Kids Health: మీ పిల్లలతో వ్యాయామం చేయించండిలా!
వ్యాయామం చేయడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. అయితే ఈ వ్యాయామం పెద్దలకు మాత్రమేనా పిల్లల సంగతేంటి?
ఇంటర్నెట్ డెస్క్: వ్యాయామం చేయడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. అయితే ఈ వ్యాయామం పెద్దలకు మాత్రమేనా పిల్లల సంగతేంటి?
వారి శరీరానికి కూడా వ్యాయామం అవసరం. పిల్లలు ఎక్కువగా తరగతి గదిలో గంటలపాటు కూర్చుని ఉండిపోతారు. ఈ కరోనా దెబ్బకు ఇంటికే పరిమితమయ్యారు. గంటల తరబడి ఫోన్లతోనే గడుపుతున్నారు. వారి శారీరక, మానసిక ఎదుగుదలకు తోడ్పడే వ్యాయామం సంగతేంటి? ఇలా చేసి చూడండి
వీటిని కొనివ్వండి
సాధారణంగా పిల్లలకు బొమ్మలను కొనిస్తూనే ఉంటారు. వాటికి బదులుగా వారికి ఉపయోగపడేలా స్కిప్పింగ్, బాడ్మింటన్ రాకెట్ లాంటి ఆట పరికరాలను కొనివ్వండి. ఇలా చేయడం వల్ల వారికి బోర్గా అనిపించకుండా వీటితో ఆడుకుంటారు.
విహార యాత్రకు వీటినీ తీసుకెళ్లండి
పిల్లలను తల్లిదండ్రులు బయటకు తీసుకెళ్లాలనుకుంటే సెలవు రోజుల్లో కొంత విభిన్నంగా ప్రణాళికలను రూపొందించండి. స్విమ్మింగ్, మౌంటెన్ బైకింగ్ ఉండే ప్రాంతాలకు తీసుకెళ్లాలి. దీంతో ప్రకృతితో వారు మమేకం కాగలరు. ఇటువంటివి చేయడం అలవాటుగా చేసుకుంటే ఆనందకర కుటుంబాన్ని పొందగలరు.
ఇంటి పనులు చేసేలా ప్రోత్సహించండి
ఇంటిలో పనులకు పిల్లలను దూరంగా ఉంచుతారు తల్లిదండ్రులు కానీ అలా చేయడం మంచి పద్ధతి కాదు. వారికి చిన్న చిన్న పనులు చేసేలా ప్రోత్సహించాలి. వారు పనులు నేర్చుకున్నట్లూ ఉంటుంది. పనులు చేస్తుంటే వారి శరీరానికి వ్యాయామం చేసినట్లు కూడా ఉంటుంది.
టీవీ టైమ్ను తగ్గించండి
టీవీ చూస్తే కుటుంబం అంతా కలిసి చూడండి. వారికి రిమోట్ ఇచ్చేసి వదిలేయకూడదు. ఇలా చేయడం వల్ల వారు గంటల తరబడి తెరను చూస్తూనే ఉంటారు. దీంతో కంటి సమస్యలు తలెత్తుతాయి. అలాకాకుండా మీరు పిల్లలతో ఆడుకోండి. వారికి ఏం కావాలో అడిగి తెలుసుకోండి. మీరు వారితో సమయం గడపకుంటే పిల్లలు మానసికంగా కుంగిపోతారు. ఒంటరిగా ఫీల్ అవుతారు.
ఈ కొద్ది పాటి మార్పులు చేసుకొని పిల్లలను వ్యాయామం చేసేలా ప్రోత్సహించండి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి
సీఎం జగన్పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్ను కస్టడీకి ఇచ్చేందుకు కోర్టు అనుమతించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (24/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్తో సినిమా కష్టమే..: వెట్రిమారన్
-
ఆ ఇద్దరికి నో ప్లేస్.. వన్డౌన్ బ్యాటర్గా అతడే: ఇర్ఫాన్ పఠాన్
-
సంపద పంచుతారంటూ మోదీ ఆరోపణలు.. రాహుల్ క్లారిటీ
-
ప్రమాదవశాత్తు పేలిన తుపాకీ.. సీఆర్పీఎఫ్ డీఎస్పీ మృతి
-
వారసత్వ ఆస్తుల్నీ వదలరట: పిట్రోడా వ్యాఖ్యలపై మోదీ విమర్శలు
-
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి