విమానంలో ఒకే ఒక్కడు!

ఒక్క వ్యక్తి కోసం ఏకంగా ఓ విమానమే నడిచిన ఘటన బ్రిటన్‌లో శుక్రవారం చోటుచేసుకుంది.

Published : 04 Oct 2020 01:33 IST

లండన్‌: ఒక్క వ్యక్తి కోసం ఏకంగా ఓ విమానమే నడిచిన ఘటన బ్రిటన్‌లో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కరోనా వైరస్‌ సమయంలో ప్రవాసీయులను తరలించేందుకు బ్రిటన్‌ హోమ్‌ ఆఫీస్‌ ఏర్పాటు చేసిన ఈ విమానంలో నిజానికి 30 మంది వెళ్లాల్సి ఉంది. అయితే చివరి నిముషంలో న్యాయపరమైన చిక్కులు ఎదురవ్వటంతో 29 మంది ఆగిపోవాల్సి వచ్చింది. వారు బ్రిటన్‌ వదిలి వెళ్లకుండా ఉండేందుకు శరణార్థుల తరఫు న్యాయవాదులు చివరి క్షణం వరకు ప్రయత్నించారు. ఈ క్రమంలో వారి తరఫున వివిధ న్యాయస్థానాల్లో పిటిషన్లు వేశారు.
ఈ ప్రవాసీయులు న్యాయస్థానంలో దాఖలు చేసిన కారణాలు అర్థంలేనివని.. అయినా వాటిని న్యాయస్థానం స్వీకరించిందని ఓ ఉన్నతాధికారి వాపోయారు. వారు దేశాన్ని వదిలి వెళ్లకుండా ఉండేందుకే విమానం బయలుదేరే చివరి నిముషంలో కోర్టుకు అప్పీలు చేసుకున్నారని ఆయన ఆరోపించారు. దీంతో మిగిలిన ఒక్క ప్రయాణికుడితో ఆ విమానం ఫ్రాన్స్‌కు బయలుదేరింది. అందులో ప్రయాణించింది సూడాన్‌కు చెందిన ఓ వ్యక్తి. కాగా, ఈ ‘ఒకే ఒక్కడి’ కోసం అయిన ఖర్చు 1,00,000 పౌండ్లు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని