సరైన వివరాలివ్వండి..
గతవారం రాజ్కోట్లోని కొవిడ్ ఆస్పత్రిలో జరిగిన అగ్ని ప్రమాదంపై సరైన వివరాలివ్వని కారణంగా గుజరాత్ ప్రభుత్వంపై మంగళవారం సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ప్రభుత్వం వాస్తవాలను తొక్కిపెడుతుందన్న ఉన్నత న్యాయస్థానం, ఘటనపై కొత్త అఫిడవిట్ను దాఖలు చేయమని ఆదేశించింది.
గుజరాత్కు ఉన్నత న్యాయస్థానం ఆదేశం
దిల్లీ: గతవారం రాజ్కోట్లోని కొవిడ్ ఆస్పత్రిలో జరిగిన అగ్ని ప్రమాదంపై సరైన వివరాలివ్వని కారణంగా గుజరాత్ ప్రభుత్వంపై మంగళవారం సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ప్రభుత్వం వాస్తవాలను తొక్కిపెడుతుందన్న ఉన్నత న్యాయస్థానం, ఘటనపై కొత్త అఫిడవిట్ను దాఖలు చేయమని ఆదేశించింది. గత శుక్రవారం రాజ్కోట్లోని ఉదయ్ శివానంద్ ఆస్పత్రిలో మంటలు చెలరేగగా ఆరుగురు కరోనా బాధితులు మృత్యువాత పడ్డారు. మంటలు ఐసీయూ నుంచి వ్యాపించాయని పోలీసులు తెలుపగా, ఆస్పత్రి యాజమాన్యం సరైన భద్రతా చర్యలు తీసుకోనందునే ప్రమాదం జరిగిందని దర్యాప్తులో వెల్లడైంది. ‘‘మీరు చెప్పినట్లు అన్ని సరిగ్గా ఉన్నప్పుడు, మీ ఎలక్ట్రిక్ ఇంజనీర్ ఇచ్చిన నివేదిక మీరు చెప్పిన దానికి పూర్తి విరుద్ధంగా ఎలా ఉందని’’ సుప్రీంకోర్టు గుజరాత్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఆస్పత్రిని నిర్వహిస్తున్న గోకుల్ హెల్త్కేర్కు సంబంధించిన ముగ్గురిని సోమవారం రాత్రి అరెస్టు చేశారు. ఈ ఘటనపై తదుపరి విచారణ డిసెంబరు 3కు వాయిదా వేశారు. తాజా అఫిడవిట్లో ప్రభుత్వం అన్ని వాస్తవాలను పొందుపరిచేలా చూడాలని ఉన్నత న్యాయస్థానం సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను కోరింది. అగ్ని ప్రమాదానికి గురైన ఉదయ్శివానంద్ ఆస్పత్రి సెప్టెంబరు 15న కొవిడ్ చికిత్సలకు అనుమతి పొందింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్లో ఉరుములు, మెరుపులతో వర్షం
నగరంలోని పలుచోట్ల శనివారం ఉదయం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. -
విశాఖ-బెంగళూరు మధ్య ప్రత్యేక రైలు
వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని విశాఖ- బెంగళూరు మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు. -
పెళ్లి ఘట్టం.. క్యూఆర్ కోడ్లో నిక్ష్లిప్తం
రాజమహేంద్రవరానికి చెందిన అలికాని సత్యశివకుమార్(శివస్వామి), దుర్గాభవానీలు వినూత్న ప్రయత్నం చేశారు. -
మీమ్స్ తో ప్రచారం.. యువ ఓటర్లకు గాలం
ఎన్నికల్లో గెలవాలంటే అనర్గళంగా ప్రసంగిస్తూ.. అన్నివర్గాల ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం.. గెలిస్తే ఏం చేస్తామో చెప్పడం.. ప్రత్యర్థి పార్టీని విమర్శించడం ఒకప్పటి ప్రచార శైలి.. -
ఓటాస్త్రం.. స్వీయచిత్రమే సాక్ష్యం
ఓరుగల్లు నగరంలో ఓటింగ్ శాతం పెంచేందుకు వరంగల్ కలెక్టరేట్ ఆవరణలో సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేశారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు
తాజా వార్తలు (Latest News)
-
మా పేర్లు చెప్పాలని వారిని చిత్రహింసలు పెడుతున్నారు: బొండా ఉమా
-
యాక్టర్ జగన్.. ఎన్నికల లబ్ధికి ఉత్తుత్తి శిబిరాలు
-
కేరళలో ఒక్క ఓటరు కోసం.. అడవిలో 18 కి.మీ. ప్రయాణం
-
మిమ్మల్ని గద్దెనెక్కిస్తే.. నడిరోడ్డుపై పడేశారు
-
వేదమంత్రాల సాక్షిగా శ్రీకృష్ణుడితో యువతి పెళ్లి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM