులు తమ వెంట దుస్తులు, ఆహారంతోపాటు కొన్ని నిత్యావసరాలను బ్యాగులో వేసుకొని తీసుకెళ్తారు. ఓ వైపు వీటి బరువు మోస్తూనే పైకి వెళ్లాల్సి ఉంటుంది. ఈ క్రమంలో వీరికి భుజాల నొప్పి, మెడ నొప్పి, వెన్నునొప్పి లాంటి సమస్యలు ఎదురవుతాయి. వీటిని అధిగమించేందుకు బ్యాగు పట్టీలు సౌకర్యవంతంగా ఉండేలా చూసుకోవాలి. పర్వతారోహణకు వెళ్లడానికి ముందే కొంత బరువును బ్యాగులో మోస్తూ అలవాటు చేసుకోవాలి. పర్వాతారోహకుల కోసం ప్రత్యేకంగా బ్యాగులను తయారు చేసి విక్రయిస్తుంటారు. వాటిని ఒక్కసారి ప్రయత్నించి చూడటం ఉత్తమం.
6. అతిసార సమస్యలు
పర్వతారోహకులకు ఎదుయ్యే అనారోగ్య సమస్యల్లో అతిసారం ప్రధానమైనది.దీని గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. పర్వతారోహణ సమయంలో పొట్టలో అలజడి మొదలైతే ఆ బాధ వర్ణనాతీతం. అందువల్ల ముందుగానే జాగ్రత్త పడటం మంచిది. బాగా కాచిచల్లార్చిన నీటినే తాగాలి. లేదంటే ఫిల్టర్ నీటిని వెంట తీసుకెళ్లాలి. శాకాహారం మాత్రమే తీసుకోవాలి. కూరగాయాలు వేడినీటిలో కడిగిన తర్వాత మాత్రమే వండాలి. పర్వతారోహణకు ఎక్కడికి వెళ్తున్నారో అక్కడి ఆహారాన్ని తినడం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే ఆ వాతావరణానికి తగినట్లు అక్కడి ఆహారపు అలవాట్లు ఉంటాయి. అందువల్ల శరీరం ముందుగానే అలవాటుపడుతుంది. ప్రతిసారి చేతులు కడుక్కోవడం సాధ్యం కాదు కాబట్టి.. హ్యాండ్ శానిటైజర్ని వెంట తీసుకెళ్లడం మంచిది.
7. డీహైడ్రేషన్
పర్వతారోహణ సమయంలో బాగా అలసిపోతారు. అందువల్ల శరీరం డీహైడ్రేషన్కు గురయ్యే అవకాశముంది. దీని నుంచి బయట పడేందుకు వీలైంత ఎక్కువగా నీటిని తాగాలి. అలాగని పెద్దపెద్ద బాటిళ్లు తీసుకొని వెళ్లడం కుదరని పని. అందువల్ల పర్వతారోహకుల కోసం ప్రత్యకమైన రబ్బరు సంచులు ఉంటాయి. వాటిని మాత్రమే తీసుకెళ్లాలి. ప్లాస్టిక్ బాటిళ్లను తీసుకెళ్లకపోవడమే ఉత్తమం. దీనివల్ల బ్యాగులో స్థలం వృథా అవడంతోపాటు అదనపుభారంగా మారుతాయి.
8. వడదెబ్బ
పైకి వెళుతున్న కొద్దీ గాలిలో తేమ మూలంగా వేడి క్రమంగా పెరుగుతుంది. అంతేకాకుండా రోజుకు దాదాపు ఏడెనిమిది గంటలకు పైగా పర్వతారోహణ చేయాల్సి ఉంటుంది. అందువల్ల వడదెబ్బకు గురయ్యే అవకాశాలు చాలా ఎక్కువ. దీనిని నుంచి బయటపడేందుకు సన్గ్లాస్ కళ్లజోడును వాడటం ఉత్తమం. పెదవులు పొడిబారకుండా ఏదైనా లోషన్ ఉపయోగించుకోవాలి. పై జాగ్రత్తలన్నీ పాటిస్తూ, సరైన శిక్షణ తీసుకున్న తర్వాత పర్వాతారోహణకు వెళ్తే..అనుకున్నట్లుగా ఎంజాయ్ చెయ్యగలుగుతారు.
-ఇంటర్నెట్ డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మారిన లోగో రంగు.. వివాదంలో దూరదర్శన్
Doordarshan: ‘డీడీ న్యూస్’ లోగోను కాషాయ రంగులోకి మార్చడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇది ‘ప్రసార భారతి’ కాదని ‘ప్రచార భారతి’గా మారిందని పలువురు మండిపడుతున్నారు. -
వేదమంత్రాల సాక్షిగా శ్రీకృష్ణుడితో యువతి పెళ్లి
మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో ఓ యువతి చిన్నప్పటి నుంచి తాను ఆరాధించిన శ్రీకృష్ణుణ్ని పెళ్లి చేసుకుంది. -
శరద్ పవార్ వైపు దూసుకొచ్చిన మైక్రోఫోన్!
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ ఓ సభలో మాట్లాడుతుండగా ఆయన వైపు మైక్రోఫోన్ ఒకటి దూసుకురావడం చిన్నపాటి కలకలం రేపింది. -
మామిడిపండ్లను మూడుసార్లే తిన్నా
బెయిల్ కోసం ఉద్దేశపూర్వకంగా చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకుంటున్నానని ఈడీ తనపై చేసిన ఆరోపణలపై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఘాటుగా స్పందించారు. -
మూడు రోజుల్లో తేల్చాలి
ఎన్నికలు సమీపిస్తున్నాయనే ఏకైక సాకుతో సభలు, సమావేశాలు, ఓటరు చైతన్య యాత్రలు, నిరసనలు, ధర్నాలు తదితరాలపై జిల్లా, రాష్ట్ర అధికార యంత్రాంగాలు నిషేధం విధించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. -
నౌకాదళ నూతన అధిపతిగా దినేశ్కుమార్ త్రిపాఠి
నూతన నౌకాదళాధిపతిగా వైస్ అడ్మిరల్ దినేశ్ కుమార్ త్రిపాఠి నియమితులయ్యారు. ఈ నెలాఖర్లో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. -
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
చిన్నపిల్లలు అశ్లీల వీడియోలు చూడటం నేరం కాకపోవచ్చేమో గానీ, పిల్లలను ఉపయోగించి అశ్లీల వీడియోలు తీయడం తీవ్రమైన ఆందోళన కలిగించే విషయమేగాక నేరమని శుక్రవారం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
తిరస్కృత నామినేషన్లపై పిటిషన్ను తోసిపుచ్చిన సుప్రీం
తిరస్కృత నామినేషన్లకు పరిష్కారం నామినేషన్లు దాఖలు చేయడంలోనే ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
‘సైన్స్శక్తి’గా ఎదిగేందుకు భారత్ సిద్ధం
ప్రబల ఆర్థికశక్తిగా ఎదుగుతున్న భారత్.. శాస్త్ర, సాంకేతిక రంగంలోనూ సత్తా చాటేందుకు సిద్ధమవుతోందని ప్రముఖ సైన్స్ వారపత్రిక ‘నేచర్’ పేర్కొంది. -
వివాహేతర సంబంధం విడాకులకు మాత్రమే కారణం.. పిల్లల కస్టడీ మంజూరుకు కాదు
వివాహేతర సంబంధం కారణం చూపి విడాకులు పొందవచ్చు కానీ, పిల్లల కస్టడీని పొందలేరని బొంబాయి హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. -
అభ్యర్థుల మార్కులను వెల్లడించిన యూపీఎస్సీ
సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో అభ్యర్థులు సాధించిన మార్కుల వివరాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) శుక్రవారం విడుదల చేసింది. -
దుబాయ్ ప్రయాణాలు వాయిదా వేసుకోండి
అత్యవసరమేమీ కానట్లయితే దుబాయ్కి, ఇక్కడి నుంచి వేరే దేశాలకు వెళ్లేందుకు భారతీయులు తమ ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని యూఏఈలోని భారత దౌత్య కార్యాలయం సూచించింది. -
స్కూల్లో హెచ్ఎంకు ఫేషియల్ వీడియో తీసిన టీచరుపై దాడి
ఉత్తర్ప్రదేశ్లోని ఉన్నావ్ జిల్లా దండమౌ గ్రామ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సంగీతాసింగ్ పనివేళల్లో ఫేషియల్ చేయించుకున్నారు. -
ఆరోగ్యకర ఆయుర్దాయాన్ని పెంచేందుకు ప్రాజెక్టు
మానవుల ఆరోగ్యకర ఆయుర్దాయాన్ని పెంచేందుకు బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) ఒక ప్రాజెక్టును చేపట్టింది. -
ఓటు స్ఫూర్తిని చాటిన సైలెంట్ విలేజ్
ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేందుకు వైకల్యం అడ్డుకాదని చాటారు జమ్మూకశ్మీర్లోని ధడ్కాహి గ్రామస్తులు. డోడా జిల్లాలోని ధడ్కాహి.. ఉధమ్పుర్ లోక్సభ స్థానం పరిధిలోకి వస్తుంది. -
రోజూ 15 నిమిషాలు వైద్యుడిని సంప్రదించేందుకు అనుమతివ్వండి
తిహాడ్ జైలులో తాను ఇన్సులిన్ వినియోగించేందుకు అనుమతినిచ్చేలా జైలు అధికారులకు ఆదేశాలు ఇవ్వాలంటూ దిల్లీ కోర్టులో కేజ్రీవాల్ అభ్యర్థనను దాఖలు చేశారు. -
ఫిలిప్పీన్స్ చేతికి భారత్ బ్రహ్మోస్
బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూజ్ క్షిపణుల మొదటి బ్యాచ్ను భారత్.. శుక్రవారం ఫిలిప్పీన్స్కు అందజేసింది. -
యోగాగురు రాందేవ్ కేసుల పరిస్థితేంటి?
యోగాగురు రాందేవ్పై నమోదైన ఫిర్యాదుల పరిస్థితిని, ఎఫ్ఐఆర్ వివరాలను సమర్పించాలని బిహార్, ఛత్తీస్గఢ్ ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. -
కోల్కతా హైకోర్టులో న్యాయవాదులు గౌను ధరించాల్సిన అవసరం లేదు
రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో కోల్కతా హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. -
బాలిక 28 వారాల గర్భం తొలగింపుపై వైద్యుల సలహా కోరిన సుప్రీంకోర్టు
అత్యాచార బాధితురాలైన 14 ఏళ్ల బాలిక అభ్యర్థన మేరకు ఆమె 28 వారాల గర్భం తొలగించటానికి అనుమతించే విషయమై సర్వోన్నత న్యాయస్థానం వైద్యుల సలహా కోరింది. -
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
వేసవి రద్దీని తీర్చేందుకు రైల్వేశాఖ సిద్ధమైంది. ఈ సీజన్లో దేశవ్యాప్తంగా 9,111 అదనపు ట్రిప్పులు నడపనున్నట్లు ప్రకటించింది.
తాజా వార్తలు (Latest News)
-
ధోనీ ఆటే స్ఫూర్తి.. లేటుగా బ్యాటింగ్కు రావడానికి కారణముంది: ఫ్లెమింగ్
-
నిరంతరం రాష్ట్రం గురించి ఆలోచించే నేత చంద్రబాబు : పవన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
మారిన లోగో రంగు.. వివాదంలో దూరదర్శన్
-
ఆ ముగ్గురిని చూస్తే ముచ్చటేసింది.. రోహిత్ ఈజ్ బ్యాక్: హర్భజన్
-
దుర్గారావును చూపించాలంటూ ఆందోళన.. సీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత