Somerton Man: ఓ వ్యక్తి మరణం.. 73 ఏళ్ల తర్వాత వీడిన మిస్టరీ..!
ఆస్ట్రేలియాలో (Australia) ఏడు దశాబ్దాల క్రితం చోటుచేసుకున్న ఓ మరణం ఆ దేశ చరిత్రలోనే ఓ మిస్టరీ (Mysterious Death) కేసుగా మిగిలిపోయింది.
మెల్బోర్న్: ఆస్ట్రేలియాలో (Australia) ఏడు దశాబ్దాల క్రితం చోటుచేసుకున్న ఓ మరణం ఆ దేశ చరిత్రలోనే ఓ మిస్టరీ (Mysterious Death) కేసుగా మిగిలిపోయింది. చనిపోయిన వ్యక్తి ఎవరు..? ఎక్కడ నుంచి వచ్చారు..? ఎలా చనిపోయారనే విషయాన్ని కనుక్కునేందుకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. భగ్న ప్రేమికుడి నుంచి గూఢచారి వరకు అనేక కోణాల్లో ఆయన చుట్టూ ఎన్నో కథనాలు, అనుమానాలు, దర్యాప్తులు జరిపినప్పటికీ చివరకు ఆయన ఎవరనే విషయాన్ని తేల్చలేకపోయారు. దీంతో ఏడు దశాబ్దాలుగా ఆ వ్యక్తి మరణం ఓ మిస్టరీగానే (Mystery) మారింది. కానీ, పట్టువిడువని విక్రమార్కుడిలా ఓ పరిశోధకుడు కొన్నేళ్లపాటు చేసిన కృషితో ఎట్టకేలకు ఆయన ఎవరనే విషయం తేలింది.
హత్య కాదు.. మరేంటి..?
ఆస్ట్రేలియాలోని సోమెర్టన్ బీచ్.. డిసెంబర్ 1, 1948 సంవత్సరం. బీచ్లో అచేతనంగా పడివున్న ఓ 40ఏళ్ళ వ్యక్తి దగ్గర సందర్శకులు గుమికూడారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు.. సూటు, బూటు వేసుకొని నీట్గా ఉన్న ఆ వ్యక్తి మరణించినట్లు గుర్తించారు. కానీ, ఆయన పేరు, చిరునామాకు సంబంధించిన ఆనవాళ్లేమీ లేవు. ఆ వ్యక్తి సంబంధీకులు కూడా ఎవ్వరూ రాలేదు. ఆయన శరీరంపై ఎటువంటి గాయాలు కూడా లేవు. పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు.. విషప్రయోగం వల్ల గుండెపోటుతో మరణించవచ్చనే అనుమానాలు వ్యక్తం చేసినప్పటికీ కారణాలు మాత్రం కచ్చితంగా చెప్పలేకపోయారు.
రష్యా గూఢచారి..?
సోమర్టెన్ మ్యాన్గా (Somerton man) పేర్కొన్న ఆయన పాకెట్లో ఉపయోగించని బస్సు, రైలు టికెట్లతోపాటు చూయింగ్ గమ్, రెండు దువ్వెనలు, అగ్గిపుల్లలతో పాటు ఓ సిగరెట్ డబ్బా లభించాయి. కానీ, ఆయన వ్యక్తిగత సమాచారానికి సంబంధించి ఎటువంటి ఐడీ కార్డులు, ధ్రువీకరణ పత్రాలు లభించలేదు. ఆయన చొక్కా కాలర్, సూట్కేసుపైనా పేర్లు కూడా లేవు. దీంతో ఆయన రష్యా లేదా ఇతర దేశాలకు చెందిన గూఢచారి కావచ్చనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే, పార్సీ భాష పద్యంలోని చివరి పదాలతో (Tamam Shud అంటే It's Finished అనే అర్థం) కూడిన ఓ పేపర్ ముక్క ఆయన జేబులో లభించడంతో ఆ దిశగా పరిశోధన చేపట్టారు. అదే సమయంలో అడిలైడ్ రైల్వే స్టేషన్లో ఓ సూట్కేసు దొరకగా అందులో పురుషుడి దుస్తులతోపాటు ఇతర వస్తువులు లభించాయి. అవి నవంబర్ 30న రైల్వేస్టేషన్లో వదిలిపెట్టినట్లు గుర్తించిన పోలీసులు.. అవి సోమర్టెన్ బీచ్లో మరణించిన వ్యక్తివే అని అనుమానించారు. అన్ని కోణాల్లో దర్యాప్తు జరిపినప్పటికీ ఆయన ఎవరు, మరణానికి గల కారణాలు ఏంటనే విషయాలు మాత్రం అంతుచిక్కలేదు. దీంతో ఈ కేసును ఛాలెంజ్గా తీసుకున్న ఆస్ట్రేలియా పోలీసులు ఆయన ఫింగర్ఫ్రింట్స్ను ప్రపంచ వ్యాప్తంగా పంపించారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది.
ఎన్నో కథలు, కథనాలు..
సోమర్టెన్ బీచ్లో గుర్తించిన వ్యక్తికి సంబంధించి మిస్సింగ్ కేసు కూడా దేశంలో ఎక్కడా నమోదు కాకపోవడం కేసు దర్యాప్తును ముందడుగు పడలేదు. ఇక చేసేదేమి లేక పదిహేను రోజుల తర్వాత (1949లో) ఓ శ్మశానవాటికలో సోమర్టెన్ మ్యాన్ మృతదేహాన్ని అధికారులు పూడ్చిపెట్టారు. ‘ఇక్కడున్నది ఓ గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం. స్టోమర్టన్ బీచ్లో లభించింది’ అని అక్కడున్న రాతిపై అధికారులు రాసిపెట్టారు. ముందుజాగ్రత్తగా ఆయనకు సంబంధించిన వస్తువులను అధికారులు భద్రపరిచారు. తర్వాత జరిపిన పరిశోధనల్లోనూ ఆయన ఎవరనే విషయం తెలియకపోవడంతో పోలీసులు ఆ కేసును పక్కకుపెట్టారు. అనంతరం ఈ మిస్టరీ కేసుపై ఎన్నో కథనాలు, డాక్యుమెంటరీలు, పుస్తకాలు కూడా వచ్చాయి.
డీఎన్ఏ విశ్లేషణతో..
ఈ కేసును ఛాలెంజ్గా తీసుకున్న యూనివర్సిటీ ఆఫ్ అడిలైడ్కు చెందిన ప్రొఫెసర్ డెరెక్ అబోట్.. కొన్నేళ్లపాటు పరిశోధన చేపట్టారు. గతంలో మృతుడి నుంచి సేకరించి భద్రపరిచిన వెంట్రుకల డీఎన్ఏ సహాయంతో పరిశోధన మరింత ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా అమెరికాలోని ప్రముఖ ఫోరెన్సిక్ నిపుణుడు కొల్లీన్ ఫిట్స్పాట్రిక్ను సంప్రదించారు. డీఎన్ఏ విశ్లేషణలో ఎంతో నైపుణ్యమున్న ఆమె గతంతో ఎన్నో మిస్టరీ కేసులను ఛేదించారు. ఇలా ఇద్దరు నిపుణులు కలిసి డీఎన్ఏ డేటాబేస్లోని నమూనాలతో పోల్చుకుంటూ వెళ్లారు. ఇలా కుటుంబ వృక్షాన్ని నిర్మిస్తూ వెళ్లిన పరిశోధకులకు చివరగా సోమర్టెన్ కుటుంబానికి చెందిన ఓ వ్యక్తితో ఆ నమూనాలు సరిపోలడంతో ఊపిరి పీల్చుకున్నారు.
వీడిన మిస్టరీ..
డీఎన్ఏ విశ్లేషణలో ద్వారా చివరకు ఆ వ్యక్తి ఆస్ట్రేలియాకు చెందిన కార్ల్ వెబ్ (Carl Webb) అనే భావనకు వచ్చారు. మెల్బోర్న్ శివారులోని ఫూట్స్క్రేలో నవంబర్ 16, 1905న ఆయన జన్మించినట్లు పేర్కొన్న పరిశోధకులు.. ఆయన ఓ ఎలక్ట్రికల్ ఇంజినీర్గా గుర్తించారు. ఆయనకు ఆరుగురు తోబుట్టువులు ఉండగా అందులో కార్ల్వెబ్ చిన్నవాడని పరిశోధకులు నిర్ధారించారు. ఇదే సమయంలో మెల్బోర్న్కు చెందిన వ్యక్తి అడిలైడ్ (Adelaide)కు ఎందుకు వచ్చారనే దానికి ఆధారాలు ఉన్నాయని పరిశోధకులు వెల్లడించారు. భార్యతో విడిపోయిన ఆయన.. కొంతకాలం తర్వాత ఆమెను వెతుక్కుంటూ అడిలైడ్ వచ్చినట్లు భావిస్తున్నామని అన్నారు.
ఇలా ఆస్ట్రేలియా చరిత్రలోనే అత్యంత మిస్టరీ మరణంగా భావిస్తోన్న ఈ కేసును ఛేదించడం ఎంతో సంతోషంగా ఉందని పరిశోధకులు వెల్లడించారు. అయితే, ఆయన ఎలా, ఎందుకు మరణించారనే కారణాలు తెలియడానికి మరికొన్ని సంవత్సరాలు పట్టవచ్చని అంచనా వేశారు. దీనిపై పోలీసులు అధికారికంగా ప్రకటన చేయనప్పటికీ.. కేసు దర్యాప్తును కొనసాగించే పనిలో నిమగ్నమైనట్లు సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గాడిద పాలతో నెలకు రూ.3 లక్షలు.. గుజరాత్ కుర్రాడి సక్సెస్ స్టోరీ!
Donkey Farm: ఉపాధిలేక గాడిదల ఫామ్ ప్రారంభించిన గుజరాత్ కుర్రాడు ధీరేణ్ సోలంకీ నెలకు రూ.2-3 లక్షల వరకు సంపాదిస్తున్నాడట. మరి ఆయన స్టోరీ ఏంటో చూద్దాం..! -
ఎడారి దేశంలో ఎందుకీ వరదలు.. క్లౌడ్ సీడింగ్ కారణమా?
అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ఎడారి దేశమైన యూఏఈలో కుండపోత వర్షాలకు ‘క్లౌడ్ సీడింగ్’ (Cloud seeding) కారణమనే అభిప్రాయాలున్నాయి. -
సింగం vs సింగై.. మధ్యలో గణపతి
త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో కోయంబత్తూర్ నుంచి భాజపా అభ్యర్థిగా అన్నామలై పోటీలో నిలిచారు. ఆయనకు పోటీగా డీఎంకే నుంచి మాజీ మేయర్ గణపతి రాజ్కుమార్, అన్నాడీఎంకే నుంచి సింగై రామచంద్రన్ బరిలో ఉన్నారు. -
కచ్చతీవు.. కథేంటి? అసలు ఎక్కడుంది ఈ దీవి?
భారత్కు చెందిన కచ్చతీవు దీవిని కాంగ్రెస్ సర్కార్ 1974లో శ్రీలంకకు అప్పగించింది. తమిళనాడు భాజపా నేత అన్నామలై ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించడంతో ఇది మళ్లీ వార్తల్లోకి వచ్చింది. -
ఆజానుబాహుడు.. ఆ బానిస 200 మంది పిల్లలకు తండ్రి..!
బ్రెజిల్కు చెందిన నల్లజాతి బానిస.. దాదాపు 200 మందికి పైగా చిన్నారులకు తండ్రయ్యాడు. -
Rainwater Harvesting: తక్కువ ఖర్చు.. ఇంట్లోనే వర్షపు నీటిని ఎలా ఆదా చేయొచ్చంటే?
అడుగంటిపోతున్న భూగర్భ జలాలకు పునర్జీవం ఇచ్చేందుకు తక్కువ ఖర్చుతో వాన నీటిని ఒడిసి పట్టే ప్రక్రియను ముంబయికి చెందిన వ్యక్తి రూపొందించాడు. -
Happiest Country: ఏడోసారి ‘హ్యాపీ’గా.. ఫిన్లాండ్ అద్భుత విజయానికి కారణాలివే!
ఇటీవల యూఎన్ ఆధారిత సంస్థ ప్రకటించిన ఆనందకర దేశాల జాబితాలో వరుసగా ఏడోసారి ఫిన్లాండ్ అగ్ర స్థానంలో నిలిచింది. ఈ అద్భుత విజయం వెనక కారణాలివే.. -
Underwater Metro: మరో అద్భుతం! నది కింద మెట్రో సర్వీసులు.. విశేషాలివే..
రైల్వే రవాణా చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోల్కతాలో నది కింద మెట్రో రైలు సర్వీసుల్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించబోతున్నారు. -
Wolfs: అక్కడ తోడేళ్లు అరవడం లేదట.. ఎందుకంటే?
తోడేళ్లు రాత్రి సమయాల్లో ఊళలు వేస్తుంటాయి. అయితే.. ఇటీవల మహారాష్ట్రలో తోడేళ్ల సముదాయాలు రాత్రిళ్లు ఇలా చేయడం లేదని ఒక సర్వేలో వెల్లడైంది. అసలు కారణం ఇదే.. -
పితృదేవతలకు అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య, మహాలయ అమావాస్య పితృదేవతలకు ఎంతో ఇష్టమనీ, ఆ రోజు శ్రాద్ధ కర్మాదుల్ని చేస్తే మంచి ఫలితం ఉంటుందనీ పెద్దలంతా అంటుంటారు. అసలు పితృదేవతలకూ, అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటంటే.. -
సరస్వతీ దేవి రూపం ఎందుకంత విశిష్టమైనది?
Vasantha panchami: ఒకసారి సరస్వతి మూర్తిని గమనించండి - ఆమె ఒక చేతిలో వీణ (సంగీత వాయిద్యం), మరొక చేతిలో పుస్తకం ఉంటాయి. పుస్తకం, మన ఎడమ మెదడు చేసే కార్యకలాపాలను సూచిస్తుంది. ప్రాచీన వాయిద్యాల్లో ఒకటైన వీణ, సంగీతాన్ని, కళలను, సృజనాత్మకను.. మన కుడి మెదడు చేసే పనులను సూచిస్తుంది. -
Hindu Temple: అబుదాబిలో అతి పెద్ద ‘హిందూ ఆలయం’ రేపే ప్రారంభం.. ఈ విశేషాలు తెలుసా?
అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 14న ఈ ఆలయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి చేరుకున్నారు. -
PV Narasimha Rao: అదీ పీవీ అంటే.. ఆర్థికం తెలియకున్నా.. వెనక్కి తగ్గలే!
ప్రధానిగా పీవీ నరసింహారావు చేసిన కృషి నిరుపమానమైంది.. దేశం దాదాపు దివాళా తీసే పరిస్థితులు ఉన్న కాలంలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే ఈరోజు దేశాన్ని ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేశాయి. అలాంటి గొప్ప రాజనీతిజ్ఞుడైన పీవీకి కేంద్ర భారతరత్న పురస్కారం ప్రకటించిన సందర్భంగా ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: పీఠాధిపతి కాబోయి.. ప్రధాని పీఠం అధిరోహించి..!
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన జీవితంలో కొన్ని అరుదైన ఘటనల గురించి తెలుసుకుందాం. -
PV Narasimha Rao: తెలుగువారి కోహినూరు.. పీవీ నరసింహారావు
బహుముఖ ప్రజ్ఞశాలి, మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. బహు భాషాకోవిదుడైన ఆయన ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, ప్రధాని హోదాల్లో పనిచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అవిశ్రాంతంగా కృషిచేశారు. తెలుగుజాతి గర్వించే పీవీ.. దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: భావిగతి మార్చిన సంస్కర్తకి భారతరత్న.. అప్పుల భారతాన్ని అభివృద్ధి వైపు నడిపిన పీవీ
PV Narasimha Rao: భారత ఆర్థిక మూలాల బలోపేతానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకున్న నిర్ణయాలు, కృషి అనిర్వచనీయమైనది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించిన వేళ ఆ ఆసక్తికర విషయాలు.. -
Cervical cancer: ఏంటీ సర్వైకల్ క్యాన్సర్? ఎలా గుర్తించాలి?
సర్వైకల్ క్యాన్సర్.. ఏంటీ వ్యాధి..? ఎలా గుర్తించాలి? -
Explained: ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియమే ఎందుకు?
ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియంనే ఎందుకు వాడతారో తెలుసా? కారణమేంటి? -
Nitish Kumar: మళ్లీ జంప్..! ఎందుకంటే..?
బిహార్ సీఎం, జేడీయూ అధినేత నీతీశ్కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరే అవకాశాలున్నాయి. విపక్ష ‘ఇండియా’ కూటమిలో కీలక నేతగా ఉన్న ఆయన భాజపాతో చేతులు కలపడంపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. -
Karpoori Thakur: ‘కర్పూరీ’ లెక్కలు.. పాస్ చేస్తాయా?
సోషలిస్టు నేత, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్.. 1970, 80ల్లో ఎంబీసీ నేతగా వేసిన ముద్ర బిహార్ రాజకీయాలను మార్చివేసింది. -
శీతాకాలంలో మాయం.. వసంతంలో ప్రత్యక్షం.. ఎలా?
కీటకాలు, పురుగులు, సూక్ష్మజీవులు, పక్షులు.. నిత్యం ప్రకృతిలో సవాళ్లను ఎదుర్కొంటాయి. తమకంటే పెద్దవైన క్రూర జంతువుల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు వివిధ రకాల వ్యూహాలను అనుసరిస్తుంటాయి.
తాజా వార్తలు (Latest News)
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్