firecrackers: 400 ఏళ్ల నాటి టెక్నిక్.. మట్టితో టపాసుల తయారీ!
దేశవాళీ టపాసులకు మళ్లీ ఆదరణ దక్కేలా కృషి చేస్తోంది గుజరాత్కు చెందిన ‘ప్రముఖ్ పరివార్’ అనే స్వచ్ఛంద సంస్థ. ప్రధాని నరేంద్ర మోదీ నినాదం ‘వోకల్ ఫర్ లోకల్’ స్ఫూర్తితో......
వడోదరా: దీపావళి పండగ గురించి ప్రస్తావన వస్తే మొదటగా గుర్తొచ్చేది టపాసులే. ఈ పండగ రోజు సాయంత్రం ఇంటి వాకిట్లో దీపాల వెలుగులో బాణసంచా కాలుస్తూ సంబురాలు చేసుకుంటాం. అయితే ఏటా రకరకాల టపాసులు మార్కెట్లోకి అందుబాటులోకి రావడం, ఇదే సమయంలో చౌకగా లభించే చైనా బాణసంచాకు డిమాండ్ పెరుగుతుండగా.. దేశవాళీ టపాసులకు ఆదరణ తగ్గిపోతోంది. ఈ నేపథ్యంలో ఈ బాణాసంచాకు మళ్లీ ఆదరణ దక్కేలా కృషి చేస్తోంది గుజరాత్కు చెందిన ‘ప్రముఖ్ పరివార్’ అనే స్వచ్ఛంద సంస్థ. ప్రధాని నరేంద్ర మోదీ నినాదం ‘వోకల్ ఫర్ లోకల్’ స్ఫూర్తితో 400 ఏళ్ల క్రితం నాటి పద్ధతిలో మట్టితో బాణసంచా తయారు చేయిస్తోంది.
వడోదరా జిల్లాలోని కుమ్హర్వాడా, ఫతేపుర్ గ్రామాలకు చెందిన కొందరు కళాకారులు మట్టితో టపాసులు తయారు చేయడంలో సిద్ధహస్తులు. 400 ఏళ్ల క్రితంనాటి పద్ధతిలో ఈ బాణసంచా తయారు చేస్తారు. అయితే గత 20 ఏళ్లుగా ఈ టపాసులకు ఆదరణ లేకుండా పోయింది. దీంతో రంగంలోకి దిగిన ప్రముఖ్ పరివార్ మళ్లీ ఆ టపాసులను తయారుచేసే విధంగా స్థానికులను ప్రోత్సహిస్తోంది. ఆ కళాకారులకు ఉపాధి కల్పిస్తోంది.
ఎలాంటి హాని ఉండదు
పర్యావరణ హితమైన ఈ బాణసంచాతో ఎలాంటి హాని ఉండదంటున్నారు స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు నితల్ గాంధీ. ‘ఇవి 100 శాతం దేశవాళీ బాణసంచా. కొథీలుగా పిలిచే వీటిని బంకమట్టితో తయారు చేస్తారు. కొన్ని టపాసులను కాగితం, వెదురుతో రూపొందిస్తారు. పర్యావరణ హితమైన ఈ బాణసంచాతో పిల్లలకు ఎలాంటి హాని ఉండదు. వోకల్ ఫర్ లోకలే లక్ష్యంగా మేము వీటిని తయారు చేయిస్తున్నాం. స్థానిక కళాకారులకు ఉపాధి కల్పించడమే మా లక్ష్యం’ అని నితల్ పేర్కొన్నారు.
తయారీదారుల హర్షం
ఈ స్వదేశీ బాణసంచా తయారీతో తమకు ఉపాధి దక్కడంపై తయారీదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రమణ్ ప్రజాపతి అనే ఓ తయారీదారు మాట్లాడుతూ.. ‘400 ఏళ్ల క్రితం నుంచి ఈ తయారీ పద్ధతి ఉంది. గిరాకీ లేక 20 ఏళ్ల క్రితమే వీటి తయారీని ఆపేశాను. కానీ ఓ రోజు నితల్ గాంధీ వచ్చి వీటి గురించి అడగ్గా కొన్ని నమూనాలు చూపించాను. ఇవి ఆయనకు నచ్చాయి. ఈ దీపావళికి కొంత సంపాదించబోతున్నా’ అని తన ఆనందాన్ని వెలిబుచ్చారు. ఈ బాణాసంచాకు ప్రస్తుతం మంచి ఆదరణ లభిస్తోందని.. మొత్తంగా లక్షకు పైగా కొథీలను తయారు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైకోర్టుల్లోనూ మౌలిక సౌకర్యాల కొరత: సీజేఐ జస్టిస్ చంద్రచూడ్
ప్రజలకు న్యాయ సేవలు మరింత చేరువయ్యేలా మార్పులు రావాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ఆకాంక్షించారు. -
ఏపీలో పింఛన్ల పంపిణీ.. వాలంటీర్లకు కీలక ఆదేశాలు
ఏప్రిల్, మే నెల పింఛన్ల పంపిణీకి వాలంటీర్లు ఆథరైజేషన్ పత్రాలు తీసుకోవాలని గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ (సెర్ప్) సర్క్యులర్ జారీ చేసింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ప్రజలు ఉదాసీనంగా ఉన్నంత కాలం నిబంధనలు అమలు కావు: జస్టిస్ చలమేశ్వర్
ప్రజలు ఉదాసీనంగా ఉన్నంత కాలం ఎన్ని నిబంధనలు ఉన్నా అమలు కావని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ అన్నారు. -
ఉప్పల్లో ఐపీఎల్ మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
నేడు నగరంలోని ఉప్పల్ స్టేడియంలో ముంబయి-హైదరాబాద్ జట్ల మధ్య ఐపీఎల్ మ్యాచ్ జరగనుంది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రామ్చరణ్ దంపతులు
తిరుమల శ్రీవారిని సినీనటుడు రామ్చరణ్, ఉపాసన దంపతులు దర్శించుకున్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మావయ్యా.. ఇదేం ప్రగతయ్యా..?
నాడు-నేడు అంటూ విద్యా వ్యవస్థలో, మౌలిక సదుపాయాల కల్పనలో ఎన్నో సమూల మార్పులు తెచ్చామని రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నా.. నేటికీ పలు చోట్ల ఆ ప్రగతి కనిపించడం లేదు. -
డబ్బులు ఇస్తారా.. స్టేషన్కు వస్తారా..!
కొంతమంది పోలీసులు అధికారుల ఆదేశాలను అడ్డుగా పెట్టుకుని వసూళ్లకు పాల్పడుతున్నారు. తాము నిబంధనలు ఉల్లంఘించలేదని తమను వదిలిపెట్టాలని బాధితులు వేడుకుంటున్నా వారు వినిపించుకోకుండా తమదైన ముద్ర చూపుతున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.. -
ప్రయాణికుల రద్దీ.. 32 ప్రత్యేక రైళ్ల సర్వీసులు పొడిగింపు
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని పలు ప్రత్యేక రైళ్ల సర్వీసులను పొడిగిస్తూ దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం తీసుకుంది. ఆ రైళ్ల వివరాలివే..
తాజా వార్తలు (Latest News)
-
దిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్కు దక్కని ఊరట
-
హైకోర్టుల్లోనూ మౌలిక సౌకర్యాల కొరత: సీజేఐ జస్టిస్ చంద్రచూడ్
-
ఒక్క ఓటరు కోసం.. 39 కి.మీ. ట్రెక్కింగ్కు పోలింగ్ సిబ్బంది రెడీ!
-
30 ఏళ్ల క్రితం సచిన్ ఆట మొదలైంది ఈ రోజే..!
-
జనసేన పెండింగ్ స్థానాలపై పవన్ కల్యాణ్ కసరత్తు
-
మయన్మార్ సరిహద్దుల్లో కంచె.. రూ.30,000 కోట్ల ఖర్చు..!