గ్రేటర్ పోరుకు సర్వం సిద్ధం
జీహెచ్ఎంసీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్ర 6 గంటల వరకు
హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్ర 6 గంటల వరకు 150 డివిజన్లలో పోలింగ్ జరగనుంది. గ్రేటర్ పరిధిలో 74,67,256 మంది ఓటర్లు 1,122 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు. అధికార తెరాస అన్ని స్థానాల్లో పోటీ చేస్తుండగా.. భాజపా 149, కాంగ్రెస్ 146, తెదేపా 106, ఎంఐఎం 51, సీపీఐ 17, సీపీఎం 12, ఇతర గుర్తింపు పొందిన పార్టీలు 76, స్వతంత్ర అభ్యర్థులు 415 మంది బల్దియా బరిలో ఉన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలకు 9,101 పోలింగ్ కేంద్రాలను అధికారులు సిద్ధం చేశారు. ఎన్నికల కోసం 60 ఫ్లయింగ్స్క్వాడ్లు, 30 పర్యవేక్షణ బృందాలను ఏర్పాటు చేశారు. మూడు కమిషనరేట్ల పరిధిలో జరగనున్న ఈ ఎన్నికలకు 51,500 మంది పోలీసులు బందోబస్తు నిర్వహించనున్నారు. పోలింగ్ సిబ్బంది ఎన్నికల సామగ్రితో తమకు కేటాయించి కేంద్రాలకు తరలివెళ్లారు. కరోనా నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద కొవిడ్ నిబంధనలు అమలు చేయనున్నారు. ఇప్పటికే ఆయా కేంద్రాల్లో మార్కింగ్ వేశారు. బ్యాలెట్ పద్ధతిలో ఈ ఎన్నికల్లో ఓటు వేసేందుకు 18 రకాల గుర్తింపు కార్డులను రాష్ట్ర ఎన్నికల సంఘం అనుమతించింది. ఓటుహక్కు వినియోగించుకోవాలంటే ఎస్ఈసీ ప్రకటించిన గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి తప్పనిసరిగా పోలింగ్ కేంద్రానికి తీసుకెళ్లాల్సి ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా